Wednesday, April 18, 2012

విద్య హక్కే, కానీ అంగడి సరకే!

సూర్యా దినపత్రిక , ఏప్రిల్ ౧౯ ,2012

- హక్కుల పరిరక్షణలో ఒక ముందడుగు
- సామాజిక న్యాయానిి మొదటి మెట్టు విద్యే
- విద్యా హక్కును 10+2 వరకూ విస్తరించాలి
- ప్రభుత్వ విద్యారంగాన్నీ పటిష్ఠ పరచాలి
- జీడీపీలో 6 శాతం కేటాయింపు అవసరం


bc-hostel-studentsవిద్యా హక్కు చట్టంపై, దాని అమలుపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుండి సహాయం పొందనప్పటికీ ప్రైవేటు రంగంలో నిర్వహిస్తున్న మైనారిటీయేతర పాఠశాలలలో వెనుకబడ్డ కుటుంబాల పిల్లలకు 25 శాతం సీట్లను చట్టం ప్రకారం విధిగా కేటాయించాల్సిందే అన్న సుప్రీం కోర్టు తీర్పు పిల్లల హక్కుల పరిరక్షణలో ఒక ముందడుగు మాత్రమే. అయితే దీని అమలు విషయమే అనుమానాలు రేకెత్తిస్తోంది. పౌరులందరూ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాన్ని పొందడానికి ఉపకరించే శక్తివంతమైన సాధనం విద్య. విద్యను ఒక ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో పొందుపరచడానికే స్వాతంకత్య్రానంతరం అరవై ఏండ్లకు పైగా సమయం పట్టింది. ‘విద్య ప్రత్యేక సౌకర్యం కాదు, ప్రాథమిక హక్కు’ అనే నినాదంతో విద్యార్థి సంఘాలు, మేథావులు, పలు సంస్థలు దశాబ్దాలుగా వివిధ రూపాలలో చేసిన అలుపెరగని ఉద్యమాల ఫలితం. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం పాక్షికంగా ఆమోదించడం వల్ల ‘విద్యా హక్కు చట్టం- 2009’ ఆవిష్కృతమైంది. 2010 ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి వచ్చింది.

ప్రస్తుతం 6-14 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని రాజ్యాంగంలోని 21(ఎ) అధికరణ స్పష్టం చేస్తున్నది. 1- 8వ తరగతి వరకు మాత్రమే చట్టాన్ని పరిమితం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ అంటే ఎల్‌కేజీ, యూకేజీ స్థాయిలోనే ప్రైవేట్‌ విద్యాసంస్థలు పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా ప్రవేశ పరీక్షలు నిర్వహించి మరీ చేర్చుకొంటున్నాయి. అలాంటి పాఠశాలల్లో పేద విద్యార్థులు నేరుగా 1వ తరగతిలో ప్రవేశించి నెగ్గుకురాగలరా? అలాగే రాజ్యాంగం మేరకు 18 సంవత్సరాల వయస్సు లోపు వారిని పిల్లలుగానే పరిగణిస్తున్నారు. పిల్లల హక్కుల పరిరక్షణ, వారి ఎదుగుదల, అభివృద్ధి పట్ల సామాజిక బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలంటే కనీసం 10+2 విద్య కల్పించే వరకైనా ఈ హక్కును విస్తరించాలి. పన్నెండు సంవత్సరాల పాటు విద్య పిల్లల హక్కుగా అంతర్జాతీయ సమాజమే గుర్తించింది. ఆ పరిపూర్ణమైన దృష్టితో చట్టాన్ని రూపొందించ కుండా లోపభూయిష్టంగా తీసుకొచ్చారు. అమలు పట్ల కూడా చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు. పర్యవసానంగా విద్య ఆచరణలో అందని ద్రాక్ష పండు లాగే అందరికీ అందుబాటులోకి రాలేదు.

నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు బలైన రంగాలలో విద్యా రంగం మొదటి. ఒకనాడు ప్రభుత్వంతో పాటు ట్రస్టులు, సొసైటీలు అన్నింటికన్నా విద్యా దానం మిన్న అని భావించి విద్యా సంస్థలను నెలకొల్పి సామాజిక సేవలో అనిర్వచనీయమైన తృప్తి పొందేవి. అయితే ఆ చరిత్ర తిరగబడింది. విద్య అంగడి సరుకుగా మారిపోయింది. భారత రాజ్యాంగలోని 19(1) (జి) అధికరణ ప్రకారం ఏ వ్యాపారమైనా చేసేందుకు, నిర్వహించేందుకు పౌరులకు హక్కు ఏర్పడింది. దానిని ఉపయోగించుకొని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ‘విద్యా హక్కు చట్టం’ అమలుకు తూట్లు పొడవాలని అత్యున్నత న్యాయస్థానం తలుపులు తట్టారు. తీర్పు వారికి ప్రతికూలంగా వచ్చింది.

అసలు మౌలికమై సమస్య- ‘రాజ్యాంగం లోని 19(1) (ఎ) నిబంధన ప్రకారం విద్యారంగాన్ని కూడా వ్యాపారరంగంగా భావించవచ్చా’ అన్న మౌలికమైన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉన్నది. పట్టణీకరణ పర్యవసానంగా జనాభాలో మూడో వంతుమంది పట్టణాలు, నగరాలలో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాలు విద్యా వ్యాపారుల నిలయాలుగా ఆవిర్భవించాయి. అధిక లాభాలకోసం భారీ పెట్టుబడులతో విద్యా సంస్థలను నెలకొల్పి వ్యాపారం చేస్తూ, ప్రైవేటు యాజమాన్యాలు సంపాదన బాగా రుచి మరిగాయి. సేవా భావంతో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న వారు అసలే లేరని కాదుగానీ, అత్యధికులకు మాత్రం అది వ్యాపారమే.

పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కానీ, ఆ బాధ్యతనుంచి తప్పించుకొనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇప్పటికీ 80 శాతం ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. కానీ అవి మౌలిక వసతులు కరువై కునారిల్లి పోతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో 27 శాతం మంది మాత్రమే విద్యనార్జిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలే శరణ్యం. 84 శాతం మంది పిల్లలు వాటిలోనే విద్యనార్జిస్తున్నారు. నాణ్యమైన విద్యను పౌరులందరికీ అందించేందుకు 6 శాతం నిధులను విద్యారంగానికి కేటాయించాలని కొఠారీ మిషన్‌ మొదలుకొని విద్యా రంగంపై నివేదికలు సమర్పించిన పలు కమిషన్లు సిఫారసు చేశాయి. యూపీఏ 1 ప్రభుత్వం తన కనీస ఉమ్మడి కార్యక్రమంలో కూడా ఈ మేరకు హామీ ఇచ్చినా దానిని గాలికి వదిలేసింది.

ప్రస్తుతం దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతానికి అటు ఇటుగా నిథులను కేటాయిస్తున్నారు.
చట్టంలో పొందుపరచిన పరిమితమైన లక్ష్యాన్ని సాధించడానికి కూడా నిథుల లేమి ప్రధాన అవరోధంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఆదాయపు పన్ను , కార్పొరేషన్‌ పన్ను, సేవా పన్ను , ఎక్సజ్‌ అండ్‌ కస్టమ్స్‌ డ్యూటీస్‌ వగైరా అన్ని రకాల పన్నుల చెల్లింపులపై అదనంగా ప్రజల నుండి 2 శాతం ప్రాథమిక విద్యా సెస్‌ను ( + మరొక ఒక శాతం ఉన్నత విద్యా సెస్‌) వసూలు చేస్తున్నది. ఈ విధానాన్ని ప్రవేశ పెట్టిన 2004-05 నుండి 2011-12 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో లక్ష కోట్లకు పైగా ఆదాయం ఈ పద్దు క్రింద ప్రభుత్వ ఖజానాకు చేరిందని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. సెస్‌ ద్వారా ఆర్జిస్తున్న మొత్తానికి అదనంగా ప్రభుత్వం వెచ్చిస్తున్నది 30-35 శాతానికి మించి ఉండడం లేదు.

విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి నిథుల కేటాయింపు పెంచాలని, 2011-12లో రూ. 35,659 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన అనిల్‌ బోర్డియా కమిటీ సిఫార్సు చేసినా, కేటాయించింది రూ.21,000 కోట్లు మాత్రమే. రాష్ట్రాలు భరించాల్సిన నిష్పత్తి సొమ్ము వెచ్చించక పోవడంతో ఆ మొత్తాన్ని కూడా పూర్తిగా ఖర్చు చేయలేదు. 2012-13 బడ్జెట్‌ లో రూ.25,555 కోట్లు కేటాయించారు. దేశంలోని పిల్లలందరికీ ఉచిత విద్య అందించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు కపిల్‌ సిబాల్‌ చేతులెత్తేశారు. ప్రైవేటు రంగం భుజం మోపాలని కోరారు. కార్పొరేట్‌ సంస్థలు సామాజిక బాధ్యతగా ఈ పని చేయాలని, మిగిలిన ప్రైవేటు విద్యాసంస్థల్లో ఏవైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందని పాఠశాలలున్నాయో వాటికి బోధనా ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. ఇక్కడ మన రాష్ట్ర అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి.

వృత్తి విద్యా కోర్సులు అధ్యయనం చేస్తున్న బీసీ, ఓబీసీ విద్యార్థులకు బోధనా ఫీజులు చెల్లించే రాష్ట్ర ప్రభుత్వ పథకం అమలు తీరుతెన్నుల బాగోతం చూస్తూనే ఉన్నాం. ఈ పథకాన్ని నమ్ముకొని కళాశాలల్లో చేరిన విద్యార్థులు ఫీజులు అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలు. ప్రైవేటు విద్యా సంస్థలు కేవలం బోధనా రుసుం రూపంలోనే కాదు, వివిధ రకాల పద్దుల కింద అధిక ఫీజులు వసూలు చేసుకొంటున్నాయి. ఫీజులను నియంత్రించే యంత్రాంగమే లేదు. వాటిని ప్రభుత్వం చెల్లించదు. పేద విద్యార్థి తల్లిదండ్రులకు వాటిని చెల్లించే స్తోమత ఉండదు. అంటే, అలాంటి విద్యా సంస్థ గుమ్మం తొక్కే అర్హతే పేద పిల్లలకు లేదన్న మాట. సంపాదనే ధ్యేయంగా విద్యా వ్యాపారం చేస్తున్న సంస్థలు ప్రభుత్వ మొర ఆలకిస్తాయా అన్నది ప్రశ్న. మరొకవైపు రెసిడెన్షియల్‌ పాఠశాలలకు చట్టం వర్తించదని తేల్చేశారు.

ప్రభుత్వాల ఒత్తిడికి తలవొగ్గి ప్రైవేటు రంగంలోని చిన్న, మధ్య తరహా పాఠశాలల యాజమాన్యాలు కొంత వరకు అమలు చేయవచ్చు. ఆ మేరకు ఆదాయంలో వచ్చే తరుగుదలను భర్తీ చేసుకోవడానికి మిగిలిన 75 శాతం సామాన్య, మధ్య తరగతి కుటుంబాల పిల్లల నుండి వసూలు చేసే ఫీజులను పెంచే ప్రమాదం ఉన్నది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ పేద పిల్లలకు తమ విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లను కేటాయించి ఉచిత విద్యను అందించే గురుతరమైన సామాజిక బాధ్యతను విద్యా రంగంలో బలంగా వేళ్ళూనుకొన్న కార్పొరేట్‌ సంస్థలు, విస్తారంగా బ్రాంచీలను నెలకొల్పి రెండు చేతులా కోట్ల రూపాయల ధనార్జన చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు స్వచ్ఛందంగా నిర్వర్తిస్తాయనుకోవడం ఒక భ్రమ.

మన దేశంలో ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్యా రంగం వరకు ప్రైవేటు విద్యా సంస్థలు తమ కబంధ హస్తాల్లో ఇరికించుకోవడానికి మార్కెట్‌ ఆర్థిక విధానాలు చక్కగా చేయూత నిచ్చాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఏసీ గదుల్లో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, మౌలిక సదుపాయాలతో నిర్వహిస్తున్న ఉన్నత శ్రేణి పాఠశాలలని ప్రచార హోరుతో సంపన్న వర్గాలను ఆకర్షించి, ఒకటి నుండి పదవ తరగతి చదువుతున్న ఒక్కొక్క విద్యార్థినుండి నాలుగైదు లక్షల రూపాయలను వార్షిక ఫీజుగా గుంజుకొంటున్న ప్రైవేటు విద్యాసంస్థల్ని డిల్లీ తదితర మెట్రో పాలిటన్‌ నగరాలలో నిర్వహిస్తున్నారు. లక్షల రూపాయలు వసూలు చేస్తున్న కార్పొరేట్‌ స్కూళ్ళు హైదరాబాద్‌లో చాలానే ఉన్నాయి.

ఉన్నత విద్యా ప్రమాణాలు, విలాసవంతమైన సౌకర్యాలు, క్రీడా సదుపాయాలు, పోషకాహారం, జాతీయ- అంతర్జాతీయ స్టడీ టూర్లు వగైరా మాయ మాటలు చెప్పి విద్యా వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నాయి. ఈ తరహా కార్పొరేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు 25 శాతం సీట్లలో పేద పిల్లలకు ప్రవేశం కల్పించి, ఉచిత విద్యను అందిస్తాయా? ఈ నిబంధనను అడ్డం పెట్టుకొని తెరవెనుక సీట్లు అమ్ముకొని, నల్ల ధనాన్ని చేతులు మార్చుకొని, పేద పిల్లలకు ఇచ్చినట్లుగా రికార్డులు సృష్టించడంలో ఆరితేరారు. అదే తంతు ఈవాళ ప్రైవేటు మెడికల్‌ కళాశాలల యాజమాన్య కోటా అడ్మిషన్స్‌లో జరుగుతున్నది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారమైతే బహిరంగ ప్రకటన విడుదల చేసి, దరఖాస్తులు స్వీకరించి, మార్కుల ప్రాతిపదికపై మెరిట్‌ లిస్టు తయారు చేసి, ఆ ప్రకారం అడ్మిషన్లు నిర్వహించాలి. కానీ అలా జరగడం లేదు. ఆ సీట్ల గురించి ఎవరైనా విచారిస్తే అయిపోయాయన్న సమాధానం వెంటనే వస్తుంది. సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి కార్పొరేట్‌ సంస్థలు ప్రత్యేకంగా నిథులను సమకూర్చుకోవచ్చని కపిల్‌ సిబాల్‌ సలహా కూడా ఇచ్చారు. ఈ పేరుతో రాబోయే రోజుల్లో వారికి మరికొన్ని రాయితీలు కల్పించి, ఆర్థిక ప్రయోజనం కల్పించే ఆలోచన ఉన్నట్లు బోధడుతున్నది .

ప్రభుత్వం, స్థానిక స్వపరిపాలనా సంస్థలు నిర్వహించిన వీధి బడుల్లో చదువుకొన్నవారమని పెద్దలు కొందరు గర్వకారణంగా చెబుతుంటారు. నిజమే, నాడు విద్యార్జనకు అవే కేంద్రాలు. కాలం మారింది. ప్రభుత్వాల విధానాల్లో మౌలికమైన మార్పులు చోటు చేసుకొన్నాయి. మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ సిద్ధాంత భావజాలం అందలమెక్కింది. ప్రతిదీ సరకుగా మారింది. విద్యకూ మినహాయింపు లేదు. వృత్తి విద్య, ఉన్నత విద్యే కాదు, ప్రాథమిక విద్య కూడా లాభార్జనే ధ్యేయంగా నిర్వహిస్తున్న కార్పొరేట్‌ విద్యాసంస్థల కబంద హస్తాల్లో చేరింది. ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు కుప్పకూలి, మౌలిక సదుపాయాల లేమితో, నాసిరకం విద్యాబోధనకు నిలయాలుగా అపవాదును కూడగట్టుకొన్నాయి.

నాణ్యమైన విద్యా ప్రమాణాలతో ఈ పోటీ ప్రపంచంలో ధీటుగా నిలబడ్డ ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు లేవని కాదు. కేవలం కార్పొరేట్‌, ప్రైవేటు రంగంలోని పాఠశాలల్లోనే నాణ్యతా ప్రమాణాలతో కూడుకొన్న విద్య లభిస్తుందన్నది పాక్షిక సత్యమే . కానీ ప్రభుత్వ రంగ విద్యావ్యవస్థపై ముప్పేట దాడి జరుగుతున్నది. ప్రభుత్వ లోపభూ యిష్ఠ విధానాలతో ఈ రంగం సహజ మరణం బాటలో ప్రయాణిస్తున్నది. విద్యా రంగంలో వివక్ష బలంగా వేళ్ళూనుకొన్నది. సంపన్నులు, మధ్య తరగతి, పేదలు వారివారి ఆర్థిక స్థితిగతులను బట్టి, అంటే కొనుగోలు శక్తి ఆధారంగా విద్యను పొందవచ్చు.

ఈ పరిస్థితి మారాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పటిష్ఠమైన కార్యచరణతో విద్యాహక్కుచట్టం అమలుకు అంకితభావంతో పూను కోవాలి. ప్రైవేటురంగంలోని పాఠశాలలపైనే ఆధారపడకుండా ప్రభుత్వ పాఠశా లల వ్యవస్థను విస్తరించడం, జీడీపీలో 6 శాతం నిధులను కేటాయించి, మౌలిక సదుపాయాలను కల్పించి, విద్యాప్రమాణాలను మెరుగు పరచి నాణ్యమైన విద్యను 10+2 వరకు అందించే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి.

Friday, April 13, 2012

ముడుపుల ముట్టడిలో రక్షణ!

సూర్యా దినపత్రిక, ఏప్రిల్ 10, 2012

ప్రధాన మంత్రికి పదాతిదళాల ప్రధానా ధికారి వి.కె.సింగ్‌ వ్రాసిన ఉత్తరం లీక్‌ కావడం, నాసిరకం సైనిక వాహనాల కొనుగోలుకు రు. 14 కోట్ల లంచం ఇవ్వజూపినట్లు, ప్రస్తుతం సైన్యం వద్ద రెండు రోజులకు సరిపడేంత ఆయుధ సంపత్తి మాత్రమే ఉందని అందులో పేర్కొనడం లాంటి తీవ్ర ఆందోళన కలిగించే అంశాలు బిహ ర్గతమయిన పూర్వరంగంలోనే వెలు గు చూసిన ఈ వార్త సహజంగానే రాజకీయ వ్యవస్థలో వేడి పుట్టించింది. దేశ ప్రతిష్టను, సైనిక దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బదీసే ఘటనలుగా వీటిని పరిగణించాలి. భద్రతాపరంగా దేశం పెను సవాళ్ళను ఎదుర్కొంటున్నది. ఇరుగు పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు ఆరోగ్యకరంగా లేవు. కాశ్మీరు సమస్య రావణా సురుని కాష్ఠంలా రగులుతూనే ఉన్నది.

పాకిస్తాన్‌ శతృపూరిత వైఖరిలో మౌ లికమైన మార్పు గోచరించడం లేదు. పైపెచ్చు ఆ దేశంలో ప్రజా స్వామ్యం వేళ్ళూనుకోకుండా ఆ దేశ సైన్యం శిఖండిలా అడ్డుపడుతున్నది. మనదేశంతో గిల్లికజ్జాలు పెట్టుకొంటున్నది. నిరంతరం సరిహద్దు ఉద్రిక్తతల మధ్య సహజీ వనం గడపాల్సిన దుస్థితి నెల కొని ఉన్నది. ఐ.యస్‌.ఐ. తర్ఫీదు, ప్రోత్సాహం తో సీమాంతర ఉగ్రవాద శక్తులు మన దేశంపై కక్ష గట్టి, దొంగ దెబ్బలు కొడుతున్నాయి. మన రక్షణ వ్యవస్థల కన్నుగప్పి దేశంలో అక్రమంగా చొర బడి మారణహోమాలు సృష్టిస్తున్నారు. పార్లమెంటుపై ముష్కరుల దాడి, ఆర్థి క నగరంగా పేరుగాంచిన ముంబాయి మహానగరంపై బాంబులతో దాడి, పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో బాం బుపేలుళ్ళు, హైదరాబాదు మొదలుకొని దేశంలోని నలుమూలలా సంభవిం చిన బాంబు పేలుళ్ళ సంఘటనలు దేశ భద్రతకు గొడ్డలి పెట్టు లాంటివి. ప్రజ ల ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి.

పోనీ మిగిలిన ఇరుగుపొరుగు దేశాలైన చైనా, శ్రీలంక, నేపాల్‌, బాంగ్లా దేశ్‌, బర్మాలతో విశ్వసనీయమైన, నమ్మశక్యమైన దౌత్య సంబం ధాలున్నాయా అంటే అదీలేదు. అపనమ్మకాల మధ్యకాలం వెళ్ళబుచ్చు తున్నాము. ఈశాన్య ప్రాంతంలో చొరబాటుదారులు సమస్య పెద్ద తల నొప్పిగా మారింది. ఆంత రంగికంగా మతోన్మాద శక్తులు, అతివాద తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాలుగా నిలిచాయి. పర్యవసానంగా రక్షణ రంగా నికి మన వార్షిక బడ్జెట్స్‌లో సింహభాగం కేటాయిస్తున్నారు. 200506 ఆర్థిక సంవత్సరంలో రు.80,549 కోట్లు ఖర్చుచేస్తే 2012-13లో ఏకంగా రు.1,93,408 కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధిక భాగం రక్షణ కొనుగోళ్ళకు వెచ్చిస్తున్నారు. ప్రణాళికేతర పద్దుక్రింద రు.1,13,829 కోట్లు. ప్రణా ళిేతర పెట్టుబడి వ్యయం పద్దు రు.79,579 కోట్లు ఉన్నది. అంటే ఆయుధసంపత్తి సేకరణ, ఆధునీకీకరణ, సైనికదళాల శిక్షణ వగైరా అవసరాల కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తున్నది.

రక్షణ శాఖ జమా, ఖర్చులపై ఆడిట్‌ చేసే అధికారం కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సంస్థకు లేకపోవడంతో అడ్డగోలు వ్యవహారా లకు అడ్డాగా తయారయ్యింది. ఆయుధ సంపత్తిని బలోపేతం చేసుకోనే ప్రక్రియ లో అంతర్భాగంగా చేసే కొనుగోళ్ళకు నిర్దిష్టమైన నియమనిబంధనలు పాటిం చకపోవడం, పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడం అవినీతి రాజ్యమే లడానికి అవకాశం కల్పించింది. రక్షణ శాఖకు భారీ నిథుల కేటాయింపులు ఉండడంతో ఆయుధాలు, యుద్ధ విమానాలు తయారుచేసే బహుళజాతి సంస్థల డేగకన్ను మన రక్షణ రంగం పై దశాబ్దల క్రితమే పడింది. ఫలితంగా ఆయుధ సంపత్తి కొనుగోలు లావాదేవీ వ్యవహారాల్లో కత్రోచీ లాంటి దళారులు ప్రవేశించి, అవినీతిని ప్రోత్సహించి, రక్షణ వ్యవస్థనే భ్రష్టు పట్టించారు.

బోఫర్స్‌ కుంభకోణం మొదలుకొని కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల భౌతిక కాయాలను తరలించడానికి వినియో గించిన శవ పేటికల కొనుగోలు కుంభకోణం వరకు అవినీతి, అక్రమాల భాగోతాలు దేశ రక్షణ వ్యవస్థకే తలవంపులు తెచ్చాయి. గతంలో కొనుగోలు చేసిన బోఫర్స్‌ శతఘు్నలు వగైరా ఆయుధ సంపత్తికి నేడు విడి భాగాలూ, మందు గుండు సామగ్రి లభించక పోవడంతో ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్నామా? అన్న అనుమానాలు వస్తున్నాయి. దశాబ్దాల తదనంతరం కూడా మందు గుం డు సామగ్రిని, శవ పేటికలను కూడా తయారు చేసుకోలేనంత వెనుకబడి ఉన్నామా? స్వయంపోషకత్వాన్ని సాధించే వైపు ఎందుకు ప్రయాణం చేయ లేక పోతున్నాం ?

సైనిక దళాల ప్రధానాధికారి వి.కె.సింగ్‌ ఉత్తరంలో ప్రస్తావించినట్లు 600 నాసిరకం టెట్రా టెర్రాయిన్‌ సైనిక వాహనాలను (ట్రక్స్‌) 2010 సం.లో కొను గోలు చేయడానికి అనుమతిస్తే తనకు రు.14 కోట్లు లంచం ఇవ్వజూపిన విష యం వాస్తవమైతే అవినీతిచెదలు ఏ స్థాయిలో విస్తరించిందో స్పష్టమవుతున్న ది. ఉత్తరం ఎలా బహిర్గతమయ్యిందన్నది ఒక చిదంబర రహస్యమైతే, అసలు ఆ ఉత్తరంలోని అంశాలు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురి చేశాయి. దానిపై ప్రధాన మంత్రిగానీ లేదా రక్షణశాఖా మంత్రిగానీ ఎందుకు తక్షణం స్పందించి, సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకో లేదో ! జాతికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. దేశ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తూ, అత్యంత ఉన్నతస్థానంలో ఉన్న తనకు లంచం ఇవ్వజూపిన దుష్టశక్తులపై ఎందుకు సైనిక దళాల ప్రధానాధికారి చర్యలు తీసుకోలేదో కూడా బహిర్గతం చేయాల్సి ఉంది.

ఏదైనా ఉపద్రవం జరిగి ఇప్పటికిప్పుడు యుద్ధమంటూ జరిగితే రెండు రోజులకు సరిపడ ఆయుధ సంపత్తి మాత్రమే ఉన్నదని సైనిక దళాల ప్రధానా ధికారి పేర్కొనడం వాస్తవమైతే తీవ్ర ఆందోళన కలిగించే అంశమే. ఎందుచేత ఈ సమస్య ఉత్పన్నమయ్యిందనేదే అసలు సమస్య. గడచిన కొన్ని దశాబ్దా లుగా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి సముపార్జించుకొన్న ఆయుధ సం పత్తి అంత నిరుపయోగంగా తయారయ్యిందా! దీనికి కారణం పాత సాం ేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ఆయుధాలకు విడి భాగాలు లభించక పోవ డమేనా ? చైనా, పాకిస్తాన్‌ బూచి చూపెట్టి దారిద్య్రం, నిరుద్యోగం, పిల్లలు, గర్భిణీ మహిళల్లో పౌష్టికాహార లోపం లాంటి తీవ్రమైన సమస్యల పరిష్కా రానికి గానీ, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలులాంటి రంగాలకు అవసరమైన నిధులను కేటాయించకుండా, వార్షిక బడ్జెట్స్‌లో రక్షణ శాఖకు పుష్కలంగా నిథులను కేటాయిస్తున్నా ఈ దుస్థితి నెలకొనడానికి దారి దీసిన కారణా లేంటో! నిగ్గుదేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది.

రక్షణ రంగంపై చైనా 16.1 శాతం మేరకు బడ్జెట్‌ నిథులను వ్యయం చేస్తుంటే మన ప్రభుత్వం 16.4 శాతం ఖర్చు చేస్తున్నది. స్థూల జాతీ యోత్ప త్తిలో చైనా 2.1 శాతం వ్యయం చేస్తుంటే మనం 2.7 శాతం వెచ్చిస్తున్నాం. కాకపోతే వారికీ, మనకు ఒక తేడా ఉన్నట్లు చెప్తున్నారు. అత్యాధునిక ఆయుధాల కొనుగోలుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సంపాదించు కొని తదనంతర కాలంలో చైనా సొంతంగా ఆయుధాలను, విడి భాగాలను ఉత్పత్తి చేసుకొనే సామర్థ్యాన్ని సాధించుకొంటున్నది. కానీ స్వదేశంలో ఉత్ప త్తి చేసుకోగలిన ఆయుధాలను, వాహనాలను, విడిభాగాలను కూడా విదేశాల నుండి దిగుమతి చేసుకోవడానికే మన ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తున్నది. అలాగే ఎక్కువ ఖరీదు పెట్టి తక్కువ ఆయుధ సంపత్తిని పొందుతున్న దేశాల సరసన ఉన్నామని కూడా వార్తలు చెబుతున్నాయి.

టాటా కంపెనీ దేశీయంగానే నాణ్యమైన సైనిక వాహనాలను ఉత్పత్తి చేసి సరఫరా చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినా రక్షణ శాఖ ఆసక్తి కనబరచ లేదన్న సమాచారాన్ని ఆ సంస్థ ప్రతినిథులే వెల్లడించారు. దాన్నిబట్టి కిక్‌ బాక్స్‌ స్వీకరించడానికి విదేశీ గడ్డ అన్ని విధాలా అనువైనదని దళారులు, ఉన్న తాధికారులు, రాజకీయ నాయకత్వం భావిస్తున్నట్లుంది. కారణం పుచ్చుకొన్న అవినీతి సొమ్మును స్విస్‌ బ్యాంకుల్లో పదిలంగా దాచుకొనే సౌలభ్యం ఉంది కాబట్టే. మన దేశానికి చెందిన ఘరానా పెద్ద మనుషుల స్విస్‌ బ్యాంకు ఖాతా ల్లో ఈ తరహా అవినీతి, పన్ను ఎగవేత ద్వారా ఆర్జించిన సొమ్ము దాదా పు రు.74,00,000 కోట్లు ( రు.24,00,000 కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రే ప్రకటించారు) పోగుపడ్డదని కోడై కూస్తున్నది. ఆ నల్లధనాన్ని స్వదేశానికి రప్పించాలని, అవినీతిని కూకటి వేళ్ళతోపెకలించాలని పెద్ద ఎత్తున ఉద్యమా లు జరుగుతున్న నేపథ్యంలోనే మరొకసారి రక్షణరంగంలోని అవినీతి సమస్య గుప్పుమనడం కళంకం తెచ్చి పెట్టింది.

రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల లో భాగంగా రక్షణ రంగంలోకి కూడా ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పి.పి.పి.) ముసుగులో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం ద్వారాలు తెరుస్తు న్నది. ఈ లోపభూయిష్టమైన విధానాల మూలంగా దేశ భద్రతకు, రక్షణ రం తగం సమాచారానికే రక్షణ కొరవడే ప్రమాదం ముంచుకొస్తున్నది. సరిహద్దు దేశాలతో దౌత్యపరమైన మైత్రి సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా రక్షణరంగంపై చేస్తున్న ఖర్చును తగ్గించుకోవడానికి, అవినీతిని అరికట్టి ప్రజా దనం దుర్వినియోగం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభు త్వం అమలు చేయాలి.
మన దేశంతో పాటు శ్రీలంక, బాంగ్లాదేశ్‌, నేపాల్‌, మాల్దీవ్స్‌ సరిహద్దుల్లో ప్రత్యేక సైనిక దళాలు తిష్టవేసిన నిప్పులాంటి నిజాన్ని అమె రికా పసిఫిక్‌ కమాండర్‌ అడ్మిరల్‌ రోబెర్ట్‌ విల్లాడ్‌ యు.యస్‌.ఎ. కాం గ్రెషనల్‌ కమిటీకి ఈ ఏడాది మార్చిలో నివేదించిన విషయం వెల్లడయ్యింది. అయినా మన పాలకులు అది అవాస్తమని కొట్టిపారేస్తున్నారంటే అమెరికాతో కుదుర్చుకొన్న వ్యూహాత్మక ఒప్పందాల్లో ఇవన్నీ అంతర్భాగమేమోననిపి స్తుం ది. వాస్తవానికి విదేశాంగ విధానాలలో మన ప్రభుత్వ లొంగుబాటు వైఖరి పర్యవసానంగా దేశ రక్షణ వ్యవస్థ పెను సవాళ్ళును ఎదుర్కొంటున్నది. దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి మౌలికమైన అంశాలపైన ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

Tuesday, March 13, 2012

రానున్న కేంద్ర బడ్జెట్‌లో ఉన్నత విద్య వాట ఎంత?

సూర్య దినపత్రిక మార్చి 14,2012

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ 2012-13 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి ఉద్యుక్తులవుతున్నారు. కార్పొరేట్‌ సంస్థల అధిపతులు, బడా పారిశ్రామికవేత్తలు, వాణిజ్య వర్గాల ఒత్తిళ్ళ మధ్య బడ్జెట్‌ రూపకల్పన జరుగుతుందనడం జగమెరిగిన సత్యం. సంపన్నులకు రాయితీ లివ్వడంలో చూపే శ్రద్ధ దేశ సమగ్రాభివృద్ధికి, మానవనరుల అభివృద్ధికి ఉపకరించే విద్య, ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం వగైరా పద్దులకు నిథుల కేటాయింపులపై కనబరచడం లేదు. విద్య మార్కెట్‌ సరకుగా మారిపోయాయి. దిగువ మధ్య తరగతి, పేదలు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో లేకుండా పోయింది. 2010 విద్యారంగాన్ని మరింత లాభసాటి వ్యాపారానికి అనువైన రంగంగా మార్చివేస్తున్నారు. విద్య ఒక ప్రత్యేక సౌకర్యంగా కాక ఒక ప్రాథమిక హక్కుగా అందరికీ అందించాల్సిన రాజ్యాంగ బద్దమైన, సామాజిక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.

కాని నిథుల కేటాయింపులో సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నది. పాఠశాల గడప తొక్కిన విద్యార్థుల్లో 15 శాతం మంది మాత్రమే ఉన్నత విద్యావకాశాలను అందుకోగలుగుతున్నారు. విద్యపై భారత్‌- అమెరికాల మధ్య జరిగిన దౌత్యపర సమ్మేళనం అనంతర పరిణామాలను గమనిస్తే, విద్యా వ్యవస్థను మరింత భ్రష్ఠు పట్టించే వైపే కేంద్ర ప్రభుత్వం ప్రయాణిస్తున్నదన్న విషయం రూఢి అవుతున్నది. రానున్న దశాబ్ద కాలంలో దాదాపు వెయ్యి విదేశీ విశ్వవిద్యాలయాలను, యాబై వేలకు పైగా కళాశాలలను మన దేశంలో నెలకొల్పుకోవడానికి అనుమతించబోతున్నట్లు వస్తున్న వార్తలు తీవ్రఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దుష్పరిణామం మన విద్యా రంగానికి అత్యంత ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది . ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం ముసుగులో విద్యారంగాన్ని గంప గుత్తగా ప్రయివేటీకరించే దురాలోచనతో ప్రభుత్వం ప్రయాణాన్ని సాగిస్తున్నది.

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, ఐ.సి.హెచ్‌.ఆర్‌., ఐ.సి.యస్‌.ఆర్‌. తదితర ప్రభుత్వ సంస్థల నిథులతో, మౌలిక సదుపాయాలతో, ఉచితంగా లేదా నామమాత్ర ధరలకు వందల ఎకరాల భూములను సమకూర్చిన విద్యా సంస్థలను ఈరంగంలో మాఫియాలుగా ఆవిర్భవించిన దుష్ట శక్తులకు పథకం ప్రకారం ధారాదత్తం చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉన్నట్లు కనబడుతున్నది.18 సంవత్సరాల వయసు వరకు పిల్లలందరికీ ప్రాథమిక హక్కుగా నిర్బంధ- ఉచిత విద్యను ప్రభుత్వం విధిగా అందించాలి. శాస్త్ర, సాంకేతిక విద్య- నాణ్యమైన ఉన్నత విద్యను అందరికీ అందుబాటులో ఉండేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. దాన్ని సాఫల్యం చేసే దృష్టితో వార్షిక బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉండాలి.18 నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న 1.46 కోట్ల మంది యువతీ యువకులు ప్రస్తుతం దేశ వ్యాపితంగా ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో విద్యనార్జిస్తున్నారు. మన దేశ అవసరాలకు అనుగుణంగా వివిధ రంగాలకు కావలసిన విద్యాధిక నిపుణులను ఈ ఉన్నత విద్యా సంస్థల నుండే సముపార్జించుకోవాలి .

గడచిన కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థల నాణ్యత క్షీణిస్తూవస్తున్నది. దీనికి నిథుల లేమి ఒక ముఖ్యమైన కారణం. పర్యవసానంగా ఈ కళాశాలల నుండి డిగ్రీ , పోస్టు గ్రాడ్యువేట్‌ పట్టభద్రులై వస్తున్న యువతలో నాణ్యతా ప్రమాణాలు పడిపోతున్నాయన్న ఆందోళన వ్యక్తమతున్నది. అలాగే కొత్తగా బి.ఇ./ బి.టెక్‌., యం.బి.ఎ. వగైరా పట్టబద్రులైన వారిని ఉద్యోగాల్లో నియమించుకొన్న సంస్థలు అధిక మొత్తంలో నిథులు వెచ్చించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, తమకు కావలసిన రీతిలో తీర్చిదిద్దుకొంటున్నాయి. పట్టభద్రులవుతున్న యువతలో 20-25 శాతానికి మించి ఉపాథి లభించడం లేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ పూర్వరంగంలో 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో అదనంగా కోటి మందికి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం కల్పించాలన్న లక్ష్యాన్ని వ్యూహ పత్రాల్లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా మౌలిక వసతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది నియామకం జరగాలి. తదనుగుణంగా నిథుల కేటాయింపు పెంచాలి.

స్థూల జాతీయ ఉత్పత్తి (జి.డి.పి.)లో 6 శాతం నిథులను విద్యా రంగానికి కేటాయిస్తామని యు.పి.ఎ-2 ప్రభుత్వం చేసిన వాగ్దానం, వాగ్దానంగానే మిగిలిపోయింది. మొత్తం విద్యా రంగానికి 3 శాతానికి మించి నిథులు మంజూరు చేయడం లేదు. అందులో ఉన్నత విద్యపై 1.12 శాతం నిథులు వెచ్చిస్తున్నారు. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పైనాన్స్‌ బ్యాంకు (యన్‌.ఇ.ఎఫ్‌.బి.) ను నెలకొల్పి తక్కువ వడ్డీతో విద్యార్థులకు రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించినా ఆచరణలో అడుగు ముందుకు పడలేదు. అధిక వడ్డీ రేటు, కఠిన నిబంధనల కారణంగా అర్హులైన విద్యార్థులు రుణాలు పొందలేక పోతున్నారు. ప్రస్తుతం 1.5 శాతం మంది మాత్రమే రుణాలు తీసుకొని, ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ పూర్వరంగంలో రానున్న బడ్జెట్లో కేటాయింపులపై ఆధారపడి ఉన్నత విద్యారంగం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

మన రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలు, కళాశాలల ఆర్థిక పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జీత భత్యాల కోసం ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రంలో 32 విశ్వవిద్యాలయాలుంటే, వాటిలో 15 విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం లేదా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నుండి సహాయం పొందే అర్హత లభించ లేదు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపైనే అవి ఆర్థికంగా ఆధారపడి మనుగడ సాగించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిరాదరణతో అవఇభివృద్ధికి నోచుకోవడం లేదు. మరొకవైపు యు.జి.సి. సహాయం అందుకొంటున్న ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలూ నిథుల కొరతతో సంక్షోభంలో కొట్టుమిట్టాడ్డుతున్నాయి.ఇదే తరహాలో దేశవ్యాపితంగా ఉన్న విశ్వవిద్యాల యాలు, కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఆర్థిక వనరుల లేమితో కునారిల్లిపోతున్నాయి. దేశంలో ప్రస్తుతం 44 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 285 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, వంద దాకా స్వయం ప్రతిపత్తి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
ఇవిగాక 107 ప్రయివేటు విశ్వ విద్యాలయాలున్నాయి. 16,000కు పైగా కళాశాలలున్నాయి. విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థలోకి అడుగిడుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యాసంస్థలకు ఆర్థిక పరిపుష్ఠిని కల్పించి, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. ఆ బాధ్యతను గుర్తెరిగి కేంద్ర బడ్జెట్లో నిథుల కేటాయింపు జరపాలి.

Tuesday, March 6, 2012

నడిబజారులో ‘నవరత్నాలు’

సూర్య దినపత్రిక, మార్చి ౭,2012

- మార్కెట్‌ విధానాలతో ముప్పు
- ఉపసంహరణలతో కోట్ల రాబడి
- ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం
- కళ తప్పిన మహా రత్న, నవ రత్నాలు
- స్వావలంబన పునాదులపై వేటు
- ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక పీఎస్‌సీలే
- ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణే కర్తవ్యం


మిశ్రమ ఆర్థిక విధానాలకు చెల్లుచీటీ రాసేసి, మార్కెట్‌ ఆర్థిక విధానాలకు దాసోహం పలికిన కేంద్ర ప్రభుత్వం, పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా ప్రభుత్వరంగ సంస్థలను నడి బజారులో వేలంవేసి అమ్మకానికి పెట్టింది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 2010-11లో రు. 22,500 కోట్లు ఆర్జించి ఖజానా నింపుకొన్నది. 2011-12లో రు.40,000 కోట్లు పోగేసుకోవాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం అన్ని అడ్డదారులూ తొక్కుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలలోని ప్రభుత్వ వాటాలను ఆయా ప్రభుత్వ రంగ సంస్థలే తిరిగి కొనుగోలు చేసే (బైబ్యాక్‌) విధానానికి, ప్రభుత్వ రంగంలోని ఆర్థిక సంస్థలు ప్రభుత్వ షేర్లను కొనుగోలు చేయడానికి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వకమిటీ- కేంద్ర మంత్రివర్గం తాజాగా అమోదముద్ర వేసింది.

దేశ ఆర్థిక, పారిశ్రామిక, సామాజికాభివృద్ధిలో ప్రభుత్వరంగ సంస్థలు ముఖ్య భూమిక పోషించాయి, పోషిస్తున్నాయి. జాతి సంపదను పెంపొందించడానికి, సామాజిక, అర్థిక అసమానతలను తొలగించడానికి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి, ఉఫాథి కల్పన తదితర బహుముఖ లక్ష్యాలతో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి ప్రభుత్వ- సహకార రంగాలలో పరిశ్రమలను, సంస్థలను నెలకొల్పి ప్రోత్సహించింది. ఒకనాడు వ్యవసాయం తరువాత పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యతఇచ్చి వార్షిక బడ్జెట్లలో నిథుల కేటాయింపు చేసేవారు.

స్వాతంత్య్రానంతరం మొదటి పంచవర్ష ప్రణాళిక మొదలు ప్రభుత్వరంగ సంస్థలకు అగ్రపీఠం వేశారు. 1980 దశకం వరకు ఈ ఒరవడి కొనసాగింది. వలస దోపిడీలో మగ్గిపోయిన మన దేశ ఆర్థిక స్వావలంబనకు బలమైన పునాదులు వేసి పారిశ్రామికాభివృద్ధిలో, సంపదను సృష్టించడంలో అగ్రభాగాన నిలబడ్డాయి. 1990 దశకం ప్రారంభం నుండి సరళీకృత ఆర్థిక విధానాల అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ జపం చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నారు.

ప్రభుత్వ రంగానికి గర్వకారణమైన మహారత్నాలు, నవరత్నాలు ఆయా రంగాలలోని అంతర్జాతీయ సంస్థలకు దీటుగా పోటీ పడుతున్నాయి. 1951 నాటికి కేవలం రూ. 30 కోట్ల పెట్టుబడులతో ఐదు సంస్థలుంటే నేడు 249 ప్రభుత్వరంగ సంస్థలున్నాయి. 2009-10 ఆర్థిక సంవత్సరానికి వాటి ఆస్తుల నికర విలువ రూ. 6,60,245 కోట్లుగా అంచనా వేశారు. 12.42 శాతం వృద్ధి రేటుతో కొనసాగుతున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తి ( జి.డి.పి.) పెరుగుదలకు ఇతోధికంగా దోహదపడుతున్నాయి.

ఎక్సజ్‌ డ్యూటి, కస్టమ్స్‌ డూటి, కార్పొరేట్‌ ట్యాక్స్‌, ఆదాయపు పన్ను, రుణాలపై వడ్డీలు, పెట్టుబడులపై డివిడెండ్లు- ఇతర పన్నుల రూపేణా 2009-10లో రూ. 1,39,830 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాయి. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు రూ.1,08,435 కోట్ల నికరలాభాలు గడించాయి. దాదాపు రూ.35,000 కోట్లు డివిడెండ్లు ప్రకటించాయి. అది చాలదన్నట్లు లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించేలా ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నదని వార్తలొస్తున్నాయి. రూ. 77,745 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టాయి.

నగదు నిల్వలు, మిగులు రు.6,05,648 కోట్లకు పెరిగాయి. ఆర్థిక సంస్కరణల అమలు ప్రారంభం నాటికి 23,00,000 మంది కార్మికులు, ఉద్యోగులుంటే ఆ సంఖ్య 2009-10కి 14,91,000 కుదించుకుపోయింది. ఒక వైపు పర్మినెంట్‌ వర్కర్ల సంఖ్యను తగ్గిస్తూ మరొకవైపు కాంట్రాక్ట్‌ వర్కర్లను నియమించుకొంటున్నారు. వారికి కనీస వేతనాలు గాని, సామాజిక భద్రత గానీ కల్పించకుండా అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు.

జాతికి గర్వకారణంగా నిలిచి , ప్రగతి పథంలో ప్రయాణిస్తున్న బంగారు గుడ్లు పెట్టే బాతుల వంటి ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మి ప్రభుత్వ ఖజానాను నింపుకోవాలనే దుర్నీతిని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ విధానం దేశ ఆర్థిక స్వావలంబనకే గొడ్డలి పెట్టు. మహారత్న, నవరత్నాలుగా పిలిచే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వల్ల ఇప్పటికే ప్రభుత్వ వాటాలు గణనీయంగా తగ్గిపోయాయి. హెచ్‌.పి.సి.యల్‌. లో 51.11, బి.పి.సి. యల్‌. లో 54.93, గెల్‌ లో 57.34 , బి.హెచ్‌.ఇ.యల్‌. లో 67.72 , ఒ.యన్‌.జి.సి.లో 69.14 , బెల్‌ లో 75.86 , ఐ.ఒ.సి . లో 78.92 , యన్‌.టి.పి.సి.లో 84.5, సెయిల్‌ లో 85.82, కోల్‌ ఇండియాలో 90 శాతాలకు తగ్గిపోయాయి.

కోల్‌ ఇండియా లిమిటెడ్‌ , పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ , యన్‌.టి.పి.సి. లిమిటెడ్‌ , ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, నేషనల్‌ మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమిటెడ్‌ , సట్లజ్‌ జల్‌ విద్యుత్‌ నిగం, ఈ.ఐ.యల్‌., యన్‌.యం.డి.సి. వగైరా సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 22,500 కోట్లు సేకరించుకొన్న కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓ.యన్‌ .జి.సి., సెయిల్‌, పి.ఎఫ్‌.సి., ఐ. ఒ.సి., యం.యం.టి.సి., ఆర్‌.ఐ.యం.యల్‌., యన్‌.బి.సి. సి., హిందుస్తాన్‌ కాపర్‌, బి.హెచ్‌.ఇ.యల్‌., హెచ్‌.ఎ.యల్‌. తదితర సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతంచేసి తద్వారా రూ.40,000 కోట్ల సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్రమంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఏడాది పొడవునా మార్కెట్‌ అననుకూలంగా ఉండడంతో ఇప్పటి వరకు రూ.1,145 కోట్లు మాత్రమే సేకరించుకోగలిగింది .

ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి కొత్త ఎత్తులు వేస్తున్నది. అందులో భాగంగా నగదు నిలలున్న ప్రభుత్వరంగ సంస్థలను, ఆర్థిక సంస్థలను రంగ ప్రవేశం చేయించి, ప్రభుత్వ షేర్లను వాటికి అమ్మి సొమ్ము చేసుకోవాలన్న కార్యాచరణను అమలు చేసింది. ఒ.యన్‌.జి.సి.లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా షేర్లను బహిరంగ వేలం వేసి, యల్‌.ఐ.సి.ని 95 శాతం షేర్లను కొనుగోలు చేసేలా పథకం ప్రకారం ఒత్తిడి చేసి రూ.12,500 కోట్లు రాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖజానా నింపుకొంటున్నది.

ప్రభుత్వ రంగ సంస్థలు తమవద్ద ఉన్న నగదు నిల్వలు, మిగులును ఆయా సంస్థల విస్తరణకు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులు పెట్టి వాటిని గాడిలోకెక్కించి, అభివృద్ధి చేయడం వంటి కార్యకలాపాలకు వెచ్చించమని ప్రోత్సహించడానికి బదులు, ఆ నిథులను ఖజానాకు ఎలా మళ్ళించుకోవాలని ఆలోచించడం జాతి ప్రయోజనాలకు హానికరం.

కోట్లాది ప్రజల సొమ్ముతో వ్యాపారం చేస్తూ, మదుపుదార్లకు సామాజిక భద్రత కల్పిస్తున్న ప్రభుత్వ రంగంలోని ఆర్థిక సంస్థ యల్‌.ఐ.సి.ని బలోపేతం చేసి సమాజానికి మరింత మేలైన సేవలందించేలా ప్రోత్సహించడానికి బదులు, ఆ సంస్థను పావుగా వాడుకోవడం తీవ్ర అభ్యంతరకరం.దేశ ఆర్థికాభివృద్ధిలో, సామాజికాభివృద్ధిలో ఛోదక శక్తిలా పని చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయి. వాటిని పరిరక్షించుకోవడం దేశభక్తులందరి కర్తవ్యం.

Tuesday, February 28, 2012

జలయజ్ఞం సాగదీత

సూర్య February 23, 2012
  • గత కేటాయింపులే ఖర్చుకాలేదు
  • ప్రాజెక్టుల్ని పూర్తిచేసే సంకల్ప లోపం
  • కరవుకు పరిష్కారం ప్రాజెక్టులే
  • లోపించిన ప్రాధాన్యతా క్రమం
  • జాప్యం వల్ల పెరుగుతున్న నిర్మాణ వ్యయం
  • మూలన పడుతున్న ప్రాజెక్టు నిర్మాణాలు
  • విద్యుదుత్పత్తి సామర్ధమూ పెరగాలి
    polavaramప్రభుత్వ విశ్వసనీయతకు, జవాబుదారీతనానికి శాసన సభ ఆమోదించిన వార్షిక బడ్జెట్‌ అమలే గీటు రాయి. 2010-11 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అమలు తీరు తెన్నుల నేపథ్యం నుండి ప్రస్తుత బడ్జెట్‌ ప్రతిపాదనలను పరిశీలిస్తే, ప్రభుత్వ డొల్లతనం బహిర్గతమవుతున్నది. జలయజ్ఞం పేరు ఉచ్ఛరించడానికే జంకుతున్నట్లుంది. గత బడ్జెట్‌లో రూ.15,010 కోట్లు కేటాయించి, జనవరి నాటికి కేవలం రూ.8,459 కోట్లు ఖర్చు చేయడాన్ని బట్టి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం పట్ల చిత్తశుద్ధి కొరవడినట్లు స్పష్టంగా కనబడుతున్నది.

    గడచిన ఏడాదిలో నిథులను పూర్తిగా వ్యయం చేయలేక పోవడం మూలంగా ఈ సంవత్సరం కేటాయింపులు పెంచలేదని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఇచ్చిన వివరణను బట్టి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పసిద్ధి ప్రభుత్వానికి లేనట్లు చెప్పకనే చెప్పారు. ఇది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి గొడ్డలిపెట్టు.మన రాష్ట్ర ప్రగతి ప్రధానంగా వ్యవసాయంపై అధారపడి ఉన్నది. నూటికి అరవై నాలుగు మందికి జీవనాధారం వ్యవసాయ రంగమే. నేడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. కరవుకాటకాలు నిత్యకృత్యమైనాయి.

    ఈ ఏడాది కూడా ఇరవై రెండు జిల్లాలలో 876 మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. నిత్య కరవులను శాశ్వతంగా పారద్రోలాలంటే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికపై పూర్తి చేసుకోవడం ఒక్కటే మార్గం. ప్రాణప్రదంగా భావిస్తున్న పోలవరానికి వెయ్యి కోట్లు కేటాయించి రూ.452 కోట్లు వ్యయంచేసి, ఇప్పుడు రూ.850 కోట్లు ప్రతిపాదించారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రప్రభుత్వం నుండి ఆమోదం లభించబోతున్నదని, 90 శాతం నిథులు కేంద్రమే భరిస్తుందని, అన్ని శాఖల నుండి అనుమతి మంజూరై నిర్ణయం కేంద్ర మంత్రిమండలి ముంగిట ఉన్నదని ఊరిస్తున్నారు.

    మరొకవైపు టెండర్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ, అవి బహిర్గతం కావడంతో వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. పర్యవసానంగా 2004 అంచనాల మేరకు రూ.8,198 కోట్లు వ్యయం అవుతుందనుకొన్నది రూ.17,000 కోట్లకు చేరుకొన్నది. కాలం గడచే కొద్ది ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుంది. ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం కూడా తడిసి మోపెడవుతూనే ఉంటుంది. ఇది అన్ని ప్రాజెక్టులకు వర్తిస్తుంది.

    తెలంగాణలోని అత్యధిక మెట్ట ప్రాంతాలకు ప్రాణ ప్రదంగా భావిస్తున్న ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకానికి రూ.608 కోట్లు కేటాయించి 256 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రాజెక్టు సర్వే కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు రూ.1,050 కోట్లు ప్రతిపాదించారు. సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను త్వరితగతిన రూపొందించి, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి, జాతీయ ప్రాజెక్టు హోదా సాధించుకొంటేనే ఈ భారీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకోగలం. దుమ్మగూడెం సాగర్‌ టేల్‌ పాండ్‌ కు రూ.200 కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.75 కోట్లు, చింతలపూడికి రూ.75 కోట్లు, మహేంద్రతనయకు రూ.35 కోట్లు, వంశధార మొదటి దశకు రూ.20 కోట్లు కేటాయించి ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టలేదు. కల్వకుర్తికి రూ.250 కోట్లు కేటాయించి రూ.155 కోట్లు , భీమాకు రూ.260 కోట్లకు గాను రూ.77 కోట్లు, నెట్టంపాడుకు రూ.233 కోట్లకు రూ.75 కోట్లు , ఎస్‌.యల్‌.బి.సి.కి రూ.450 కోట్లకు రూ.297 కోట్లు, ఎస్సారెస్పీకి రూ.205 కోట్లకు కేవలం రూ.16 కోట్లు, ఇందిరా దుమ్మగూడెంకు రూ.150 కోట్లకు రూ.18 కోట్లు, గాలేరు నగరికి రూ.540 కోట్లకు రూ.277 కోట్లు, పిబిసి పథకానికి రూ.305 కోట్లకు రూ.83 కోట్లు ఖర్చు చేశారు. వార్షిక బడ్జెట్‌లో నిథులు కేటాయించడం, ఖర్చు చేయకుండా ప్రజలను దగా చేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.

    200511 సంవత్సరాల మధ్య రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రేటు సగటున 9.26 శాతం నమోదయిందని ఆర్థిక శాఖామాత్యులు ఘనంగా ప్రకటించుకొన్నారు. అందులో సంపద సృష్టి కర్తలైన సామాన్యుల వాటా ఎంత అన్న దానికి సమాధానం దొరకదు. సమాజం సృష్టిస్తున్న సంపద దోపిడీ దొంగల సొత్తుగా మారిపోతున్నది. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి గడచిన ఐదారు సంవత్సరాలలో రూ.71,292 కోట్లు ఖర్చు చేసినా రావలసిన సత్ఫలితాలు రాక పోవడానికి అవినీతే ప్రధాన కారణం. వ్యవసాయం కునారిల్లి పోతున్నది. ప్రకృతి వైపరీత్యాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. సంక్షోభంలో ఉన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి, వ్యవసాయానికి ఊపిరి పోసి, ఉపాథి అవకాశాలను మెరుగుపరచడానికి, కరవు కాటకాల బారినుండి ప్రజలను రక్షించడానికి, గ్రామసీమల నుండి వలసలను నివారించడానికి, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడానికి, వెనుకబడ్డ ప్రాంతాల ప్రజానీకాన్ని నాగరిక ప్రపంచంలో అంతర్భాగం చేయాలన్నా నదీజలాల సద్వినియోగంపై మాత్రమే ఆధారపడి ఉన్నది.

    జల వనరులను అభివృద్ధిపరచి, ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు కృషి చేయాలి. నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతం నుండి నీటి కోసం కటకట లాడుతున్న ప్రాంతాల ప్రజల గొంతులు తడపాలన్నా, మరుభూములను పంట పొలాలుగా మార్చాలన్నా ప్రాజెక్టుల నిర్మాణాన్ని రాజకీయ సంకల్పంతో కొనసాగించాలి. బడ్జెట్‌ కేటాయింపులకు అనుగుణంగా నిథులను మంజూరు చేయకుండా, నిర్మాణ పనులను నత్త నడకన సాగించడం చూస్తుంటే ప్రస్తుత పాలకులకు ప్రాజెక్టుల సత్వర నిర్మాణం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదనిపిస్తున్నది. ఓట్ల రాజకీయంపై ఉన్న ధ్యాస దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పథకాలపై లేకపోవడం దీనికి ప్రధాన కారణం.

    జలయజ్ఞంలో అంతర్భాగంగా 44 భారీ, 30 మధ్య తరహా పథకాలు, 8 ఆధునికీకరణ పథకాలు, నాలుగు వరద గట్ల మరమ్మతు కార్యక్రమాలకు రూ.1,85,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. 2012 జనవరి నాటికి రూ.71,292 కోట్లు ఖర్చు చేశారు. 97.3 లక్షల ఎకరాలకు కొత్తగా సాగు నీటి సౌకర్యాన్ని , 9.45 లక్షల ఎకరాల భూమికి సాగు స్థిరీకరణ కల్పిస్తామని, దాంతో పాటు 6,553 గ్రామాలలోని 2.54 కోట్ల జనాభాకు మంచినీటిని అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకొనే నీటి పారుదల ప్రాజెక్టుల ప్రస్తుత నిర్మాణ తీరుతెన్నులపై శ్వేతపత్రం విడుదలచేస్తే దాని డొల్లతనం బయటపడుతుంది . 2004-05 తరువాత 13 ప్రాజెక్టులను సంపూర్ణంగా, 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 16.94 లక్షల ఎకరాలకు కొత్తగా సాగు నీటి సౌకర్యాన్ని, 3.96 లక్షల ఎకరాలకు స్థిరీకరణ కల్పించామని కాకి లెక్కలు చెబుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తెలుగు గంగ, యస్‌.ఆర్‌.బి.సి., గుండ్లకమ్మ వంటి ప్రాజెక్టులలో అంతర్భాగంగా రిజర్వాయర్లను , ప్రధాన కాల్వల నిర్మాణాలను పూర్తి చేశారు. డిస్ట్రిబ్యూషన్‌ సిస్టంను, పంట కాలువల నిర్మాణాన్ని చేపట్టకుండానే సాగునీరు విడుదల చేస్తున్నామని ప్రకటించి చేతులు దులిపేసుకొన్నారు. వీలున్న చోట్ల చెరువులకు నీటిని తరలించి, కొత్తగా సాగుకు నీరందిస్తున్నట్లు మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారు.

    ప్రాధాన్యతా క్రమంలో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, నిపుణులు చేసిన సూచనలను పెడచెవిన పెట్టడం వల్ల ఈ దుస్థితి నెలకొన్నది. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న నానుడిగా ప్రభుత్వం ఇప్పుడు ప్రాధాన్యతా క్రమంలో నిర్మాణ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తామని కబుర్లు చెబుతున్నది. వాస్తవానికి ప్రభుత్వం ఆచరణలో నిష్క్రియగా తయారయ్యింది. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాలు గడప దాటటం లేదన్న నానుడిగా ప్రభుత్వ చర్యలున్నాయి. గుత్తేదారులు- చేసిన పనులకే డబ్బులు చెల్లించడంలేదని గోలచేస్తున్నారు. అప్పులు చేసి యంత్రాలను కొనుగోలు చేసి, నిర్మాణ పనులు చేసిన చిన్న గుత్తేదారులు వడ్డీలు చెల్లించుకోలేక దివాలా తీస్తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం నిథులను విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నది. పర్యవసానంగా నిర్మాణ పనులు ఆలస్యం అయ్యేకొద్దీ నిర్మాణవ్యయం తడిసి మోపెడై అసలుకే మోసం జరిగే ప్రమాదం ముంచుకొస్తున్నది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు మూలనపడతాయి. ఇప్పటికే కొన్నిప్రాజెక్టుల కింద తవ్విన ప్రధాన కాలువలు పూడిపోయి, చెట్లు మొలచిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.
    ఈ దుస్థితినుండి బయట పడడానికి నిర్మాణంలో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి అంకితభావంతో పూనుకోవాలి. పోలవరం, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందడం ద్వారా ఆర్థిక వెసులుబాటు సాధించి, రాష్ట్ర నిధులతో మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్ణీత కాలంలో పూర్తి చేయడానికి ఇప్పటికైనా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలి. విద్యుత్‌ కొరతతో సతమతమౌతున్న పూర్వరంగంలో ఎత్తిపోతల పథకాల విద్యుదవసరాలను తీర్చడానికి అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మరొక వైపు చర్యలు తీసుకొంటే తప్ప సత్ఫలితాలు పొందలేము.
  • Thursday, February 16, 2012

    సా‘రాజ్యం’ ఆగేదెన్నడు?

    Surya Daily Feb.15 2012

  • మద్యం వ్యాపారం ద్వారా అవినీతి, నేరాలు వ్యవస్థీకృతం
  • అనుమతి లేకుండానే వేల సంఖ్యలో బార్లు, వైన్‌ షాపులు సంక్షేమంపై ఖర్చు ఏడెనిమిది వేల కోట్లు మించిలేదు
  • ఎకై్సజ్‌ ఆదాయం అంతకు ఎన్నో రెట్లు ఎక్కువ
  • నిర్ధిష్ట లెక్కలు సంపాదించడం అసాధ్యం
  • ఎసిబి దాడులను అన్ని జిల్లాలలోనూ నిర్వహించాలి
  • దాడుల సమాచారాన్ని క్రోడీకరించి బహిర్గతం చేయాలి

    సమాజ హితం కోరుకొనే వారెవరైనా మ ద్యం వ్యాపారానికి ప్రత్యక్షంగాగానీ, పరో క్షంగా గానీ భాగస్వాములు కారు. తెలుగునాట మద్యాన్ని ఏరులై పారిస్తూ, కాసుల కోసం కక్కు ర్తిపడుతూ ప్రజల మానప్రాణాలను బలి గొంటూ, పేద పిల్లల భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్న మాఫి యా గ్యాంగులకు కళ్ళెం వేయాల్సిన ప్రభుత్వ పెద్దలే అవినీతికి పా ల్పడ్డ్డారని అవినీతి ని రోధక సంస్థ (ఎ. సి. బి.) ప్రాథమిక సాక్ష్యాధారాలతో కేసులు నమోదు చేసింది. అనైతికమైన మ ద్యంవ్యాపారాన్ని చేయడమే కాకుండా చట్ట ప్రకారమే చేస్తున్నామని బుకా యించడం కొందరి నీతిమాలిన రాజకీయాలకు ప్రబల నిదర్శనం. సమస్య కొత్తది కాకపోయినా తాజాగా మరొకసారి మద్యం మాఫియా అండ్‌ కంపెనీ గుట్టు రట్టయ్యింది. రాజకీయ, వ్యాపార, పత్రికా రంగాలకు, అధికార గణాని కి తీరని కళంకం తెచ్చి పెట్టింది. ఈ శాసన సభా సమా వేశాల్లోనైనా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ తరహా సమస్యలపై సవ్యమైన చర్చలు జరిపి, పరిష్కార మార్గాలను అన్వేషిస్తారో ! లేదో ! వేచి చూడాలి.

    ప్రజల సంక్షేమం, ఆరోగ్యం మా ధ్యేయమని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే పాలకులు రక్త పిపాసులుగా మారడం మానవత్వాన్ని మంటకలపడమే. పేద లకు సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే సొమ్ములు కావాలి కదా ! అని ప్రభుత్వ పెద్దలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దారిద్యరేఖకు దిగు వనున్న ప్రజానీకాన్ని ఆర్థికంగా ఆదుకోవడం సంక్షేమ రాజ్యం యొక్క ప్రాథ మిక కర్తవ్యం. రాజ్యాంగబద్ధమైన ఈ కర్తవ్యాన్ని కూడా ప్రభుత్వం నిర్వర్తిం చనప్పుడు ఇ! ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం, పరమార్థం లేదు. సంక్షేమ పథకాలకు నిథులను సమకూర్చడం సమాజం బాధ్యత. అంతే కానీ సంక్షేమ పథకాల లబ్ధిదారులను మద్యం వ్యసనపరులుగా మార్చి, వారి నుండే నిథుల ను పోగేసుకొంటామంటే ! అది ముమ్మాటికీ అనైతికం.

    నీతిమాలిన వ్యాపా రానికి ప్రత్యక్ష, పరోక్ష సహాయ సహకారాలందించే వారెవరైనా రాజకీయాల కు అతీతంగా సమాజం ముందు ముద్దాయిలుగా నిలబడక తప్పదు. అయితే ఆ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలి. తమపార్టీవారనో, వర్గం వారనో వారిని కాపాడే ప్రయత్నం రాజకీయ నాయకులు, ప్రభుత్వం చేస్తే అంతకు మించిన అపరాధం మరొకటి ఉండదు. మద్యాన్ని విస్తత్రంగా అమ్మడం ఒక ఎత్తు అయితే దానిని ఎంఆర్‌పి రేట్లకు మించి అమ్మడం మరొక దారుణం.

    రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17న వార్షిక బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశ పెట్ట బోతున్నది. కాస్త జాగ్రత్తగా పరిశీలించండి. వివిధ సంక్షేమ పథకాలకు కేటాయించే మొత్తాలను, మద్యం అమ్మకాల (ఎకై్సజ్‌) ద్వారా ఆర్జించ తల పెట్టిన రాబడి అంకెలను పరిశీలించండి. ప్రభుత్వ శాఖ పేరు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై్సజ్‌ డిపార్ట్‌మెంట్‌, మద్యపానం వల్ల సంభవించే దుష్పలితాలపై ప్రజ ల్లో విస్తృతంగా ప్రచారంచేసి, వ్యసనపరులను చైతన్యపరచి, మద్యాన్ని సేవిం చకుండా నిరుత్సాహ పరచడం శాఖ ప్రధాన కర్తవ్యం. ఈ లక్ష్యంతో ప్రభు త్వం ఏర్పాటు చేసిన కమిటీల ఉనికే గల్లంతయ్యింది. బాధ్యతను మరచిన ఎకై్సజ్‌ శాఖ మద్యం వ్యాపారంలో నిమగ్నమై పోయింది. మద్యం ఉత్పత్తి, నిల్వ, కొనడం, అమ్మడం, రవాణా వగైరా కార్యకలాపాలు నిర్వహి స్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడల్లా మద్యం ఉత్పత్తి ని పెంచి, అమ్మకాలను పెంచుతారు.

    మద్యం దుకాణాల లైసెన్స్‌ ఫీజు, అమ్మ కం పన్ను, ఎకై్సజ్‌ డ్యూటి రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న బంగారు గుడ్లు పెట్టే బాతులాంటిది ఎకై్సజ్‌శాఖ. మద్యం వ్యాపారస్తులు సిండికేట్‌లుగా ఏర్పడి వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగించు కొంటున్నారు. ఆ మాఫియా గ్యాంగ్స్‌ తో మంత్రులు, ప్రజాప్రతినిథులు, అధికారులు చేతులు కలిపి అప విత్ర కూటమిగా ఏర్పడి అక్రమార్జనను, అవినీతిని, నేరాలను వ్యవస్థీ కృతం చేశారు .

    మద్యం షాపులకు అత్యధిక మొత్తాల చెల్లింపుకు మాఫియా గ్యాంగ్స్‌ సంసిద్ధత వ్యక్తం చేస్తూ టెండర్లు వేసి వేలంలో పాట పాడుకొంటు న్నారు. సిండికేట్లుగా తయారై మద్యం వ్యాపార వ్యవస్థనే నియంత్రిస్తు న్నారు. సొంతంగాను, బినామీ పేర్లతోనూ షాపులను కైవసం చేసుకొని ప్రభుత్వానికి లైసెన్స్‌ ఫీజు, అమ్మకపు పన్ను, ఎకై్సజ్‌ పన్ను చెల్లించాలి. చట్టం కళ్ళు కప్పి సాగించే అక్రమార్జనకు అడ్డు లేకుండా చేసుకోవడానికి మంత్రు లు, ప్రజాప్రతినిథులు, ఎకై్సజ్‌‌‌, పోలీసు, తూనికలు కొలతలు వగైరా ప్రభుత్వ శాఖల్లోని ఉన్నతాధికారులు, సిబ్బందికి క్రమం తప్పకుండా నెలవారి లంచా లు, కమీషన్లు ముట్టజెప్పుకోవాలి.

    పైనుంచి క్రిందికి గొలుసులా అవినీతి పరుల బంధం వ్యవస్థీకరించబడి ఉన్నది. రక్షణ కవచంగా గూండాలను పోషించాలి. రాజకీయ పార్టీలకు విరాళాలివ్వాలి. దిన పత్రికలు, టి.వి. చానల్స్‌ యాజమాన్యాలు విలేకరులకు చట్టబద్దమైన వేతనాలు చెల్లించక పోవడంతో వారూ అవినీతికి పాలడుతూ లంచాలకు కక్కుర్తిపడు తున్నారు. చట్టబద్ధమైన, చట్టవ్యతిరేకమైన ఖర్చులను భరిస్తూ కోట్లకు కోట్లు ఆర్జించాలంటే మద్యం వ్యాపారులు చట్టాన్ని, ప్రభుత్వ నిబంధ నలను తుంగలో తొక్కి అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతించిన షాపు లు దాదాపు 7,000 , బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ 1,500 ఉంటే అనుమతి లేని బెల్ట్‌ షాపులు లెక్కకు మించి పదుల వేల సంఖ్యలో నిర్వహించబడుతున్నాయి.

    నిషేధిత ప్రాంతాలైన ఆలయాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు వగైరా ప్రదేశాలు, జాతీయ రహదారుల వెంబడి కూడా నిర్భీతిగా షాపులను ఏర్పాటు చేసి, గరిష్ట అమ్మకపు ధర (యం. ఆర్‌.పి.)పై కనీసం యాభై శాతానికి మించి డిమాండుకు అనుగుణంగా అధిక ధరలకు అమ్ముతూ మద్యం వ్యాపారం చేస్తున్నా ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తున్నది. మరోవైపు కల్తీ మద్యంతో అమాయకుల ప్రాణాలను బలి తీసుకొంటున్నా చీమ కుట్టినట్లు కూడా లేక పోవడం పాలకుల నిర్వాకాన్ని తెలియజేస్తున్నది. కల్తీ మద్యాన్ని అరికట్టేం దుకు చర్యలు తీసుకోకపోవడమే కాదు తాగినవారిదే తప్పు అయినట్టుగా ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది.

    ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చెప్పుకొంటున్న ప్రభుత్వం ఎకై్సజ్‌ శాఖ నుండి రూ. 20,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. అంటే నలభై యాభైవేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది. సబ్సిడి బియ్యం పంపిణీపై రూ. 2,500 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంపై రు. 2,000 కోట్లు, సామాజిక భద్రతా పథకాలైన వృద్ధాప్య, వితంతు, వికలాం గులకు ఇస్తున్న ఫించన్లు వగైరా సంక్షేమ పథకాలకు రూ.2,000 కోట్లు , ఇలాగా వివిధ సంక్షేమ పథకాలకు మొత్తంగా వెచ్చిస్తున్నది ఏడెనిమిది వేల కోట్ల రూపాయలకు మించి ఉండదు. కానీ ప్రజానీకాన్ని మద్యం మత్తులోకి నెట్టి గుంజుకొంటున్నది రూ. 50,000 కోట్లు.

    ఈ రంగంలోని వ్యాపారానికి సంబంధించిన మొత్తం లావాదేవీలపై అధికారిక లెక్కలు సంపాదించడం దుర్లభం. అందుకే, సింగిల్‌ విండో విధానంలో ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తే బాగుంటుందని కొందరు ప్రముఖులు వ్యంగంగా సలహా ఇచ్చారు. అప్పుడ న్నా లెక్కాపక్కా తేలుతుందని, కనీసం జవాబుదారీతనం ఉంటుం దేమోనన్న ది వారి అభిప్రాయం కావచ్చు .

    2జి స్కాంలో రూ. 1,76, 000 కోట్ల కుంభకోణం జరిగిందని కాగ్‌ అంచ నా వేయగలిగింది. రాష్ట్రంలో యధేచ్ఛగా సాగిపోతున్న మద్యం కుంభకో ణంలో అవి నీతి సొమ్మెంతో తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. అవినీతి నిరోధక సంస్థ (ఎ.సి.బి.) దాడుల్లో జిల్లాల వారిగా వెలుగు చూస్తున్న వాస్త వాలు నామ మాత్రమే. గుడ్డి కంటి కంటే మెల్ల మేలన్న నానుడిగా రాష్ట్ర ప్రభు త్వం ఎ.సి. బి. దాడులకు ఆదేశించడం ఆ మేరకు అభినందనీయమే. కానీ దాడుల్లో వెలుగు చూసిన వాస్తవాలన్నింటినీ బహిర్గతం చేయకుండా, రాజకీ య స్వప్రయోజనాల కోసం ఏ.సి.బి. నివేదికల్ని ఆయుధంగా వాడుకొంటే అంతకంటే నీచమైన చర్య మరొకటి ఉండదు. ఇప్పటికే ఎసిబి దాడులను ఆదేశించడానికి కారణాల గురించి అధికార పార్టీ నాయకులే పలు రకాలుగా మాట్లాడుతున్నారు. కనుక స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, రాజకీయ వత్తిడులకు లొంగకుండా అన్ని జిల్లాలలో దాడులు కొనసాగించి, మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి బహిర్గతం చేయాలి. అక్రమార్జనపరులకు కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. అప్పుడే ప్రజల విశ్వాసం పొందగలరు.
  • Friday, February 10, 2012

    వొడాఫోన్‌ ఉదంతం అంతంకాదు, ఆరంభమే!

    సూర్య దినపత్రిక , పిబ్రవరి ౧౦,2012

    ఒక మధ్య తరగతి ఉద్యోగి లేదా ఒక సామాన్యుడు తన కష్టార్జితంలో కాస్త కూడబెట్టుకొని అపార్ట్‌ మెంట్‌ లేదా ఇంటి స్థలం లేదా ఏదైనా స్థిరాస్థి కొని, కొంత కాలం తరువాత డబ్బు అవసరమై ఆ స్థిరాస్థిని విక్రయిస్తే ఆదాయపు పన్ను శాఖ మూలధన లాభం (క్యాపిటల్‌ గెయిన్స్‌ ) పై పన్ను వసూలు చేస్తుంది. కానీ విదేశీ సంస్థలు ప్రత్యక్ష పెట్టుబడుల ముసుగులో భారత గడ్డపై అడుగుపెట్టి, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి ఆస్తులను వృద్ధి చేసుకొని, వాటి క్రయ విక్రయాల లావాదేవీలను- రెండు విదేశీ కంపెనీలు- విదేశీ గడ్డపై జరిపితే మూలధన లాభంపై పన్నువిధించే అధికారం ప్రస్తుత ఆదాయపన్ను చట్టం ప్రకారం భారత ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

    ప్రపంచీకరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ముసుగులో బహుళ జాతి సంస్థలు సాగిస్తున్న దోపిడీ, మోసానికి వొడా ఫోన్‌- హచ్‌ ఈస్సర్‌ కంపెనీల మధ్య జరిగిన క్రయవిక్రయాల తంతే ప్రబల నిదర్శనం. ఈ దోపిడీకి సుప్రీం కోర్టు తీర్పు చట్టబద్ధత కల్పించినట్లయ్యింది. భారత ప్రభుత్వానికి, వొడాఫోన్‌ సంస్థకు మధ్య పన్నువివాదం కేసు పూర్వపరాలను పరిశీలిస్తే మోసం, దగా బోధపడుతుంది. భారత మొబైల్‌ రంగ వ్యాపార సంస్థ హాంగ్‌ కాంగ్‌ కుచెందిన హుట్చిసన్‌ వాంపోయా (హచ్‌)కు చెందిన 67 శాతం వాటాను బ్రిటిష్‌ టెలికమ్యూనికేషన్స్‌ రంగంలో బడా కంపెనీ అయిన వొడాఫోన్‌ గ్రూప్‌ సంస్థ రూ.54,000 కోట్లకు (11.08 బిలియన్స్‌)కు 2007లో కొన్నది. ఆదాయపు చట్టం ప్రకారం మూలధన లాభాలపై 22 శాతం పన్ను చెల్లించాలి.

    ఆ మేరకు ఆదాయ వనరు వద్ద పన్ను మినహాయింపు (టిడి.ఎస్‌) నిబంధన మేరకు హుట్చిసన్‌ వాంపోయా సంస్థకు చెల్లించాల్సిన మొత్తం నుండి మూలధన లాభంపై పన్నును ఆదాయపన్ను శాఖకు జమచేసి మిగిలిన సొమ్మును చెల్లించాల్సిన బాధ్యత వొడాఫోన్‌ గ్రూప్‌ సంస్థపై ఉన్నది. పన్ను భారాన్ని తప్పించుకొనే దురుద్దేశంతో పన్నురహిత దేశాలు(టాక్స్‌ హెవెన్‌ కంట్రీస్‌)గా పేరొందిన కేంద్రాలలో క్రయవిక్రయాల లావాదేవీలను నిర్వహించడం బహుళ జాతి సంస్థలకు పరిపాటిగా మారింది.

    ఆదాయపు పన్ను శాఖ 2007లో హుట్చిసన్‌ వాంపోయా సంస్థకు, వొడాఫోన్‌ సంస్థకు మధ్య జరిగిన క్రయవిక్రయాలకు సంబంధించిన మూలధన లాభంపై రూ.11,000 కోట్ల పన్ను చెల్లించాలని వొడాఫోన్‌ సంస్థకు తాకీదిచ్చింది. దాన్నిసవాలు చేస్తూ వొడాఫోన్‌ సంస్థ ముంబాయి హైకోర్టులో దావా వేసింది. పన్ను చెల్లించాల్సిందేనని 2010 సెప్టెంబర్‌లో కోర్టూ తీర్పు చెప్పగా వొడాఫోన్‌ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం భారత ప్రభుత్వానికి ప్రతికూలమైన తీర్పును 2012 జనవరి 20న వెలువరించింది. హచ్‌ సంస్థకు చెందిన భారత దేశంలోని మొబైల్‌ ఆస్తులను వొడాఫోన్‌ కొనుగోలు చేసిన ఆర్థిక లావాదేవీలు విదేశాలలో జరిగాయి కాబట్టి అవి భారత దేశ ఆదాయపు పన్ను చట్టం పరిథిలోకి రావని ప్రధానన్యాయమూర్తి ద్విసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది.

    ఆదాయ పన్ను శాఖ వద్ద డిపాజిట్‌ చేసిన రూ.2,500 కోట్లను 4 శాతం వడ్డీతో సహా వొడాఫోన్‌ సంస్థకు రెండు మాసాల లోపు తిరిగిచెల్లించాలని, అలాగే రూ.8,500 కోట్లకు ఇచ్చిన బ్యాంక్‌ గ్యారెంటీ పత్రాలను నాలుగు వారాల్లోపు వాపసు ఇవ్వాలని ఆదేశించింది. భారత ప్రభుత్వం, వొడాఫోన్‌ సంస్థల మధ్య చెలరేగిన పన్ను వివాదంపై సుప్రీం కోర్పు ఇచ్చిన ఈ తీర్పు పర్యవసానాలు భవిష్యత్తులో తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి.

    2-జి స్పెక్ట్రం కుంభకోణంలో సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు నిచ్చి దేశ సంపదను కొల్లగొట్టడానికి బరితెగించిన విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ సంస్థల అడ్డగోలు దోపిడీ, అవినీతికి అడ్డుకట్ట వేసిందని దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. 2-జి కుంభకోణం వ్యవహారంలో వొడాఫోన్‌ సంస్థ కూడా భాగస్వామే. ఈ సంస్థపై సీబీఐ 2011 నవంబర్‌లో దాడులు చేసింది. టెలికమ్యూనికేషన్స్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) 49 శాతానికి పరిమితం చేస్తున్న నిబంధనను 2005 నవంబర్‌ 3న తొలగించి- 74 శాతం వరకు అనుమతించిన తర్వాత సంభవిస్తున్న దుష్పరిణామాలల్లో ఇదొకటి.

    హచ్‌ సంస్థకు చెందిన 67 శాతం వాటాలను కొన్న వొడాఫోన్‌ సంస్థ , మిగిలిన 33 శాతం వాటాదారూగా ఉన్న ఈస్సర్‌ సంస్థతో కలిసి 2007 నుండి వొడాఫోన్‌ ఈస్సర్‌ సంయుక్త సంస్థగా మన దేశంలో భారత కంపెనీగానే వ్యాపారాన్ని కొనసాగించింది. ఆనాడు దాని ఆస్తుల అంచనా విలువ రూ.92,000 కోట్లు (18.8 బిలియన్లు). అటుపై ఆ రెండు సంస్థల మధ్య వివాదం పొడచూపడంతో ఈస్సర్‌ సంస్థ వాటాలను కూడా 2011 జూలైలో కొని మొత్తం కంపెనీకి యజమానిగా మారింది.

    మన లాంటి దేశాల చట్టాల కళ్ళు కప్పి ఆదాయ పన్నులను చెల్లించకుండా తప్పించుకొనే దురుద్దేశంతోనే బహుళ జాతి సంస్థలు ఆదాయపు పన్నురహిత చట్టాల అమలులో ప్రసిద్ధి చెందిన కేమన్‌ దీవులు, నెదర్లాండ్‌, మారిషస్‌ వగైరా దేశాలలో పేరుకు మాత్రమే కంపెనీలను రిజిస్టర్‌ చేసి, అక్కడనుంచి వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు రికార్టులు సృషి స్తున్నాయి. ఆ కోవలోనే భారత దేశంలోని ఆస్తులను విక్రయించే ముందస్తు పథకంలో భాగంగానే హచ్‌ సంస్థ కేమన్‌ దీవుల్లో బోగస్‌ సంస్థను నెలకొల్పింది. నెదర్లాండ్‌లో రిజిస్టర్‌ అయిన వొడాఫోన్‌ గ్రూపుకు చెందిన సంస్థతో క్రయవిక్రయాల వ్యవహారాన్ని నడిపింది. ఇదంతా బూటకపు వ్యవహారమనే తేలుతోంది.
    సుప్రీం కోర్టు తీర్పును శిరోధార్యంగా భావించి కేంద్ర ప్రభుత్వం నిష్క్రియగా కూచుంటే భవిష్యత్తులో విదేశీ కంపెనీలే కాదు, స్వదేశీ కంపెనీలూ ఇదే బాటపట్టి పన్నులు ఎగ్గొట్టే అనైతిక వ్యవహారాలు నడుపుతాయి. ఇప్పటికే ఆ మార్గంలో పలు కార్పొరేట్‌ సంస్థలు ప్రయాణిస్తున్నాయి. తాజా ఆర్థిక కుంభకోణాల చరిత్రలో ఇదొక కీలకాంశం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన భారత ప్రభుత్వం, ఆ కంపెనీలు ఆదాయపు పన్నుచట్టంనుండి తప్పించుకోవడానికి వీలులేని చట్టానికి పదును పెట్టాలి.