Thursday, December 20, 2012


కమ్యూనిస్టు యువతకు మహోపాధ్యాయుడు నీలం రాజశేఖరరెడ్డి

Wed, 12 Dec 2012,  visalaandhra daily
కమ్యూనిస్టు యువతకు మహోపాధ్యాయుడు నీలం రాజశేఖరరెడ్డి
టి.లకీëనారాయణ, డైరెక్టర్‌, నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం

భారత కమ్యూ నిస్టు పార్టీ అగ్ర నేతల్లో ఒకరుగా, మార్క్సిజం, లెని నిజం సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేసిన ఉద్యమకారు డుగా, దోపిడీ సమాజా న్ని కూకటి వేళ్ళతో పెకలించ కలిగిన మహ త్తర శక్తి మార్క్సిజానికి మాత్రమే ఉన్న దన్న పరిపూర్ణమైన విశ్వా సంతో యావత్‌ జీవితాన్ని కమ్యూ నిస్టు ఉద్యమ నిర్మాణా నికి అర్పించిన త్యాగశీలి కామ్రేడ్‌ నీలం రాజశేఖరరెడ్డి. సోషలిస్టు భావజాలంపై యువతకు శిక్షణిచ్చి, ఉత్త మపౌరులుగా తీర్చిదిద్ది, కమ్యూనిస్టు ఉద్య మానికి నాణ్యమైన కార్యకర్తలను సమకూర్చి పెట్టాలని నిరంతరం కృషి చేసిన గొప్ప ఉద్యమనేత. ఆయన అమ రుడై పద్దెనిమిది సంవత్సరాలు గడచిపోయాయి. 1938 డిసెంబరులో భారతకమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించి, అంచలంచలుగా ఎదుగుతూ 1961 జూన్‌ 8-11 తేదీ లలో రాజమండ్రిలో జరిగిన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనారు. సైద్ధాంతిక, రాజకీయాంశాలపై కమ్యూనిస్టు ఉద్యమంలో పొడచూపిన తీవ్రమైన విభేదాలపై చర్చోపచర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ మహాసభ జరిగింది. అటుపై కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన చీలిక పర్యవసానంగా సంభవించిన ఆటుపోట్ల మధ్య 1964 నవంబరు 18-23 తేదీలలో గుంటూరులో జరిగిన సి.పి.ఐ రాష్ట్ర మహాసభలో తిరిగి కార్యదర్శిగా ఎన్నికైనారు. విభజన దుష్ఫలితాల ప్రభావం నుండి ఉద్యమాన్ని పరిరక్షించుకోవడం పెనుసవాలుగా పరిణమించిన తరుణంలో ఆయన పార్టీ శ్రేణుల్లో విశ్వా సాన్ని పాదుకొల్పి, సమర్ధవంతమైన నాయకుడుగా ఉద్య మ నిర్మాణంలో క్రియాశీలమైన భూమిక పోషించారు. సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ రంగాలలో తనకున్న ప్రావీ ణ్యం, అనుభవంతో పార్టీని ముందుకు నడిపించడంలో అగ్రభాగాన నిలిచారు.
1971 సెప్టెంబరు 23-27 తేదీల మధ్య హైదరాబా దులో జరిగిన రాష్ట్ర మహాసభల తదనంతర కాలంలో పార్టీ జాతీయ సమితి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి దేశ నలుమూలలా విస్తరించి ఉన్న కమ్యూనిస్టు శ్రేణుల అభిమానాన్ని చూరగొన్న 'ఆణిముత్యం' కా.నీలం రాజ శేఖరరెడ్డి. సైద్ధాంతిక పునాది ఎంత పటిష్టంగా ఉంటే అంతపటిష్టంగా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం ఉంటుం దని బలంగా విశ్వసించిన సి.పి.ఐ. మాజీ ప్రధాన కార్య దర్శి చండ్రరాజేశ్వరరావు, నీలంరాజశేఖరరెడ్డి గార్లు, ఆ వరవడిలోనే ఉద్యమ నిర్మాణానికి జీవితాంతం కృషి చేశారు. పార్లమెంటరీ వేదికలకు వెళ్ళే అవకాశాలున్నా ఉద్యమ నిర్మాణ రంగంపైనే దృష్టి లగంచేసి లక్ష్య శుద్ధి తో పనిచేసి అమరులైనారు. 1994 డిసెంబరు 13న ఆఖరి శ్వాసవిడిచిన రాజశేఖరరెడ్డిగారు కమ్యూనిస్టు నైతిక విలువలతో విలక్షణమైన వ్యక్తిత్వం, సిద్ధాంత నిబద్ధతకు ప్రతీకగా నిలిచి భావితరాలకు ఆదర్శంగా నిలిచారు. సమ కాలీన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అలాంటి పరిణతి చెందిన కమ్యూనిస్టు నాయకుల ఆవశ్యకత సమాజానికి మెండుగా వున్నది. వారు లేని లోటును కమ్యూనిస్టు శ్రేణులు నేటికీ మననం చేసుకొంటున్నారు.
నిరాడంబర జీవితం, మనుష్యుల్ని ప్రేమించడం, మిత్ర త్వానికి ప్రతిరూపంగా నిలవడం, కమ్యూనిస్టు రాజకీయాల పట్ల నిబద్ధత రాజశేఖరరెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన అం శాలు. అభిప్రాయాలు వెల్లడించడంలో నిర్మొహమాటంగా వ్యవహరించేవారు. మృదువైన భాషలోనే విమర్శనాస్త్రాలు సంధించేవారు. మాటల్లో కరుకుదనం ఉన్నా కపటం లేని మనస్తత్వం ఆయనది. సంక్లిష్టమైన సైద్ధాంతిక, రాజకీ యాంశాలను కూడా సులభశైలిలో విశ్లేషించి, విషయాన్ని పొడిపొడిమాటల్లో సూటిగా పామరులకు సహితంబోధ పడేలా విడమరచి వివరించేవారు. హావభావాలు, వ్యక్తి త్వంలో పెద్దరికం ఉట్టిపడేది. ఉద్యమంలో పనిచేస్తున్న యువతను ఆప్యాయంగా చేరదీసి భుజం తట్టి ప్రోత్స హించేవారు. తప్పుటడుగు లేస్తున్నారని భావిస్తే సరిదిద్ద డానికి అంతే కటువుగా వ్యవహరించేవారు. ఉద్యమంలో పూర్తికాలం పని చేస్తున్న కార్యకర్తల యోగక్షేమాల పట్ల శ్రద్ధ కనబరిచేవారు.
విద్యార్థిగా : వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలోని అత్యంత కరవుపీడిత అనం తపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో 1918 జూలై 2న రాజశేఖరరెడ్డి జన్మిం చారు. భూస్వామ్య కుటుం బంలో పుట్టి దోపిడీ శక్తు లకు వ్యతిరేకంగా ఉద్య మించి, శ్రామిక వర్గ అభ్యున్నతికి అలుపెరుగని పోరు సల్పి, ఉత్తమ శ్రేణి కమ్యూ నిస్టుగా నిండు జీవితాన్ని గడిపారు. విద్యార్థి దశలోనే మార్క్సి జంవైపు ఆకర్షితులై, జీవితాంతం శ్రామికవర్గ పక్షపాతిగా, కమ్యూనిస్టు
ఉద్యమ అగ్రనేతగా సమాజానికి ఎనలేని సేవ లందిం చారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయో ధులు కల్లూరి సుబ్బారావు గారు నీలం రాజశేఖర రెడ్డి, తరిమిల నాగిరెడ్డి (తరువాత కాలంలో సి.పి.ఐ. శాసన సభాపక్ష నాయకులుగా వున్నారు). లను 1938 సం.లో వెంట బెట్టుకొని బెనారస్‌ తీసుకెళ్ళి ప్రఖ్యాతిగాంచిన జాతీయ కళాశాలలో చేర్చి ఉత్తమ విద్యార్థు లుగా రాణించ మని ప్రోత్సహించారు. మార్గమధ్యలో గాంధీజీ దగ్గరకు కూడా తీసుకెళ్ళి వారి ఆశీస్సులకు పాత్రులను చేశారు. కానీ ఇరువురూ విప్లవబాట పట్టారు. జాతీయోద్యమా నికి, విప్లవో ద్యమానికి కేంద్రస్థానంగా భాసిల్లిన బెనారస్‌ జాతీయ కళాశాల విద్యార్థిగా ఉన్న కాలంలో రాజశేఖర రెడ్డి గారు కమ్యూ నిస్టు భావజాలం వైపు ఆకర్షితులై, బెనారస్‌ విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషిం చారు. ఆయన కార్యకలాపాలపై నిఘా వేసిన బ్రిటీష్‌ ప్రభుత్వం అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. అక్కడి నుండి తప్పించు కొని రహ స్యంగా అనంతపురం చేరుకొన్నారు.తెల్లదొరల నిరంకుశ పాలన, ఫ్యూడల్‌ శక్తుల నికృష్టమైన దోపిడి మధ్య శ్రామిక ప్రజానీకం మగ్గిపోతున్న రోజుల్లో నీలం రాజశేఖరరెడ్డి గారు రహస్య జీవితం గడుపుతూ, అప్పటికే స్వాతంత్య్రో ద్యమంలో చురుకుగా పాల్గొంటూ కమ్యూనిస్టుగా పేరు పొందిన ఐదుకల్లు సదాశివన్‌ గారితో కలిసి అనంతపురం జిల్లాలో కమ్యూ నిస్టు ఉద్యమ నిర్మాణానికి నడుంబి గించారు. ఆయన సోదరుడు నీలం సంజీవరెడ్డి (మాజీ ముఖ్యమంత్రి, మాజీ రాష్ట్రపతి) తదితరులతో కలిసి యువ జన సంఘాల నిర్మాణానికి కృషి చేశారు. మరొక వైపు కా.వి.కె. ఆదినారాయణరెడ్డి నేతృత్వంలో 1941 సం.లోనే అనంతపురంలో అఖిలభారత విద్యార్థిఫెడరేషన్‌ శాఖను ఏర్పాటు చేసుకొని క్రియాశీలంగా పనిచేస్తున్న కార్యకర్త లతో సంబంధాలు ఏర్పరచుకొని విద్యార్థి ఉద్యమాన్ని ప్రోత్సహించారు. స్వాతంత్య్రోద్యమంలో విద్యార్థులను భాగస్వాములను చేయడం నాటి విద్యార్థి ఉద్యమ ప్రధాన లక్ష్యంగా ఉండేది. యువకులకు, యస్‌.ఎఫ్‌.కార్యకర్తలకు ''స్టడీసర్కిల్‌'' నిర్వహిస్తూ తరిమల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్‌, ఏటుకూరి బలరామమూర్తిగార్లతో కలిసి సైద్ధాంతిక రాజకీయాంశాలపై పాఠాలు బోధించేవారు. తద్వారా యువజన, విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని రగుల్కొల్పి, సంఘటితం చేసే కార్యాచరణకు పూనుకొ న్నారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలోను, దోపిడి రహిత సమాజ నిర్మాణంలోను విద్యార్థి, యువజనులు ముఖ్యమైన భూమిక పోషించగలరని ప్రగాఢంగా విశ్వసించి, ఆ రంగాలపై కేంద్రీకరించి పని చేశారు.
లేబొరేటరీ దహనం 'కుట్రకేసు' : రాజశేఖరరెడ్డి గారు రహస్య జీవితం నుండి బయటికొచ్చి విద్యను కొనసా గించడానికి తిరిగి బెనార స్‌కు వెళ్ళగానే అరెస్టు చేసి ఆగ్రా వగైరా జైళ్ళలో నిర్బంధించారు. 1942 ఆగస్టులో విడుదలై మళ్ళీ అనంత పురం తిరిగొచ్చిన ఆయన్ను అనంతపురం కళాశాల ''లేబొరేటరీ దహనం కుట్ర కేసు''లో ముద్దాయిగా ఇరికించి అరెస్టు చేశారు. గాంధీజీ పిలుపు మేరకు 1942 సం.లో దేశవ్యాపితంగా నిర్వహించబడిన ''ఆగస్టు ఉద్యమం'' ప్రభావంతో రెచ్చిపోయిన కొందరు యువకులు (ఆగంత కులు) ఒక రోజు అర్థరాత్రి పూట కళాశాల కెమిస్ట్రీ ల్యాబ్‌కు నిప్పుపెట్టారు. పోలీసులు తప్పుడు సాక్ష్యా లు చెప్పించి ఆ నెపాన్ని విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న విద్యార్థి ఫెడరేషన్‌ నాయ కులపైకి నెట్టి 1942 సెప్టెంబరు 10న అక్రమంగా కేసును బనా యించి, 12 మందిని అరెస్టు చేశారు. విద్యార్థి నాయకులైన వి.కె.ఆదినారా యణరెడ్డి తదితరులతో పాటు నీలం రాజశేఖరరెడ్డి, ఐదుకల్లు సదాశివన్‌లను కూడా కేసులో ఇరికించి అరెస్టు చేశారు. ఇది రాష్ట్ర విద్యార్థి ఉద్యమ చరిత్రలో ''లేబొరేటరీ దహనం కుట్ర కేసు''గా ప్రసిద్ధికెక్కింది. ఆ ఏడాది డిసెంబరు 14 నుండి విచారణను ప్రారంభించిన స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ ముద్దాయిలు నిరపరాధులుగా తీర్పిస్తూ డిసెంబరు 17న కేసు కొట్టి వేశారు. జైలులో నిర్బంధించబడ్డ కాలాన్ని ఉద్యమకారులు సాహిత్య అధ్యయనానికి సద్వినియోగం చేసుకొని ఇనుమడించిన ఉత్సాహంతో, లోతైన సైద్ధాంతిక అవగాహనతో తిరిగొచ్చి ఉద్యమ నిర్మాణానికి పునరంకితమయ్యారు.
కార్యకర్తల శిక్షణపై కేంద్రీకరణ : విద్యార్థి దశలోనే అధ్యయనంపై అమితాసక్తిని కనబరచిన రాజశేఖరరెడ్డి గారు జీవిత చరమాంకం వరకు అదే దృక్పథంతో నిరం తరం ఆలోచిస్తూ ఉండేవారు. ఆయన సి.పి.ఐ. కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ బాధ్యు లుగా ఉంటూ జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి శిక్షణా శిబిరాల నిర్వహణకు ప్రణాళికలను రూపొందించి, వాటి అమలు కోసం పట్టుదలతో కృషి చేసేవారు. ప్రత్యేకించి విద్యార్థి, యువజన రాజకీయ, సైద్ధాంతిక శిక్షణా శిబిరాల నిర్వ హణకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. మార్క్సిస్టు సిద్ధాంతం అధ్యయనం ద్వారానే కమ్యూనిస్టు ఉద్యమానికి మెరిక ల్లాంటి క్రియాశీలమైన, చైతన్యవంతులైన యువజన, విద్యార్థి కార్యకర్తలు లభిస్తారని ఉద్బోధించేవారు. శాశ్వత ప్రాతిపదికన రాజకీయ శిక్షణా శిబిరాల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే లక్ష్యంతో విశేషమైన కృషి చేసి దేశ రాజధాని ఢిల్లీకి అతిసమీపంలో ఉన్న ఫరీదాబాద్‌లో ఐదెకరాల భూమిని పార్టీకి సేకరించి పెట్టారు. భావజాల ప్రాప్తితోనే నాణ్యమైన కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం, విస్తరణ సాధ్యమవుతుందని రాజ శేఖరరెడ్డిగారు బలంగా విశ్వసించేవారు.
మార్క్సిజం వెలుగులో రాజకీయ, ఆర్థిక, సామాజికాం శాలపై పరిశోధనలను, అధ్యయనాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ''చండ్ర రాజేశ్వరరావు పౌండేషన్‌'' ఆధ్వర్యంలో ''నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం నెలకొల్పబ డింది. కమ్యూనిస్టు సిద్ధాంతం అధ్యయనం, శిక్షణ, ఆచరణ పట్ల ఆయన కనబరచిన మక్కువకు, ఆలోచనలకు అనుగుణంగా ఈ కేంద్రం నిర్వహించబడుతున్నది.
చెరగనిముద్ర : నాలాంటి వేలాది మంది కార్యకర్తలను ప్రభావితం చేసిన విలక్షణమైన జీవనశైలి రాజశేఖరరెడ్డి గారిది. 1973 సం. ప్రారంభంలో వారిని మొదటి సారి చూశాను. అప్పుడు నేను పదవతరగతి చదువుతూ, మా స్కూల్‌ ''పీపుల్‌ లీడర్‌'' గా ఉండేవాడిని . మా హెడ్‌మాస్టర్‌ కీ.శే. యం.సి.ఆంజనేయులుగారి ప్రోత్సాహంతో అప్పటికే ఎ.ఐ.యస్‌.ఎఫ్‌.లో చేరి పని చేస్తున్నాను. ముల్కి సమస్యపై చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి ''జై ఆంధ్రా'' నినాదంతో విచ్ఛిన్నకర ఉద్యమంగా రూపుదా ల్చింది. విద్యార్థులు అందులో భాగస్వాములైనారు. పార్టీ వైఖరిని శ్రేణులకు తెలియజేయడంలో జాప్యం జరిగింది. కొద్ది రోజులు ఓపిక పట్టిన తరువాత మేము సమ్మెలో పాల్గొన్నాం. నేను 48 గంటల నిరాహారదీక్ష చేశాను. ఆ పూర్వరంగంలో ఆనాటి యస్‌.ఎఫ్‌. రాష్ట్ర నాయకుల్లో ఒకరైన ఐదుకల్లు రవీంద్రనాథ్‌ గారు మావూరికొచ్చి గుత్తిలో జరిగిన పార్టీ సమావేశానికి నన్ను వెంటబెట్టుకొని తీసుకెళ్ళారు. ఆ సమావేశంలోనే ప్రప్రథమంగా రాజశేఖర రెడ్డిగారి ఉపన్యాసాన్ని విన్నాను. అది నాపై చెరగని ముద్ర వేసింది. తిరిగి వెళ్ళాక ఆందోళన విరమించి, పాఠశాలను నిర్విఘ్నంగా కొనసాగించుకొన్నాము. ఉపాధ్యాయుల్లో ఒక వర్గం, బయటి నుంచి రాజకీయ నాయకుల వత్తిళ్ళు తీవ్ర స్థాయిలో వచ్చినా ఖాతరు చేయలేదు. ఇంటర్‌ మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు వ్రాశాక, నాకు విషయం చెప్పకుండానే మా హెడ్‌ మాస్టర్‌ నన్ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి అశోక్‌ నగర్‌లో అప్పుడు నివాసముంటున్న కా. రాజశేఖరరెడ్డి గారిని కలిసి ఉన్నత చదువు కోసం సోవియట్‌ యూనియన్‌కు పంపమని విజ్ఞప్తి చేశారు. ఆ ఏడాదికి సంబంధించి దరఖాస్తు చేయడానికి సమయం మించిపోయిందని తరువాత ప్రయత్నిద్దామని వారు సలహా యిచ్చి పంపారు. అలా రెండవసారి ఆయన్ను కలుసు కొన్నాను. అటుపై తిరుపతిలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఎ.ఐ.యస్‌.ఎఫ్‌.మరియు ఎ.ఐ.వై.ఎఫ్‌.ల ఆధ్వర్యంలో రాయలసీమ సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ విద్యార్థి, యువ జన సదస్సును నిర్వహించి కా.రాజశేఖరరెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాము. తరువాత దశలో ఎ.ఐ.యస్‌. ఎఫ్‌.రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహించిన రోజుల్లో వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆయన గైడెన్స్‌లో ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో విద్యార్థి కార్యకర్తలకు జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయ పాఠశాలలను ఇరవై రోజుల నుండి నెల రోజులపాటు, అలాగే జిల్లా స్థాయి శిక్షణా శిబిరాలను విధిగా నిర్వహించేవారు. ఆ దశలో రాజశేఖరరెడ్డి గారి తాత్విక చింతనను, నిరాడంబరమైన జీవన శైలిని, నడవ డికను, నిగర్విమనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఆస్వాదిస్తూ, కమ్యూనిస్టుగా ఎదగడానికి నాకెంతో దోహదపడింది.
కమ్యూనిస్టు కుటుంబంలో బాధ్యతనెరిగిన పెద్దమనిషిగా కార్యకర్తలపట్ల ప్రేమానురాగాలను కనబరుస్తూ ఆయన ప్రోత్సహించిన తీరు ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచేది. విద్యార్థి, యువజన కార్యకర్తలు ఉద్యమంలో ''మిలి టెంటు''గా పనిచేస్తూ విజయాలు సాధిస్తూ, మన్ననలను పొందుతూ, పై పై కెదుగుతుంటే అమితానందం పొందేవారు. కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న యువజన, విద్యార్థి కార్యకర్తలకు అదనపు బాధ్యతలను అప్పగించడం ద్వారా సముచిత స్థానం కల్పించడం గూర్చి, వారి శక్తి సామర్థ్యాలను సమర్థవంతంగా విప్లవోద్యమానికి ఉపయో గించుకోవాలని నిరంతర ఉద్బోధించే వారు. శ్రమించే యువ కార్యకర్తలు అవగాహనారాహిత్యంతో ఒకటి రెండు తప్పులు చేసినా పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని ఒకవైపున సర్దిచెబుతూనే మరొక వైపున సరిదిద్దడా నికి ఉత్తమ సలహాలిచ్చేవారు. కాకపోతే సమాచార అంతరం పర్యవసానంగా అప్పుడప్పుడూ చిరు కోపం, మౌనం ప్రదర్శిస్తూ కటువుగా వ్యవహరిస్తూండే వారు. వాస్తవం తెలియగానే మళ్ళీ అంతే అభిమానంతో చేరదీసి, వెన్నుతట్టి ప్రోత్సహించేవారు. అలాంటి చేదు అనుభవాన్ని, అందులోని తియ్యదనాన్ని నేనూ ఒకసారి ఆస్వాదించాను.
(సి.ఆర్‌. ఫౌండేషన్‌ (కొండాపూర్‌, హైదరాబాద్‌)లోని నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రంలో ఆయన విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ వ్యాసం ప్రచురితం.)