Tuesday, November 29, 2011

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జాతి ప్రయోజనాలకు ఎసరు!

suyra telugu daily November 29,2011

- ప్రజల జీవనోపాధికి గొడ్డలిపెట్టు
- గుత్తాధిపత్యానికి విదేశీ కార్పొరేట్ల వ్యూహం
- స్వదేశీ కార్పొరేట్లు సైతం ఉబలాటం
- దేశీయ ఉపాధి రంగాలకు పెను ముప్పు
- రోడ్లపాలు కానున్న కిరాణా వ్యాపార కుటుంబాలు
- వినియోగదారులపై అదనపు ఖర్చుల భారాలు

కోట్లాది మంది సామాన్య ప్రజల జీవనోపాథిని గొడ్డలి పెట్టుకు గురి చేసే ప్రమాదకరమైన చట్టాలను పార్లమెంటు చేత త్వరిత గతిన ఆమోదింప చేసే పనిలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ- 2 ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది. చిల్లర వర్తక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)పై ఉన్న పరిమితులను ఎత్తివేసే చట్టం తేవడానికి బరితెగించింది. ప్రస్తుతం నిషేధంలో ఉన్న బహుళ బ్రాండ్ల చిల్లర వర్తకంలోకి 51 శాతం, ఒకే బ్రాండ్‌ చిల్లర వర్తకంలో ప్రస్తుతం ఉన్న 51శాతం పరిమితిని తొలగించి ఏకంగా 100 శాతానికి పెంచే బిల్లుకు పచ్చ జెండా ఊపుతూ కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడం ఇందుకు ప్రబల నిదర్శనం.

కిరాణా రంగంలోకి ఎఫ్‌డీఐని అనుమతించడంతో సంభవించే దుష్పరిణామాలపై దేశ వ్యాపితంగా విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం ఏ మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. నూట ఇరవై కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద, చిల్లర వర్తకానికి విస్తృతమైన మార్కెటింగ్‌ అవకాశాలున్న దేశం మనది. వివిధ సంస్థల అంచనాల మేరకు రూ.30 లక్షల కోట్ల (600 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) వాణిజ్య కార్యకలాపాలకు మన దేశ చిల్లర వర్తక రంగంలో అవకాశాలున్నాయి. ఇది ఉపాథి కల్పనలో వ్యవసాయ రంగం తరువాత అతి పెద్ద రంగం. దేశ వ్యాప్తంగా కోటి ఇరవై లక్షల దుకాణాలతో పట్టణ ప్రాంతాల నుండి మారు మూల గ్రామాల వరకు పెద్ద ఎత్తున వికేంద్రీకృతమై, మొత్తం ఉపాథి కల్పనలో 8 శాతం వాటాతో (దాదాపు 4 కోట్ల మంది), జనాభాలో 4 శాతం మందికి జీవనాధారమైన కీలక రంగం ఇది. 97 శాతం చిల్లర వర్తకం అసంఘటిత రంగంలో జరుగుతుంటే, కేవలం 3 శాతం సంఘటిత రంగంలోఉన్నది. చిల్లర వర్తకంలోని సంఘటిత రంగంలో కాలు మోపిన స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ సంస్థలు వ్యూహాత్మకంగా భారీ పెట్టుబడులతో గుత్తాధిపత్యం కోసం అడుగులు వేస్తున్నాయి.

అధికశాతం లాభాలకు అవకాశాలు ఉన్న ఈ మార్కెట్లో పాగా వేయాలని, అంతర్జాతీయంగా గుత్తాధిపత్యంఉన్న వాల్‌ మార్ట్‌, టెస్కో, క్యారీఫోర్‌, ఊల్స్‌ వర్త్‌, మెట్రో వగైరా బహుళ జాతి సంస్థలు కాచుకున్నాయి. వీటికి తోడు ఇప్పటికే ఈ రంగంలో చొరబడి అధిక లాభాల రుచిమరిగిన ఫ్యూచర్‌ గ్రూప్‌, రిలయన్స్‌, ఆదిత్య బిర్లా, భారతి గ్రూప్‌, టాటా, స్పెన్సర్స్‌, ఫాన్టలూన్‌, లైప్‌ స్టైల్‌, రహెజాస్‌, సుభిక్ష, త్రినేత్రి, విశాల్‌ గ్రూప్‌, పిరమిడ్‌ వంటి స్వదేశీ కార్పొరేట్‌ సంస్థలు స్వతంత్రంగా, బహుళ జాతి సంస్థల భాగస్వామ్యంతో చిల్లర వర్తకాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ఉబలాటపడుతున్నాయి.
విదేశీ సరుకులతో మన దేశీయ మార్కెట్లు నిండితే, కిరాణా రంగంతో పాటు వ్యవసాయం, చిన్న- మధ్యతరహా పరిశ్రమలు, చేతి వృత్తుల రంగాలు మరింత సంక్షోభంలో పడతాయి.

మానవవనరులు పుష్కలంగాఉన్న మన దేశంలో నిరుద్యోగ సమస్య పెనుభూతంగా పరిణమిస్తుంది. ఆర్థిక దోపిడీకి రాచబాట వేసినట్లవుతుంది. పర్యవసానంగా సమాజంలో అశాంతి, అలజడి, అభద్రతాభావం తీవ్ర రూపం దాల్చుతాయి. గ్రామీణ ప్రాంతాలకు పెట్టుబడులు తరలివస్తాయని, ఆరు లక్షల గ్రామాలలోని రైతాంగ వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరలు లభించడం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని, గ్రామసీమల స్వరూప స్వభావాలే మారిపోతాయని, ద్రవ్యోల్బణానికి కళ్ళెం వేయవచ్చునని, తద్వారా ధరలు నియంత్రితమై సరసమైన ధరలకు సరుకులు లభిస్తాయని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నికూడా ఎఫ్‌డీఐలు వెంటబెట్టుకు వస్తాయని, ప్రత్యక్షంగా- పరోక్షంగా కోటి మందికి ఉపాథి దొరుకుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్‌ శర్మ చెబుతున్నారు. అంటే దేశ వ్యాపితంగా విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ సంస్థలు విస్తరిస్తాయని చెప్పకనే సూచిస్తున్నారు. స్వయం ఉపాథి పొందుతున్న కోట్లాది మంది జీవితాలు ప్రశ్నార్థకమవుతాయన్న పచ్చి నిజాన్ని ప్రభుత్వం మరుగున పడేస్తున్నది.

శీతల గిడ్డంగులు వగైరా మౌలిక వసతుల లేమి కారణంగా ఆహార ధాన్యాలు, చిరు ధాన్యాలు, పళ్ళు, కూరగాయలు, పూలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలు, రొయ్యలు తదితర వ్యవసాయ- అనుబంధ రంగాల ఉత్పత్తులలో దాదాపు 40 శాతం కుళ్ళి పోవడం మూలంగా ఏడాదికి లక్ష కోట్ల రూపాయల సంపదను చేజేతులా నష్టపోతున్నామని మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఎఫ్‌డీఐల రాకతో ఈ నష్టాన్ని సగానికి తగ్గించుకోవచ్చని నమ్మ బలుకుతున్నారు. వ్యవసాయ క్షేత్రం నుండి వినియోగదారుని చేతిలోకి సరుకు చేరేసరికి ధరల్లో భారీ మార్పులు జరుగుతున్నాయని స్వయంగా ప్రధాన మంత్రే సెలవిచ్చారు. వినియోగదారుడు చెల్లించే మొత్తంలో కేవలం మూడవ వంతు మాత్రమే రైతులు తమ ఉత్పత్తులకు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐ’ చర్చా పత్రంలో కూడా పేర్కొన్నారు.

శీతల గిడ్డంగుల నిర్మాణం, నిర్వహణ, ఆహార- ఆహారేతర వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా గొలుసు కట్టు వ్యవస్థ (సప్లయ్‌ చైన్‌) ను మెరుగు పరచడానికి భారీ నిథుల అవసరం దృష్ట్యా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించక తప్పదని అంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన నిథులను కేటాయించి ఎఫ్‌సీఐ, పౌర సరఫరాల వ్యవస్థ, మార్కెట్‌ యార్డులు, మార్కెటింగ్‌ సదుపాయాలను కల్పించడంలో, విస్తరించడంలో, సమర్థవంతంగా నిర్వహించడంలో వైఫల్యం చెందిన ప్రభుత్వం, తాను అనుసరిస్తున్న లోపభూయిష్టమైన విధానాలను సవరించుకోవడానికి బదులు తన భాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నది. ప్రజా పంణీవ్యవస్థ (పీడీఎస్‌) ను విస్తరించడం ద్వారా అందరికి ఆహారభద్రత కల్పించాల్సిన- ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజా కంటక ప్రభుత్వంగా అవతారమెత్తింది.

కనీసం రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టగలిగిన విదేశీ సంస్థలను మాత్రమే అనుమతిస్తామని, ఆ మొత్తంలో సగం నిథులను వస్తూత్పత్తి ప్రాంతాలలో (బ్యాక్‌ ఎండ్‌) సరుకుల ఉత్పత్తి, శుద్ధి (ప్రాసెసింగ్‌), పంపిణీ , డిజైన్ల అభివృద్ధి, నాణ్యతా ప్రమాణాల నియంత్రణ, గిడ్డంగులు, శీతల రవాణా వ్యవస్థ, ప్యాకింగ్‌ వగైరా మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించాలని విదేశీ పెట్టుబడిదారులకు బిల్లులో షరతు విధించామని ప్రభుత్వం చెబుతున్నది. చిన్న తరహా పరిశ్రమలు, చేతి వృత్తిదారుల నుండి 30 శాతం వినిమయ సరుకులను విధిగా సేకరించాలనే షరతునూ పొందుపరిచామంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో ప్రభుత్వానికే మొదటి హక్కు ఉంటుందని పేర్కొన్నారు. ఈ షరతులన్నింటినీ అమలు చేస్తున్నామని బహుళ జాతి సంస్థలు స్వయంగా సంబంధిత ప్రభుత్వ విభాగాలకు తెలియజేస్తే చాలన్న మినహాయింపునూ ఇచ్చారు. ఈ ఒక్క మినహాయింపు చాలు ‘చట్టాన్ని చట్టుబండ చేసి అడ్డగోలు దోపిడీ చేయడానికి’ అన్న విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియదనుకొంటే ప్రజలు పప్పులో కాలేసినట్లే.

అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత దేశ పర్యటన నాటికే చట్టం చేసే ఈ కర్తవ్యాన్ని పూర్తి చేసి, బహుమతిగా ఇవ్వాలనుకొన్నారు. కానీ ఆనాడు సాధ్యపడ లేదు. అమెరికా అధినేత ఒత్తిడి, బహుళ జాతి సంస్థల ఒత్తిడి, ప్రలోభాల పర్యవసానం కావచ్చు, ఎట్టకేలకు ఇప్పుడు చిల్లర వర్తక రంగంలో ఎఫ్‌డీఐలకు పరిపూర్ణమైన స్వేచ్ఛను ప్రసాదించే బిల్లు పార్లమెంటు తలుపు తడుతున్నది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన పది లక్షల జనాభాకు పైనున్న 53 పట్టణాలలో ఎఫ్‌డీఐలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం తలపోస్తున్నది. నేటి విత్తే రేపటి మరిచెట్టు అన్న చందంగా, పాతుకుపోయి మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందన్న ఆలోచనే కొరవడింది. ప్రతిపక్ష పార్టీలు, ఒకటి రెండు యూపీఏ భాగస్వామ్య పార్టీలు వ్యతిరేకిస్తున్నా చట్టంచేసి తీరుతామని శపథం చేసింది.

సూపర్‌ మార్కెట్లను నెలకొల్పు కోవడానికి లైసెన్సులిచ్చే అధికారం తమ చేతుల్లోనే ఉన్నది కాబట్టి, తాము అనుమతించబోమని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బీరాలు పలుకుతున్నాయి. వీటి స్వభావం ప్రజలకు తెలియంది కాదు. ఒకసారి చట్టం రూపు దాల్చిన తరువాత దేశ వ్యాపితంగా ఎలా చొచ్చుకుపోవాలో బహుళ జాతి సంస్థలకు బాగా తెలుసు. ఎఫ్‌డీఐల ప్రవేశం వల్ల దుష్పరిణామాలు కోకొల్లలు. మచ్చుకు 1) చిల్లర వర్తకం, వ్యవసాయం, చిన్న- మధ్య తరహా పరిశ్రమలు, చేతి వృత్తుల రంగాలు, చిరు వ్యాపారులు (హాకర్స్‌), వీధి వ్యాపారులు (స్ట్రీట్‌ వెండర్స్‌ ) గొడ్డలి వేటుకు గురై ఉపాథి కోల్పోతారు. విదేశీ, స్వదేశీ గుత్త సంస్థలు చిల్లర వర్తక రంగంలో విస్తరించే కొద్దీ కిరాణా వ్యాపారంపై అధారపడి స్వయం ఉపాథి పొందుతున్న కుటుంబాలు వీధులపాలు కాక తప్పదు.

వివిధ దేశాల అనుభవాలు కానీ, లేదా మన దేశంలో కార్పొరేట్‌ సంస్థలకు చెందిన పెద్ద పెద్ద సూపర్‌ మార్కెట్లు వెలిసిన ప్రాంతాలలో సంభవించిన దుష్పరిణామాలపై పలు స్వతంత్ర సంస్థలు ముంబయి, డిల్లీ తదితర మహానగరాలలో నిర్వహించిన పలు అధ్యయనాల నివేదికలు తీవ్ర ఆందోళన కలిగించే అంశాలను బహిర్గతం చేశాయి. 2) మన ఆహార సేకరణ, పంపిణీ వ్యవస్థను విదేశీ గుత్త సంస్థల చేతుల్లో పెట్టడం అత్యంత ప్రమాదకరం. అత్యధిక ప్రజానీకం ఆహార భద్రత కొరవడి దారిద్య్రంలో మగ్గి పోతున్న పూర్వ రంగంలో ఒక వైపు ఆహార భద్రతా చట్టాన్ని తెస్తున్నామని కబుర్లు చెబుతూ, మరొక వైపున ఆహార ఉత్పత్తుల సేకరణ, నిల్వ, రవాణా, అమ్మకం కార్యకలాపాలను బహుళ జాతి సంస్థల గుప్పెట్లో ఇరికిస్తే భవిష్యత్తులో భయానక పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది.

3) ఆహార- ఆహారేతర నిత్యావసర వస్తువుల ఉత్పత్తిదారులపైన, మండీ తదితర చిల్లర వర్తకంపైన, సరఫరా వ్యవస్థ మొత్తంపై గుత్తాధిపత్యం సాధించాక వారు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా వ్యవహారం నడుస్తుందనడంలో సందేహం లేదు. 4) ఆహార ఉత్పత్తుల్లో ఒడుదుడుకులు, కృత్రిమ కొరత, ధరల పెరుగుదల తదితర సమస్యలతో మరింత అధ్వాన్నమైన పరిస్థితులు దాపురిస్తాయి. 5) గిట్టుబాటు ధరల్లేక ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్న రైతాంగ భవిష్యత్తును బహుళ జాతి సంస్థలకు అప్పగిస్తే ఏం జరుగుతుందో ఊహకందని విషయమేమీ కాదు. రైతాంగాన్ని తమపైపు ఆకర్షించడానికి వ్యవసాయోత్పత్తులకు మొదట కాస్త మెరుగైన ధరలను కల్పించి, తమ గుప్పెట్లోకి లాక్కొన్నాక తమ అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తాయి.

బహుళ జాతి సంస్థలు ఈ రంగంలో ప్రవేశిస్తే , దళారీ వ్యవస్థ అంతరించి పోయి రైతులకు మెరుగైన ప్రతిఫలం లభిస్తుందని ఊరిస్తున్నారు. దళారీ వ్యవస్థ రద్దవుతుందని చెప్పడం పెద్ద దగా. ఇప్పుడున్న రూపంలో కాక పోతే మరో రూపంలో దళారీ వ్యవస్థ కొనసాగుతుంది. ఇతర దేశాల అనుభవాలు అదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఏ పంట పండించాలో, ఏ విత్తనాలు విత్తాలో, ఏ కంపెనీ ఎరువులు వాడాలో, ఏ క్రిమి సంహారక మందులు వినియోగించాలో వారే రైతాంగానికి నిర్దేశించే దుస్థితి నెలకొంటుంది. వారు నిర్ణయించిన ధరలకే సాగుకు కావలసిన ఇన్‌ పుట్స్‌ను కొనుక్కోవలసి, వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవలసి వస్తుంది. 6) వినియోగదారుల ఆహారపు అలవాట్లను కూడా వారే నిర్దేశిస్తారు. 7) తర తరాలుగా కిరాణా వ్యాపారంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కోట్లాది మంది ఉపాథి గొడ్డలి పెట్టుకు గురౌతుంది.

విదేశీ పరిశ్రమల్లో ఉత్పత్తి అయిన సరుకులను, నాణ్యతాలోపం వల్ల తిరస్కరించి వస్తువులను , అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో అమ్ముడుపోని నాసిరకం సరుకులను- బహుళ జాతి సంస్థలు మన దేశీయ మార్కెట్‌లో అమ్మడం ద్వారా చిన్న- మధ్యతరహా దేశీయ పరిశ్రమలు మూతబడి, కోట్లది మంది ఉపాథి కోల్పోతారు. 9) ప్రస్తుతం ఈ రంగానికి చెందిన మండీ వ్యాపారులు, దళారులు, చిల్లర వర్తకులు తమ లాభాలను మన దేశంలోనే పెట్టుబడులుగా మారుస్తున్నారు. బహుళ జాతి సంస్థలు గడించిన లాభాలను తమ దేశాలకు తరలించుకు పోతారు. 10) కార్పొరేట్‌ సంస్థలు వినియోగదారులను ఆకర్షించి, అమ్మకాలు పెంచుకోవడానికి వ్యాపార ప్రకటనలు, విశాలమైన ఏర్‌ కండిషన్‌ హాళ్ళు, రియల్‌ ఎస్టేట్‌ కారణంగా పెరిగిన అద్దెలు, సూపర్‌ మార్కెట్ల నిర్వహణ కయ్యే భారీ ఖర్చులన్నింటినీ సహజంగానే వినియోగదారుల నుండే వసూలు చేస్తాయి. పర్యవసానంగా నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు పెరిగిపోతాయి.

Monday, November 21, 2011

పింఛనుదారుల భవిష్యత్తుకు పెను ముప్పు

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ( ఎఫ్ . డి . ఐ .) పింఛను రంగంలోకి అనుమతిస్తూ పార్లమెంటు ముందున్న " పింఛను నిథుల నియంత్రణ , అభివృద్ధి ప్రాధికార సంస్థ ( పి .ఎఫ్ . ఆర్. డి . ఎ .) _ 2011 బిల్లు " లో సవరణ చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడంతో ప్రమాదఘంటికలు మోగించింది . శ్రామిక ప్రజానీకానికి ఒక హక్కుగా సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది . కార్మికులుగా , ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తూ అనారోగ్యం పాలైనా , ప్రమాదానికి గురైనా , అకాల మరణం చెందినా, ఉపాథి కోల్పోయినా , వృద్ధాప్యం వల్ల రిటైర్ అయినా ఆర్థికంగా ఆదుకోవలసిన బాధ్యత సమాజంపై ఉన్నది . వీటిలో ఏ ఒక్క కారణంగానైనా ఆ కుటుంబ జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం పడుతుంది . వృద్ధాప్య పింఛను పథకం సామాజిక భద్రతా పథకాల్లో అత్యంత కీలకమైనది . జీవితాంతం శ్రమను వెచ్చించి సమాజానికి సేవ చేసిన పౌరునికి వృద్ధాప్యంలో ప్రశాంత జీవితం గడపడానికి కనీస రక్షణకు హామీ ఉండాలి . కాస్తా స్థిరమైన ఆర్థిక వనరు ఉన్నప్పుడే దానికి బరోసా ఉంటుంది .
సామాజిక భద్రతలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఒక హక్కుగా పింఛను సౌఖర్యాన్నిఅనుభవిస్తూ వచ్చారు . సర్వీసు నుండి రిటైర్ అయ్యే నాటికి పొందుతున్న వేతనం ప్రాతిపదికన పెన్షన్ ను నిర్ధారించి , విశ్రాంతి ఉద్యోగులకు లేదా ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి జీవితాంతం చెల్లించే చట్టబద్దమైన విధానం అమలులో ఉన్నది . నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా కరువు భత్యం , వేతన సవరణలను వర్తింప చేసి పింఛను చెల్లించడం ద్వారా జీవిత చరమాంకంలో ఆర్థికపరమైన ఒడిదుడుకులు లేకుండా స్థిరమైన , ప్రశాంత జీవనం సాగించడానికి చట్టం బరోసా ఇచ్చింది . 2003 సం. లో నాటి యన్ . డి .ఎ . ప్రభుత్వం పి . ఎఫ్ . ఆర్. డి . ఎ . ను కేవలం ఒక ఉత్తర్వు ద్వారా నెలకొల్పి పింఛను చెల్లింపు విధానానికి చెల్లు చీటీ ఇచ్చేసింది . అటుపై వచ్చిన యు . పి .ఎ . _ 1 ప్రభుత్వం దాన్ని చట్టం చేయాలని శత విధాలా ప్రయత్నించినా వామ పక్షాల ప్రతిఘటన మూలంగా సాధ్యపడలేదు .
పెన్షన్స్ చెల్లింపు ప్రభుత్వానికి పెను భారంగా తయారయ్యిందని , సగటు ఆయుద్ధాయం పెరగడంతో పింఛనుదారుల సంఖ్య పెరిగిపోతున్నదని , ఈ సమస్య ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా పరిణమించిందని ప్రపంచ బ్యాంకు , ఆర్థిక సంస్కరణవాదుల సలహా చెవికెక్కించుకొన్న ప్రభుత్వం ఈ దుస్సాహసానికి పూనుకొన్నది . నూతన ఆర్థిక విధానాల అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతన పింఛను విధానాన్ని ప్రవేశ పెట్టింది . దాని ప్రకారం 2004 జనవరి 1 తరువాత ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగంలో చేరిన వారికి వృద్ధాప్య మరియు కుటుంబ పింఛను
చెల్లించాల్సిన బాధ్యత నుండి ప్రభుత్వం చేతులు దులిపేసుకొన్నది .
" కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం " లో ప్రభుత్వ , ప్రయివేటు రంగాలలో ఉద్యోగాలు చేస్తున్న వారే కాక పౌరులెవరైనా ఈ పథకంలో చందాదారులుగా చేరి వృద్ధాప్యంలో పింఛను పొందడానికి వీలు కల్పించారు . కేంద్ర ప్రభుత్వం తో పాటు 27 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకంలో భాగస్వాములైనాయి . సాధారణ పౌరులూ చందాదారులుగా చేరుతున్నారు . ఇప్పటికి చందాదారుల సంఖ్య దాదాపు ఇరవై నాలుగు లక్షల మందికి చేరుకొన్నది . పింఛను నిథుల నియంత్రణ , అభివృద్ధి ప్రాధికార సంస్థ ( పి .ఎఫ్ . ఆర్. డి . ఎ .) ఛెర్మన్ యోగేష్ అగర్వాల్ వెల్లడించిన సమాచారం మేరకు మదుపుదారులు ఇప్పటి వరకు చెల్లించిన ప్రీమియం డబ్బులతో రు . 8,500 కోట్లకు మూలనిథి ( కార్పస్ ఫండ్ ) చేరుకొన్నది . ప్రసార మాధ్యమాలలో వచ్చిన తాజా సమాచారం ప్రకారమైతే రు . 10,000 కోట్లకు చేరుకొన్నది . 2019 నాటికి రు. 15,00,000 ( 300 బిలియన్ అమెరికన్ డాలర్స్ ) కు మూలనిథి చేరుకొంటుందన్న అంచనా వేస్తున్నట్లు కూడా అగర్వాల్ ప్రకటించారు .
ఈ పథకంలో అంతర్భాగంగా వెయ్యి రూపాయల వార్షిక ప్రీమియంతో పేదల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న " స్వావలంబన పథకం " లో ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా సభ్యులుగా చేరారని కూడా అగర్వాల్ వెల్లడించారు . దీని పరిథిని విస్తరించడంపై అధ్యయనం చేసి నివేదికను సమర్పించమని కేంద్ర ప్రభుత్వం శ్రీ జి . యన్ . బాజ్ పాయ్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా నియమించింది . సమీప భవిష్యత్తులోనే భారీ స్థాయిలో మూల నిథులు పోగుబడి ఆర్థిక రంగంలో అత్యంత కీలకమైన , వ్యాపారానికి విస్తృతమైన అవకాశాలున్న రంగంగా ఆవిర్భవించబోతున్నది . దీన్ని కబ్జా చేసి ఆర్థిక ప్రయోజనాలు పొందాలని స్వదేశీ మరియు విదేశీ గుత్త సంస్థలు పోటీ పడుతున్నాయి . విదేశీ సంస్థలకు సంబంధించి " కాలిపోర్నియా పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్ , కాలిపోర్నియా స్టేట్ టీచర్స్ రిటైర్మెంట్ సిస్టమ్ " లాంటి సంస్థలు ఆతృతతో ఎదురుచూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి . కారణం ప్రతి సంవత్సరం నూతనంగా పదుల లక్షల సంఖ్యలో శ్రామిక జనాభాకు తోడవుతున్నారు . పింఛను పథకం పరిథి బయట ఉన్న అసంఖ్యాకులైన అసంఘటిత కార్మికులకు నూతన పింఛను పథకాన్ని వర్తింప చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టుతున్నది . దాంతో భీమా రంగం మరియు మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఆర్థిక రంగ పరిశ్రమల కంటే పింఛను రంగం చాలా పెద్దదని పసిగట్టాయి . అందు వల్లనే సంస్కరణలలో భాగంగా పింఛను , భీమా రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాలని మన పాలకులపై బహుళ జాతి సంస్థలు తీవ్ర స్థాయిలో వత్తిడి చేశాయి . పర్యవసానంగానే మొదటి దశలో భీమా రంగంలో 26% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ( యఫ్ . డి . ఐ . ) అనుమతిస్తూ చట్టం చేశారు . అది చాలదని చట్టానికి సవరణ చేసి యఫ్ . డి . ఐ . పరిమితిని 49 % కు పెంచాలని ప్రభుత్వం ఉబలాట పడుతున్నది . ఈ పూర్వ రంగంలోనే ప్రతిపాదిత పి . ఎఫ్ . ఆర్ . డి . ఎ . లో సవరణ చేసి యఫ్ . డి . ఐ . కి తలుపులు బార్లా తెరవాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది .
కార్మిక సంఘాలన్నీ రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఐక్యంగా నిలబడి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తున్నా , ఖాతరు చేయచేయడం లేదు . మరొక వైపున ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ( ఇ . పి .ఎఫ్ .) , ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం ( ఇ . పి . యస్ .) లపై ప్రభుత్వం ముప్పేట దాడి చేస్తున్నది . 2010_11 ఆర్థిక సంవత్సరంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇ . పి .ఎఫ్ . ఆర్ .) లో సంఘటిత రంగంలోని 4,50,000 సంస్థలకు చెందిన ఐదు కోట్లకు పైబడి ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు . రు. 1,85,000 కోట్ల మూల ధనం ఉన్నది . ఇ . పి . యస్ . ఖాతాలో దాదాపు లక్ష కోట్ల రూపాయలున్నాయి . ఎంప్లాయీస్ డిఫాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఫండ్ ( ఇ . డి . యల్ . ఐ .) ఖాతాలో పది వేల కోట్ల రూపాయలున్నాయి . మూడు పథకాల్లోని మొత్తం కలిపితే దాదాపు మూడు లక్షల కోట్ల మూలధనం ఉన్నదని అంచనా. ఈ నిథులను షేమా ర్కెట్ లో పెట్టుబడులుగా మలచాలని ప్రభుత్వం తలపోస్తున్నది . కార్పోరేట్ సంస్థలు వాటిని వినియోగించుకోవాలని గోరీకాడ నక్కల్లా కాచుక్కుర్చున్నాయి . ఉద్యోగుల సుదిర్ఘ పోరాటాల తరువాత గానీ ఇ . పి .ఎఫ్ . డిపాజిట్ల మీద 9.5% వడ్డీ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించ లేదు . జి .పి .ఎఫ్ . మరియు పి . పి . ఎఫ్ . డిపాజిట్లపై ఇప్పటికీ 8 % వడ్డీనే ఇస్తున్నారు . ఈ నిథులన్నింటినీ ప్రభుత్వాలే బాండ్ల రూపంలో రుణాలుగా తీసుకొని వాడుకొంటున్నాయి . సేవింగ్స్ పై బ్యాంకులిస్తున్న వడ్డీతో సమానంగా కూడా ఇవ్వడం లేదు . ఉపాథి భద్రతకు ఎసరు పెడుతున్నారు . పర్మనెంట్ కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది . ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ లోని ప్రయోజనాల్లో కోత విధించారు . దేశంలో ఉన్న దాదాపు 45 కోట్ల శ్రామిక జనాభాలో 8% కూడా లేని సంఘటిత రంగ కార్మికుల దుస్థితే ఇలా ఉంటే అసంఘటిత కార్మికుల స్థితిగతులు వర్ణనాతీతం .
కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ కార్మికుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది . చట్టబద్దమైన ఎలాంటి సామాజిక భద్రతా హక్కులూ లేవు . ఉపాథికి భద్రత లేదు . నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాల పెరుగుదల ఎండమావే . విద్య , వైద్యం , నివాసం వగైరా మార్కెట్ లో ఖరీదైన సరుకులుగా మారిపోయాయి . ఈ తరగతి శ్రామికులకు వృద్ధాప్యంలో కనీస రక్షణ కల్పించలేని విధంగా నూతన పింఛను పథకం ( యన్ . పి . యస్ .) ను అమలు చేస్తే దుప్షరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడం చాలా కష్టం . ఈ పథకంలోని చందాదారులకు సరళీకరణ , ప్రయివేటీకరణ , ప్రపంచీకరణ విధానాల రుచిని ప్రభుత్వం చూపిస్తున్నది . కార్మికులు , ఇతర పౌరులు జీవితాంతం మదుపు చేసుకొన్న నిథుల ( రిటైర్మెంట్ సేవింగ్స్ ) నిర్వహణ బాధ్యతను " ప్రయివేట్ ఫండ్ మేనేజర్స్ " కు అప్పగించడం ద్వారా ప్రయివేటీకరించాలని 2008 జూలైలో మొదట కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు కేంద్ర కార్మిక సంఘాలు ప్రతిఘటించడంతో , వాటి ప్రాతినిథ్యం ఉన్న " సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ " కూడా అంత సానుకూలత వ్యక్తం చేయలేదు . కార్పొరేట్ రంగంలో దిగ్గజాలుగా ఉన్న హెచ్ . యస్ . బి . సి ., ఐ . సి .ఐ .సి .ఐ . , రిలయన్స్ సంస్థలతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను ఫండ్ మేనేజర్స్ గా నియమించడానికి ప్రయత్నించింది . విమర్శలు వెల్లువెత్తడంతో బ్యాంక్ ఆఫ్ ఇండియాను ట్రస్టీ బ్యాంకు గాను , యస్ . బి . ఐ . , యు . టి .ఐ ., మరియు యల్ . ఐ . సి . సంస్థలను " ప్రయివేట్ ఫండ్ మేనేజర్స్ " గా తాత్కాలిక ప్రాతిపదికపై ఎంపిక చేసి , బాధ్యతలను అప్పగించారు . దాని ప్రకారం నిథుల్లో 55% యస్ . బి . ఐ . , 40% యు . టి .ఐ ., 5% యల్ . ఐ . సి . లకు కేటాయించారు . 2008_ 09 నుండి 2010_11 ఆర్థిక సంవత్సరాల మధ్య 8.05% నుండి 16.38 % వరకు ఆదాయాన్ని సముపార్జించి పెట్టాయి . ఫండ్ మేనేజర్స్ అనుసరించే విధానాలపై రాబడి ఆధారపడి ఉంటుంది . ప్రతి సంవత్సరం టెండర్లు స్వీకరించి ప్రయివేట్ ఫండ్ మేనేజర్స్ ను నియమించాలనే నిబంధన విధించారు . పి. ఎఫ్ . ఆర్ . డి . ఎ . చట్టంగా రూపొందిన తరువాత " ప్రయివేట్ ఫండ్ మేనేజర్స్ " నియామక ప్రక్రియలో ప్రభుత్వ రంగ సంస్థలకు , స్వదేశీ మరియు విదేశీ గుత్త సంస్థల మధ్య అసలు పోటీ మొదలవుతుంది . ప్రయివేట్ ఫండ్ మేనేజర్స్ సిండికేట్ గా ఏర్పడి కూడబలుక్కొని మదుపుదారులను దగా చేయరనే " గ్యారంటీ " లేదు . సమకాలీన చరిత్రలో బోలెడు చేదు అనుభవాలున్నాయి .
పింఛను నిథుల నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ ( పి .ఎఫ్ . ఆర్. డి . ఎ .) _ 2011 బిల్లును కాంగ్రెస్ నేతృత్వంలోని యు . పి . ఎ ._ 2 ప్రభుత్వం మార్చి 24 న లోక్ సభలో ప్రవేశ పెట్టింది . దానిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బి . జె .పి . నేత మరియు మాజీ ఆర్థిక శాఖా మంత్రి యస్వంత్ సిన్హా నేతృత్వంలో పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని నియమించారు . అధ్యయనం , పరిశీలన చేసిన మీదట మదుపుదారుల ప్రయోజనాల పరిరక్షణకు సభా కమిటీ మూడు నిర్దిష్టమైన సిఫార్సులు చేసింది . 1) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26% నికి మించకుండా చట్టంలో పరిమితి విధించాలి . 2) పెట్టుబడులపై కనీస ఆదాయానికి సంబంధించిన షరతు విధించడం ద్వారా మదుపుదారుల కనీస పింఛనుకు రక్షణ కల్పించాలి . 3) పింఛను పథకం ఖాతాల నుండి ఎప్పుడైనా నిథులను ఉపసంహరించుకొనే హక్కు మదుపుదారులకు కల్పించాలి .
కాంగ్రెస్ కు , బి . జె . పి . కి లేదా యన్ . డి . ఎ ., యు . పి .ఎ . కూటముల మధ్య ఆర్థిక సంస్కరణలపైన , విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించే అంశంపైన పెద్దగా భిన్నాభిప్రాయాలు లేవన్న సంగతి జగమెరిగిన సత్యం . ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త బాధ్యతాయుతంగా ఆలోచించినట్లు కనబడుతున్నది . కేంద్ర కార్మిక సంఘాలన్నీ కట్టగట్టుకొని పింఛను పథకం నిథుల ప్రయివేటీకరణను గట్టిగా తిరస్కరించాయి . వాటిని పూర్తిగా పరిగణలోకి తీసుకోకపోయినా స్థాయీ సంఘం మదుపుదారులకు కాస్త రక్షణ కల్పించడానికి ఆ సిఫార్సులను చేసింది . వాటిని కూడా నిద్వంధంగా తిరస్కరించడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నదో అర్థమవుతున్నది . భీమా రంగంలో యఫ్ . డి . ఐ . పై 26 % పరిమితి విధించడంతో ఇప్పుడు 49 % నికి పెంచాలంటే ఇబ్బందులు ఎదురౌతున్నాయని , చట్టానికి సవరణ చేస్తే తప్ప సాధ్యపడదని , ఆ అనుభవం దృష్ట్యా ఈ చట్టంలో పరిమితి విధించడానికి అంగీకరించ లేమని తేల్చేశారు . అంటే భవిష్యత్తులో కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారానే యఫ్ . డి . ఐ . శాతాన్ని పెంచుకొ౦టూ పోవడానికి
కృతనిశ్చయంలో ప్రభుత్వం ఉన్నది . ఇదే జరిగితే పింఛను పథకంపై నియంత్రణ , నిథుల వినియోగంపై బహుళ జాతి సంస్థలకు పూర్తిగా పెత్తనాన్ని అప్పజెప్పడమే అవుతుంది . మదుపుదారులను ముంచినా , తేల్చినా వాటిపైనే అధారపడాలి . కనీస ఆదాయంపై షరతు విధించలేమని , మదుపు సొమ్ము ఉపసంహరణకు చందాదారులు చూపెట్టే కారణాలపై సంతృప్తి చెందితేనే అనుమతిస్తామని సెలవిచ్చారు . కనీస పింఛనుకు రక్షణ కల్పించని యడల వృద్ధులను పేదరికంలోకి నెట్టివేయడమే అవుతుంది . ఖాతాదారులు తమ అవసరాల కోసం పొదుపు సొమ్మును ఉపసంహరించుకొనే హక్కును కాలరాయడం అప్రజాస్వామ్యం .
సవరణలతో కూడిన బిల్లును రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలో చట్టం చేసి అమలు చేయాలని యు . పి .ఎ . ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతున్నది . తద్వారా స్వదేశీ , విదేశీ గుత్త సంస్థల కబంధహస్తాల్లోకి భావి పింఛనుదారుల భవిష్యత్తును బలవంతంగా నెట్టవేసే అత్యంత ప్రమాదకరమైన విధాన నిర్ణయం వైపు వేగంగా అడుగులు వేస్తున్నది . మార్కెట్ శక్తుల జూదానికి నెలవుగా మారిన షేర్ మార్కెట్లో పింఛను పథకంలోని నిథులను పెట్టుబడులుగా పెడితే ఏం జరుగుతుందో ఊహించుకోవడం కష్టం కాదు . అమెరికాలో 2007 లో పురుడుపోసుకొని ప్రపంచాన్నికుదిపేసిన ఆర్థిక సంక్షోభం భయంకరమైన చేదు అనుభవాలను మిగిల్చింది. యూరప్ లో సంబవిస్తున్న దుష్పరిణామాలను చూస్తూనే ఉన్నాం . అమెరికా తదితర పాశ్చాత్య దేశాలలోని పింఛను పథకాల్లోని చందారులు దిక్కుతోచని పరిస్థితుల్లో వీధుల్లో పడ్డారు . కానీ మన దేశాధినేతలు ఏ మాత్రం గుణపాఠాలను నేర్చుకొన్న దాఖలాలు కనిపించడం లేదన్న దానికి ఇది ప్రబల నిదర్శనం . లోపభూయిష్ట విధానాలతో సామాన్యులను బలిపసువులును చేయడం దుర్మార్గం . కొండంత ఆశతో జీవితాంతం మదుప చేసుకొన్న అమూల్యమైన సొమ్ముకు భద్రత లేకపోతే శేష జీవితంలో ముసలితనాన్నిఎలా గడపాలనే హృదయ ఘోష పాలకుల చెవికెక్కడం లేదు . వారి మస్తిస్కాలు అమానుషమైన సంస్కరణల చుట్టే పరిభ్రమిస్తున్నాయి .
ఆర్థిక సంస్కరణలు ప్రజాభాహుళ్యం యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి దోహదపడాలే గానీ , సామాన్యుల జీవన ప్రమాణాలను గొడ్డలి పెట్టుకు గురిచేసి , జీవితాలను చిద్రం చేయడానికి దారితీయకూడదు . సంస్కరణల అమలులో రెండు దశాబ్దాల సుధీర్గ అనుభవాన్ని గడించాము . దేశీయ కార్పోరేట్ సంస్థల దురాగతాలను , వాటి వాల్ల సంబవిస్తున్న దుష్పరిణామాలను చూస్తున్నాం , అనుభవిస్తున్నాం . విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు స్థూలంగా వ్యతిరేకత లేదు . సమస్యల్లా ! ఏ ఏ రంగాలలోకి అనుమతించాలి , ఏ ఏ రంగాలలోకి అనుమతించకూడదు అన్నదే . విసక్షణ , విజ్ఞతతో నిర్ణయించుకోవాలి . విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మోజుతోనో ! అతిగా ఆధారపడో ! జాతి ప్రయోజనాలను బుగ్గిపాలు చేసే విధానాలను అనుమతించకూడదు . అభద్రతాభావంతో " దినదిన గండం నూరేళ్ళాయుస్సు" అన్న చంగదంగా బతకాల్సిన దుస్ఠితిని ఫించను పథకం మదుపుదారులకు కల్పించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు .

Monday, November 14, 2011

మానవాభివృద్ధిలో మనం ఎక్కడ ?

సూర్య దినపత్రిక , నవంబరు 15 , 2011

- దూరంగా ఉన్న వృద్ధిరేటు లక్ష్యం
- చైనా, శ్రీలంక కంటె వెనుకనే!
- తలసరి ఆదాయమూ తక్కువే
- నిరక్షరాస్యత అధికం
- క్షీణించిన ఉపాథి
- నెరవేరని పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు

అభివృద్ధి వైపు శర వేగంతో ముందుకు వెడుతున్నామని, 2010-11లో 8.5 శాతం ఆర్ధిక వృద్ధి రేటు సాధించామని, 2011-12 లక్ష్యమైన 9 శాతం వృద్ధి రేటును చేరుకోవడానికి ప్రస్తుతం అవకాశాలు కొంత సన్నగిల్లడంతో అది 8.2 శాతం ఉంటుందని కేంద్ర ప్రణాళికా సంఘం, ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి అంచనా వేస్తున్నట్టు ప్రకటించాయి. అ యితే, ప్రపంచాన్ని కుదిపివేస్తున్న ఆర్ధిక మాంద్యం పూర్వ రంగంలో మన ఆర్ధిక రేటుపై కేంద్ర ప్రభుత్వం సహజంగానే సంబరపడిపోతున్నది. సమ్మిళిత వృద్ధి (ఇంక్లూసివ్‌ గ్రోత్‌) విధానాలను అమలు చేస్తూ ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని వల్లె వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2011 వెలువడింది. ఆ ప్రకారం మానవాభివృద్ధి సూచికలు (హెచ్‌డిఐ) ఆధారంగా 187 దేశాల్లో మన దేశం 0.547 హెచ్‌డిఐ విలువతో 134 ర్యాంకుతో మధ్యస్తంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన మాత్రమే స్థానాన్ని కొనసాగించుకుంటున్నది. మన ఇరుగు పొరుగు దేశాలైన చైనా 0.687 హెచ్‌డిఐ విలువతో 97వ స్థానాన్ని, శ్రీలంక 0.691 హెచ్‌డిఐ విలువతో 101 ర్యాంకుతో మనకంటె ముందు వరసలో కొనసాగుతుండడాన్ని గమనించి గుణపాఠాలు నేర్చుకోవాలి.

స్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, అక్షరాస్యత, ఆరోగ్యం, సగటు ఆయుర్దాయం, పిల్లలు- తల్లుల సంక్షేమం, మహిళా సాధికారత, ప్రజల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు, ఆర్ధిక సంస్కరణల ప్రభావం వగైరా ప్రాతిపదికల ఆధారంగా అధ్యయనం చేసిన మీదట శాస్ర్తీయంగా రూపొందించిన ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించిన వివరాలు చూసైనా మన దేశాధినేతలకు, ఆర్ధిక విధానాల రూపకర్తలు కనువిప్పు కలగాలి. మన జాతీయ తలసరి ఆదాయం 3,468 అమెరికా డాలర్లు అయితే, చైనాలో 7,476 డాలర్లు. సగటు ఆయుర్దాయం మన దేశంలో 65.4 సంవత్సరాలు ఉంటే శ్రీలంకలో 74.9 సంవత్సరాలు, చైనాలో 73.5 సంవత్సరాలుగా ఉంది.

లింగ అసమానత సూచికలో మన దేశం 0.617తో 129వ స్థానంలో ఉంటే, చైనా 0.209తో 35వ స్థానంలో, శ్రీలంక 0.419తో 74, బంగ్లాదేశ్‌ 0.550తో 112, నేపాల్‌ 0.558తో 113, పాకిస్థాన్‌ 0.573తో 115 స్థానాలలో ఉండడం మనకు తల వంపులు తెచ్చే అంశం. దారిద్య్రం బహుముఖమైనది. ఆర్ధిక దారిద్య్రం, ఆదాయేతర దారిద్య్రం, బహుముఖ పేదరిక సూచిక (ఎండిపిసి) ప్రకారం 0.283తో మన దేశం శ్రీలంక (0.021), చైనా (0.056) కంటె బాగా వెనుకబడి ఉంది. 15 సంవత్సరాల వయస్సు పైబడినవారిలో 62.8 శాతం అక్షరాస్యత కలిగి వెనుకంజలో ఉన్నాము.

11వ పంచవర్ష ప్రణాళికా కాలం (2007-12)లో మన లక్ష్యాలు ఘనంగా ఉన్నాయి. కాని ఆదాయం, పేదరికం, విద్య, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, మౌలిక సదుపాయాలు, పర్యావరణం రంగాలలో నిర్దేశించుకున్న జాతీయ లక్ష్యాలను చేరుకోవాలని సమ్మిళిత వృద్ధి వ్యూహ ప్రణాళికను ప్రకటించారు. కానీ ఆచరణలో ఘోర వైఫల్యం చెందినట్టు ప్రణాళికా సంఘం అధికార గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ప్రణాళికా కాలంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును సంవత్సరానికి 9 శాతం సాధించి 5.8 కోట్ల మేరకు నూతన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నీరుగారింది. 2009-0లో జీడీపీ రూ. 61, 33, 230 కోట్లుగా అంచనా వేసినా, అందుకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు వృద్ధి చెందక పోగా సంస్కరణల పుణ్యమా అని సన్నగిల్లాయి. సంఘటిత రంగంలో నామ మాత్రపు పెరుగుదల ఉంది. ప్రైవేట్‌ రంగంలో కాస్త ఉపాధి కల్పన జరుగుతున్నా భద్రత కొరవడింది. ప్రభుత్వ రంగంలో అవకాశాలు మృగ్యం. కార్మికుల నిజవేతనాలు పడిపోయాయి.

7 సంవత్సరాలు పైబడినవారిలో 85 శాతం అక్షరాస్యత సాధించి, స్ర్తీ పురుషుల మధ్య వ్యత్యాసాన్ని పది శాతానికి తగ్గిస్తామని చెప్పారు. పురుషుల్లో 75.3, స్ర్తీలలో 53.7- సగటున 64.8 శాతం అక్షరాస్యత మాత్రమే సాధ్యమైంది. 6-14 సంవత్సరాల పిల్లలకు విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చింది. బడి మానివేసే పిల్లల సంఖ్యను అరికట్టడం ద్వారా సమన్యాయాన్ని సాధించడానికి చేవలసినది ఎంతో ఉంది. జీడీపీలో 6 శాతం నిధుల్ని వెచ్చిస్తామని చెప్పడమే గాని మూడు శాతానికి మించి వ్యయం చేయడం లేదు. ప్రైవేటీకరణ వల్ల నాణ్యమైన విద్యకు బడుగు, బలహీనవర్గాలవారు దూరమైపోతున్నారు.ఏడాదిలోపు వయస్సున్న శిశు మరణాల రేటును ప్రతి వేయి మంది జననాలకు 28కి తగ్గిస్తామన్నారు.

ఈ సంఖ్య శ్రీలంకలో 15, చైనాలో 32, ఇండోనేసియాలో 36 ఉన్నది. బాలింత మరణాలను, ప్రతి వేయి ప్రసవాలకు ఒకరికి తగ్గిస్తామన్నారు. కానీ ప్రస్తుతం ఇది 3.01 ఉన్నది. చైనాలో 0.56, శ్రీలంకలో 0.92 ఉన్నది. 2009 నాటికి అందరికీ రక్షిత మంచినీటి సదుపాయం కల్పిస్తామన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో 73.2, పట్టణ ప్రాంతాలలో 90 శాతానికి- సగటున 77.9 శాతం జనాభాకే అందుతున్నది. 0-3 వయసు పిల్లలో పౌష్ఠికాహార లోపంతో బాధపడేవారి సంఖ్యను, బాలికలు- మహిళల్లో రక్తహీనత గలవారి సంఖ్యను సగానికి తగ్గిస్తామన్న వాగ్దానం నెరవేరలేదు. దేశంలో 20 శాతం మంది పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్నారు.

వైద్యం, ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నది జీడీపీలో 4 శాతానికి మించడం లేదు. పౌర సరఫరాల వ్యవస్థ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, స్వర్ణ జయంతి గ్రామీణ రోజ్‌గార్‌ యోజన, ఇంటిగ్రేటెడ్‌ ఛైల్డ్‌ డెవెలప్‌మెంట్‌ స్కీం, అంత్యోదయ అన్న యోజన, మధ్యాహ్న భోజన పథకం వంటివి అమలు చేస్తున్నా ఆహార భద్రత అందని దుస్థితి కొనసాగుతున్నది. ఆహార భద్రత చట్టం ద్వారా 80 శాతం మందికి రక్షణ కల్పించాలని జాతీయ సలహా మండలి సిఫారసు చేసింది. ఈ పథకం అమలుకు 70 మిలియన్‌ టన్నుల ఆహారధాన్యాలు అవసరం కాగా, ప్రసుత్తం 59 మిలియన్‌ టన్నుల సేకరణ జరుగుతోంది. ఈ చట్టంపై నిపుణుల కమిటీ చర్చోపచర్చలతోనే కాలం గడుపుతున్నది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు గాలిలో వేలాడుతున్నది. భ్రూణహత్యల్ని నివారించే చట్టం ఉన్నా ఫలితం కనబడడంలేదు.
దేశంలో సంపద, సంపన్నుల సంఖ్య పెరుగుతున్నాయి. మన దేశంలోని వెయ్యి మంది కుబేరుల సంపద 2,41,275 మిలియన్‌ డాలర్లు. అంటే రూ.12 లక్షల కోట్లు. మన జీడీపీలో ఇది 20 శాతం. సహజవనరుల్ని కార్పొరేట్లు కొల్లగొడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణపట్ల బాధ్యతా రాహిత్యం పెరిగింది. అంకెల గారడీతో పేదల సంఖ్యను కృత్రిమంగా తగ్గించి చూపేందుకు కేంద్రం పాల్పడుతున్నది. అందులో భాగంగానే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిని, ఎగువన ఉన్నవారిని విభజించి తక్కువ సంఖ్యలో కుటుంబాలకే ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని భావిస్తున్నది. పరిస్థితి ఈ విధంగా ఉండగా, అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తున్నామనడంలో అర్ధం లేదు. లోపభూయిష్టమైన ఆర్ధిక విధానాలతో దారిద్య్ర నిర్మూలన సాధ్యం కాదు. 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలోనైనా జాతి నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి హేతుబద్ధమైన విధానాలను అమలు చేయాలి.


Thursday, November 10, 2011

చమురు విధానాలు సామానన్యులకు శరాఘాతాలు

సూర్య దినపత్రిక నవంబరు 8,2011

- సంస్కరణల ఫలితమే అధిక ధరలు
- పడిపోతున్న ప్రజల కొనుగోలు శక్తి
- క్షీణించిన జీవన ప్రమాణాలు
- పన్నుల్ని సైతం అరికట్టలేరా?
- సబ్సిడీలకు చెక్‌ పెట్టే యోచన
- ప్రైవేట్‌ విమానయాన సంస్థలకు రాయితీలు

అభివృద్ధి జపంతో సరళీకృత ఆర్ధిక విధానాలు అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత గడచిన 20 సంవత్సరాలలో పెట్రోల్‌ ధరలు సామాన్యుడి ఆర్ధిక పరిస్థితులను తలకిందులు చేస్తూ ఆకాశంవైపు దూసుకు వెడుతున్నాయి. 1989 ఏప్రిల్‌ 1న పెట్రోల్‌ ధర లీటర్‌ రూ. 8.50, కిరోసిన్‌ రూ. 2.25, డీజిల్‌ రూ. 3.50, 14.2 కె.జి. సిలిండర్‌ వంటగ్యాస్‌ (ఎల్‌పిజి) ధర రూ. 57.60 ఉండేవి. దేశంలో సరళీకృత ఆర్ధిక విధానాల ప్రక్రియ 1991లో మొదలయ్యింది. 1994 మొదటి త్రైమాసికానికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దాదాపు రెండింతలై రూ. 16.70, రూ. 6.98కి పెరిగాయి. 2000 నాటికి ఒక్కసారిగా 14.2 కె.జి. సిలిండర్‌ వంట గ్యాసు ధర రూ. 146 నుంచి రూ.196.55కి పెరిగి, నేటికి రూ. 430కి చేరుకుంది. 2010 జూన్‌లో పెట్రోల్‌ ధరలపై ప్రభుత్వం తన నియంత్రణను తొలగించుకుని, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలంలో 13 సార్లు, మొత్తం 33. 5 శాతం అదనంగా ధరలు పెరిగాయి.

ఆర్ధిక ద్రవ్యోల్బణాన్ని అరికట్టడమే ధ్యేయంగా సంస్థాగత సంస్కరణలను, కఠినతరమైన ద్రవ్య విధానాన్ని అమలు చేస్తున్నామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎన్ని కబుర్లు చెబుతున్నా ద్రవ్యోల్బణం కొరకరాని కొయ్యిగా తయారై పైపైకి ఎగబాకుతున్నదే గాని అదుపులోకి రావడం లేదు. కానీ చమురు ఉత్పత్తులు, నిత్యావసర సరకుల ధరలు, గృహ రుణాలపై వడ్డీ రేట్లు, రవాణా చార్జీలు పెరిగిపోతూ పేద, మధ్య తరగతి ప్రజానీకంపై పిడి గుద్దులు గుద్దుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం కాస్త తగ్గినట్టు తగ్గి, మళ్ళీ విజృంభించి 12.21 శాతానికి చేరకుంది. శ్రామిక ప్రజల నిజ వేతనాలు, ఆదాయాలు కుంచించుకు పోతూ కొనుగోలు శక్తి తగ్గిపోయింది. జీవన ప్రమాణాలు గణనీయంగా తగ్గిపోయాయి.

మే మాసంలో పెట్రోల్‌ ధరను రెండున్నర రూపాయలకు పైగా పెంచిన ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు ఇప్పుడు మళ్ళీ పెంచి చావు దెబ్బ కొట్టాయి. చమురు ధరలపై నియంత్రణను తొలగించిన చర్యను ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించినా కేంద్ర ప్రభుత్వం లెక్క చేయడం లేదు. కడకు యూపీఏ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏకంగా ప్రభుత్వం నుంచే వైదొలగుతామని హెచ్చరించినా, అది ఒక బెదిరింపేనని కొట్టి పారవేస్తూ ప్రభుత్వ పెద్దలు ధరల పెంపుదలను సమర్ధించుకుంటున్నారు. మార్కెట్‌ శక్తులకు అనుగుణంగా వ్యవహరించక తప్పదని ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు. అయితే, కనీసం చమురు ఉత్పత్తుల ధరలతో బాటు వాటి అమమ్మకాలపై ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నుల్ని సైతం అదే స్థాయిలో పెంచకుండా అరికట్టేందుకు సైతం పాలకులు ఆలోచన చేయడం లేదు. అంటే సామాన్యుల వెత ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు.

పెట్రోల్‌ ధరపై నియంత్రణను తొలగించిన విధంగానే డీజిల్‌ ధరలపై కూడా నియంత్రణ ఎత్తివేసి, స్వేచ్ఛా మార్కెట్‌కు అనుమతించాలని ప్రధాని ఆర్ధిక మండలి ఛైర్మన్‌ సి. రంగరాజన్‌, కేంద్ర ఆర్ధిక శాఖ సలహాదారు కౌసిక్‌ బసు సూచించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గితే, ధరల పెరుగుదలతో ఇప్పటికే నలిగిపోతున్న పేద, మధ్యతరగతి ప్రజానీకం బతుకు మరింత దుర్భరమవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆలోచనా సరళి గమనిస్తే, ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనిపిస్తున్నది. చమురు కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయి సంక్షోభంలో ఉన్నాయని, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు ధరలను సర్దుబాటు చేసుకోక తప్పదని ప్రభుత్వం నమ్మబలుకుతున్నది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయని పెట్రోల్‌ ధరలను గతంలో పెంచిన చమురు రంగ సంస్థలు ఇప్పుడు మన రూపాయి మరించ చిక్కిపోయి అమెరికన్‌ డాలర్‌తో మారకం ధర రూ. 49.25కు అటు ఇటు ఉన్నదని కారణం చెప్పి మరోసారి వినియోగదారులకు కర్రు కాల్చి వాత పెట్టాయి. ఇందులో ఉన్న వాస్తవమెంత? కొన్ని రోజుల క్రితమే డీజిల్‌, కిరోసిన్‌, వంట గ్యాస్‌ ధరలను పెంచి, మళ్ళీ పెట్రోల్‌ ధరలను పెంచడం నిజంగా చమురు సంస్థల నష్టాలను పూడ్చడానికా, లేక అధిక లాభాలను ఆర్జించి పెట్టడానికా? ఈ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వమే నిజాయితీతో, పారదర్శకంగా, జవాబుదారీ తనంతో వివరణ ఇవ్వాలి. చమురు కంపెనీల ఆదాయ- వ్యయాలు, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు పెట్రోలియం రంగంనుంచి వివిధ పన్నులు, రాయల్టీల రూపంలో సమకూరుతున్న ఆదాయం గురించి సమగ్ర వివరాలు వెల్లడిస్తే, ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుంది. అప్పుడు అంకెల గారడీ, కనికట్టు మాయాజాలంతో వినియోగదారులను నిలువుదోపిడీ చేస్తున్నారో లేదో బయటపడుతుంది.

దేశ ముడి చమురు అవసరాల్లో 84 శాతాన్ని విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలు పెంచక తప్పడం లేదని చెబుతున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 108.4 డాలర్లు. అంటే రూ. 5, 339. బ్యారెల్‌ అంటే దాదాపు 160 లీటర్లు. ఆ ప్రకారం లీటర్‌కు (రూ. 5,339/ 160= 33.40) రూ. 33 అవుతుంది. చమురు శుద్ధి, రవాణా, పరిపాలనా పరమైన ఖర్చుల పద్దు కింద రూ. 7 కలిపినా, మొత్తం రూ. 40 అవుతుంది. చమురు కంపెనీలు దానిని అమ్ముతున్న ధర రూ. 76. 40 పైసలు. దీనిని బట్టి రూ. 36 (47 శాతానికి పైగా) అదనంగా వినియోగ దారుడిపై భారం మోపుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు రంగాన్ని అత్యంత ప్రధానమైన ఆదాయవనరుగా భావిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఎకై్సజ్‌ డ్యూటీ, కస్టమ్స్‌ డ్యూటీ, చమురు అభివృద్ధి పన్ను, రహదారుల అభివృద్ధి పన్ను, విద్యాపన్ను, చమురు సంస్థలు ఆర్జించిన లాభాలపై పన్ను తోడవుతున్నాయి. అలాగే రాయల్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వం 2009-10లో రూ. 71, 767 కోట్లు ఆర్జించింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మకపు పన్ను (వ్యాట్‌) విధించి ఖజానాలను నింపుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం చమురు ఉత్పత్తుల ధరలను పెంచినప్పుడల్లా మన రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల పంట పండుతుంది. కారణం- పెట్రోల్‌పై దేశంలో కెల్లా అత్యధికంగా మన రాష్ట్రంలో 33 శాతం అమ్మకం పన్ను విధించడం ద్వారా ఖజానా నింపుకుంటున్నారు.
విలాసవంతమైన కార్లు కొనే సంపన్నులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆటోమొబైల్‌ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు.

తద్వారా కార్ల వినియోగాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుతున్నారు. తద్వారా డీజిల్‌, పెట్రోల్‌ వినియోగం పెరిగిపోతోంది. సంపన్నులైన డీజిల్‌ కార్ల వినియోగదారులకు సబ్సిడీపై డీజిల్‌ను ఎందుకు సరఫరా చేయాలి? అవసరం లేనివారు కూడా సబ్సిడీ సౌలభ్యాన్ని అందుకుని దుర్వినియోగం చేస్తున్నారు. అర్హులైన సామాన్య ప్రజానీకానికి మాత్రం ధరల పెరుగుదల శరాఘాతంగా పరిణమిస్తున్నది. మరో వైపు ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. దేశంలో 41 శాతానికి పైగా వినియోగించే ఇంధనం డీజెల్‌. లారీలు, బస్సులు, ట్రాక్టర్లు తదితర రోడ్డు, రైలు రవాణా వ్యవస్థలలో విస్తారంగా ఉపయోగించేది డీజిలే. కేంద్ర ప్రభుత్వంపై ఇంకా సబ్సిడీల భారం- డీజిల్‌పై లీటరుకు రూ. 8.58, వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ. 260. 50, చౌకదుకాణాల ద్వారా సరఫరా చేసే కిరోసిన్‌పై లీటర్‌కు రూ. 25.66 పడుతున్నదని చెబుతున్నారు.

దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి కొంత మొత్తాన్ని సబ్సిడీగా నగదు బదిలీ పథకం ద్వారా అందించి, పెట్రోల్‌ వలె వంట గ్యాస్‌పైన ఉన్న నియంత్రణను కూడా తొలగించి రూ. 750కి పెంచాలనే దురాలోచనతో ప్రభుత్వం ఉన్నది. చమురు రంగంలో సబ్సిడీలకు పూర్తిగా చరమగీతం పాడాలని ప్రభుత్వం భావిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం 2009-10లో రూ. 71, 767 కోట్లు వివిధ పన్నుల ద్వారా ఆర్జించి కేవలం రూ. 14, 954 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. ఎలాంటి పన్నులు విధించకుండా లీటర్‌ పెట్రోల్‌ను కేవలం రూ. 28కే ప్రైవేట్‌ విమానయాన కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. ప్రజలతో వ్యాపారం, కార్పొరేట్లకు రాయితీలు- ఇదీ ప్రభుత్వ ఆర్ధిక నీతి!

రూ. 1,14 వేల కోట్లు చమురు కంపెనీలు నష్టపోతున్నాయని కేంద్రం చెబుతున్నది. ఇది పచ్చి అబద్ధం. ఇవి నష్టాలు కావు. చమురు కంపెనీల ఆదాయాల్లో తరుగుదల. ఈ తరహా అండర్‌ రికవరీ మొత్తం 2009-10లో రూ. 34, 391 కోట్లుగా కిరోసిన్‌, వంటగ్యాస్‌ పద్దు కింద ఉన్నాయని అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. 2006-07 నుంచి 2009-10 మధ్య నాలుగు సంవత్సరాలలో చమురు కంపెనీలు రూ. 1, 26 వేల కోట్లు లాభాలు ఆర్జించినట్టు చెప్పారు. 2009-10లో ఆదాయపు పన్ను చెల్లింపు తర్వాత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రూ. 37, 319 కోట్లు నికర లాభాను ఆర్జించినట్టు చమురు- సహజవాయువు మంత్రిత్వశాఖ నివేదికలద్వారా వెల్లడవుతున్నది. అయినా, కంపెనీలు నష్టాలపాలవుతున్నామంటూ నిలువు దోపిడీకి పూనుకున్నాయి.

మన వినియోగావసరాలలో 25-30 శాతం వరకూ చమురు ఉత్పత్తి మన దేశంలోనే జరుగుతున్నది. దానిని కూడా అంతర్జాతీయ చమురు ధరలతో సమానంగానే కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్నది. దేశీయంగా చమురు అవసరాలు పెరుగుతున్న సందర్భంలోనే 2009-10లో రూ. 1,44, 037 కోట్ల విలువ చేసే 50, 974 మెట్రిక్‌ టన్నుల పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి జరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌ను చెప్పుచేతల్లో ఉంచుకుని అమెరికా ఘరానా దోపిడీకి పాల్పడుతున్నది. విదేశీ మారక ద్రవ్యంగా చెలామణీ అవుతున్న డాలర్‌ను అడ్డుపెట్టుకుని తన ఆర్ధిక సంక్షోభంనుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నది.
2009-10లో 15.93 కోట్ల టన్నుల ముడి చమురు, 1.47 కోట్ల టన్నుల చమురు ఉత్పత్తులు, ఎల్‌ఎస్‌జి దిగుమతుల కోసం రూ. 4, 18, 457 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాము. జూదంగా మారిన అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్‌ దిగ్గజాల కనుసన్నల్లో నడుస్తున్న స్టాక్‌ మార్కెట్లే మన ప్రభుత్వ రంగ సంస్థల భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. సరళీకృత విధానాలే ఈ దుష్పరిణామాలకు మూలం. ఈ విధానాలు సమూలంగా మారాలి.

పోల‘వరం’ పై ఎందుకీ రణం?

సూర్య దినపత్రిక నవంబరు ౩ ,2011

- నీటి వనరులు పరిమితం
- పెరుగుతున్న అవసరాలు
- నదీజలాల పంపకంలో అన్యాయాలు
- పోలవరంపై రాజకీయ నిప్పు హానికరం
- సముద్రం పాలవుతున్న నికరజలాలు
- పోలవరంతో బహుళార్ధ ప్రయోజనాలు


Polavaram-Indiraభూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. పర్యావరణంలో పెను మార్పులు వస్తున్నాయి. కరవు కాటకాలు, వరదలు, తుఫాన్‌లు జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలను పెంపొందించడానికి, భూ ఉపరితలంలో లభిస్తున్న నీటి వనరుల అభివృద్ధి, వినియోగం, నిర్వహణపై కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారించి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ‘జాతీయ జల విధానం- 2002’ నిర్దేశించింది. దాని వెలుగులో జాతి ప్రయోజనాలను, రాష్ట్ర ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రం ఎదుర్కొంటున్న నీటి సమస్యలను పరిశీలించి పరిష్కరించుకోవలసిన అవసరం ఉంది.

మన దేశానికి ప్రకృతి అనేక నదులను ప్రసాదించింది. వాటిలో పన్నెండు నదులు పెద్దవి. వాటి మొత్తం పరీవాహక ప్రాంతం 25, 28, 084 చదరపు కి.మీ.లు. అందులో 10, 97, 588 చ.కి.మీ. పరీవాహక ప్రాంతం ఉన్న గంగ- బ్రహ్మపుత్ర- మేఘన సరణి తర్వాత 3, 21, 289 చ.కి.మీ. విస్తరించి ఉన్న ఇందూస్‌, 3, 12, 812 చ.కి.మీ. విస్తరించిన గోదావరి, 2, 58, 948 చ.కి.మీ.పరీవాహక ప్రాంతం ఉన్న కృష్ణ నదులే పెద్దవి. పెన్నార్‌ నీటి లభ్యత తక్కువైనాపరీవాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుని పెద్దనదుల్లో ఒకటిగా పేర్కొన్నారు. గోదావరి, కృష్ణ, పెన్నార్‌లతో పాటు రాష్ట్రంలో వంశధార, నాగావళి వంటి దాదాపు 40 చిన్న, పెద్ద నదులున్నాయి. గోదావరి, కృష్ణ, పెన్నార్‌ నదులనుంచి రాష్ట్రానికి మొత్తం 2, 746 టి.ఎం.సి.ల నికర జలాలను ట్రిబ్యునళ్ళు కేటాయించాయి.

అందులో 1480 టి.ఎం.సి.లు (54 శాతం) గోదావరి జలాలే. కృష్ణలో 800 టీఎంసి, పెన్నార్‌లో 98 టీఎంసిలు కేటాయించారు. రాష్ట్రంలో పెన్నార్‌ నదీపరీవాహక ప్రాంతంలో వర్షపాతం చాల తక్కువ. కృష్ణా నదీ జలాల్లో బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన నికర జలాలను పూర్తిగా వినియోగించుకుంటున్నాం. రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాలు అత్యధికంగా కృష్ణ పరీవాహక ప్రాంతంలోనే ఉన్నాయి. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో మనకు జల వివాదాలు అపరిష్కృతంగా కొనసాగుతున్నాయి. కృష్ణ నదీ జలాల పంపకంపై బచావత్‌ ట్రిబ్యునల్‌ 1976లో ఇచ్చిన తీర్పు 2000 మే 31న ముగియడంతో, నదీ పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ వ్యవహారం తెరపైకి వచ్చింది. వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జస్టిస్‌ బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ను 2004 ఏప్రిల్‌ 2 న ఏర్పాటు చేసింది.

ఆరు సంవత్సరాలు విచారణ చేసిన మీదట 2010 డిసెంబర్‌ 30న ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు మన రాష్ట్ర ప్రయోజనాలకు శరాఘాతంగా పరిణమించింది. ఆ తీర్పును పునః పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ట్రిబ్యునల్‌ తీర్పుతో ప్రయోజనం పొందిన కర్ణాటక మిగులు జలాల పంపిణీలో అన్యాయం జరిగిందంటూ పేచీ కొనసాగిస్తున్నది. మహారాష్ట్ర కూడా ట్రిబ్యునల్‌పై ఒత్తిడి చేసి అధిక నీటి కేటాయింపును సాధించుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఈ వివాదంలో పై రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్టల్రు విజయం సాధిస్తే, తెలుగునాట నీటికోసం కష్టాలు వర్ణనాతీతం. కృష్ణ నది మిగులు జలాలపై ఆధారపడి వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించుకుంటున్న అత్యంత వెనుకబడిన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్‌ సాగర్‌ ఎత్తిపోతల పథకాలు, నల్లగొండ జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బిసి సొరంగ మార్గం) ప్రాజెక్టు, నిత్య కరవు పీడిత రాయలసీమ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న హంద్రీ- నీవా ఎత్తిపోతల పథకం, గాలేరు- నగరి, ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టులు మూలన పడడం ఖాయమనిపిస్తున్నది.

ఈ ప్రమాదంనుంచి బయట పడాలంటే బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై ప్రస్తుతం జరుగుతున్న పునః సమీక్షలో సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా, బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు ప్రాతిపదికన రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి రాజకీయ సంకల్పంతో పోరాడాలి. అందుబాటులో ఉన్న వంద సంవత్సరాల నదీ ప్రవాహాన్ని ప్రాతిపదికగా తీసుకుని నికర జలాల నిర్ధారణకు 75 శాతాన్ని ప్రామాణికంగా తీసుకునేలా ఒప్పించాలి. మిగులు జలాల లభ్యతపై నిర్ధారణ, పంపిణీ అశాస్ర్తీయమైనది. వర్షాభావం వల్ల కొన్ని సంవత్సరాలలో దిగువ రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌ నష్టపోతుందన్న వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బచావత్‌ ట్రిబ్యునల్‌ మిగులు జలాలను వినియోగించుకునే హక్కును మనకు దఖలు పరచింది.

ఆ హక్కును పరిరక్షించుకోవాలి. అల్మట్టి ఎత్తును సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి 519.6 మీటర్లకే పరిమితం చేసేలా పట్టుపట్టాలి. ఒకవైపు కృష్ణ నదీ జలాల పంపకంలో మన రాష్ట్ర్రానికి అన్యాయం జరగకుండా వ్యవహరించాల్సిన తరుణంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రాజకీయ నిప్పు చెలరేగడం అత్యంత హానికరం. గోదావరి పరీవాహక ప్రాంతం మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. 73, 201 చ.కి.మీ. మన రాష్ట్రంలో ఉంటే, అందులో 57, 960 చ.కి.మీ. తెలంగాణ, 15, 241 చ.కి.మీ. కోస్త ఆంధ్రలో ఉన్నది. నదీ ప్రవాహానికి మాత్రం 456 టిఎంసీలు తెలంగాణ, 120 టిఎంసీలు కోస్తా ప్రాంతంనుంచి సమకూరుతున్నప్పటికీ గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్‌ మూడు వేల టిఎంసీల నికరజలాలు లభిస్తాయని అంచనా కట్టి మన రాష్ట్రానికి 1480 టిఎంసీలను కేటాయిస్తూ 1980లో ప్రకటించింది.

మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలలో అత్యధిక భాగం అటవీప్రాంతం కావడంతో నీటిని వినియోగించుకునే అవకాశం వారికి లేకపోవడంతో మనకు లబ్ధి చేకూరింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన నీటిలో 812 టిఎంసీలు తెలంగాణలో, 668 టిఎంసీలు కోస్తా ఆంధ్రలో వాడుకోవడానికి వీలు కల్పించినా, ఇప్పటి వరకు మనం దాదాపు 800 టిఎంసీలను మాత్రమే ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకుంటున్నాం. ఇంకా 700 టిఎంసీల నికర జలాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఫలితంగా ప్రతి ఏడాదీ వరద నీటితో కలిపి సగటున 3 వేల టిఎంసీలు సముద్ర గర్భంలో వృథాగా కలిసిపోతున్నది. లక్షలాది ఎకరాలలో పంటలు నీటిపాలైపోతున్నాయి. ప్రాణనష్టం జరుగుతోంది. సమగ్ర జల విధానాన్ని రూపొందించడం ద్వారా వరదల వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించవచ్చు. సంవృద్ధిగా నీరున్న ప్రాంతాలనుంచి నీటిని కరవు పీడిత ప్రాంతాలకు సరఫరా చేయడం వల్ల రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుంది. ఆహార భద్రతకు దోహదపడుతుంది.

ఈ లక్ష్యానికి అనుగుణంగా నిర్మించ తలపెట్టిన ఇందిరాసాగర్‌ (పోలవరం) బహుళార్ధ సాధక ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం అంటే జాతి ప్రయోజనాలకు విఘాతం కల్గించడమే. ప్రజల ఏడు దశాబ్దాల చిరకాల వాంఛ పోలవరం. ఇది అభివృద్ధి చెందిన జిల్లాలకే ప్రయోజనకారి అన్న దుష్ర్పచారం వాస్తవాలను మరగుపరచడమే. ఈ ప్రాజెక్టు ద్వారా బహుళ ప్రయోజనాలు సమకూరుతాయి. ధాన్యాగారమైన కృష్ణ, గోదావరి డెల్టాకు సాగునీటి సరఫరాలో తరచు ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి. నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ధవళేశ్వరం, విజ్ఞేశ్వరం ఆనకట్టలు 10.50 లక్షల ఎకరాలున్న గోదావరి ఆయకట్టకు పంట కాలం మొత్తానికి నీరందించలేని దుస్థితి నెలకొన్నది. పోలవరం వంటి పెద్ద రిజర్వాయరు నిర్మాణం ద్వారా మాత్రమే ఆయకట్టకు రక్షణ కల్పించవచ్చు.

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల, కృష్ణ, విశాఖపట్నం జిల్లాలలోని మెట్ట ప్రాంతాలలో 7. 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము. కృష్ణ డెల్టా ఆయకట్టకు బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు మేరకు 80 టిఎంసీల నీటిని సరఫరా చేసి, కర్ణాటక, మహారాష్టల్ర వాటా 35 టిఎంసీలు పోను మిగిలిన 45 టిఎంసీలను నీటి ఎద్దడితో సతమతమవుతున్న తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలలో, రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లాలలో మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకోవచ్చు. 960 మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని పోలవరం ప్రాజెక్టుకు పై భాగంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న దేవాదుల, యల్లంపల్లి, దుమ్మగూడెం, ప్రాణహిత- చేవెళ్ళ ఎత్తిపోతల పథకాల విద్యుత్‌ అవసరాలకు వినియోగించుకోవచ్చు.

విశాఖపట్నానికి మంచినీరు, ఉక్కు పరిశ్రమ అవసరాలకోసం 23. 44 టిఎంసీలను సరఫరా చేయాలని నిర్దేశించుకోవడం జరిగింది. వీటిని ప్రాంతీయ కోణంనుంచి పాక్షిక దృష్టితో చూడరాదు. పైగా అన్ని అనుమతులు పొంది, జాతీయ ప్రాజెక్టుగా కేంద్రప్రభుత్వం గుర్తించి 90 శాతం నిధులు అందించే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మోకాలడ్డడం జాతి ప్రయోజనాలకు హాని కల్పించడమే. ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని, రిజర్వాయర్‌ ఎత్తును తగ్గించాలని, పోలవరానికి ప్రత్యామ్నాయంగా రెండు మూడు పథకాలను అమలు చేయాలనీ పలు డిమాండ్లు ముందుకు వస్తున్నాయి. వీటన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన యం. వెంకట్రావు కమిటీ ప్రస్తుత ప్రాజెక్టు డిజైనే అత్యుత్తమమైనదని సూచించిందని గమనించాలి. సుప్రీం కోర్టు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పుకు అనుగుణంగానే ఉన్నదని చెప్పింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల మన రాష్ట్రంలో 38, 186 హెక్టార్లు, చత్తీస్‌గఢ్‌లో 1,637 హెక్టార్లు, ఒడిశాలో 1, 182 హెక్టార్ల భూములు, వాటిలో భాగంగా 3, 267 హెక్టార్ల అటవీప్రాంతం ముంపునకు గురవుతుందని అంచనా వేశారు. ఖమ్మం జిల్లాలో 205 గ్రామాలు, 34, 143 కుటుంబాలకు చెందిన 1, 40, 275 మంది జనాభా, ప.గో. జిల్లాలో 42 గ్రామాలు, 6,959 కుటుంబాలు, 25, 026 మంది జనాభా, తూ.గో. జిల్లాలో 29 గ్రామాలు, 3, 472 కుటుంబాలు, 11, 874 మంది జనాభా నిర్వాసితులవుతారని అంచనా వేశారు. వీరిలో 45 శాతానికి పైగా గిరిజనులే కావడం గమనార్హం.అందువల్ల ప్రత్యేక దృష్టితో పునరావాస పథకాన్ని రూపొందించి అమలు చేయాలి. ప్రాజెక్టు ద్వారా నిర్వాసితులే మొదటి లబ్ధిదారులు కావాలి. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం వ్యవహరించాలి. కాలం గడిచేకొద్దీ నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతుందని గుర్తించి తక్షణమే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలి.

జలవనరుల సద్వినియోగమే లక్ష్యం !

సూర్య దినపత్రికలో నవంబరు ౩, 2011 ప్రచురించబడింది


LSxtísû LSÇsNUP¸RP§ LRPLsgS¬Põ rS*LRósxmsLRP NSÌsvxtPùªS»Sª«sLRPßsLs NRPª«P§§øN¯©«PõcTs . xmsLRPùª«srS©«sLsgS úFyßsLs F¡}qs ¬dsÎÏP•NRPV xqsz¤Qs»RsLs xqsLsNRPVÀs»Rs LSÇsNUP¸RP§ LRPLsgRPvÌsv xmsoÌsvª«P§§»Rsv©SõLRPv . " ¬dsZLËÍQ A¥PPLRPLs . A¥PPLS¬Põ ALRPgjsLsÛ¿QËÍcTs @gjPõ . ¬dsÈÓsÌÜÍ @gjPõ D©«PõcTs . @gjPõÌÜÍ ¬dsLRPv©«PõcTs Q' @¬s Dxms¬sxts»RsvòÌ”ÜÍ D©«PõcRs¬s |mPcRôsÌsv ¿PÊsv»RsvLsÈØLRPv . xqsx¤QsÇsª«s©«sLRPvÌ”ÜÍ ¬dsLRPv úFyßsúxms´Rsª«P§\ZªP§©«scTs . ª«P§¬szts ª«P§©«svgRPƒRs , xmsoL¯ÍÕnsª«PXcTô“s ¬dsÈÓs\|mQsZ©ËÍQ @cnSLRPxmsƒTs D©«PõcTs . ¬dsLRPv©«Põ¿]ÍÛÈQËÍ ª«Pãw©«sª«s ©SgRPLjsNRP»Rs @Õnsª«PXcTô“s ¿PLscTsLscRs©«PõcTs ¿SLjsú»RsNRP xqs»RPùLs . úFyßsúxmscRs\ZªP§©«s ¬dsÈÓs N¯ÍxqsLs Z©ËÍQƒRsv ¸RP§§cô“SÌsv Û¿QËÍxqsvN¯Z©ËÍQ cRsvzqós†s l©PÌsN¯©«PõcRs©«sƒRsLsÌÜÍ FPÌØLsÈÓs xqsLsZcËÍQx¤QsLs ÛÌQËÍcRsv . ª«P§©«s LSxtísûLsÌÜÍZ©ËÍQ NScRsv , Ç؆ds¸RP§LsgS ª«P§Ljs¸RP§§ @Ls»RsLêS†ds¸RP§LsgS ª«Pãw©«sªSŒs¬s †dsúª«sLsgS ®ªPÍcnTsxqsvò©«Põ ÇshjsÌs\ZªP§©«s xqsª«P§xqPù . ¬dsÈÓs xqsª«P§xqPù @»RPùLs»Rs xqsv¬Põ»Rs\ZªP§©«scTs , xqsLsNT”Pxtís\ZªP§©«scTs . ª«P§L¯NRP\Zªsxmso©«s Çs©SÊnØ BÊQ÷ƒTs ª«P§§ÊQ÷ƒTsgS |mPLRPvgRPv»Rsv©«PõcTs . ú»SgRPv¬dsÈÓsNTP , ª«Pùª«srS¸RPãw¬sNTP , ‚scRsvùcRsv»SöécRs©«sNRPV , xmsLjsúaRsª«P§ÌsNRPV , xmsLSùª«sLRPßs xmsLjsLRPORsßsNRPV ¬dsÈÓs @ª«sxqsLSÌsv L¯ÍÇsÙ L¯ÍÇsÙNRPW |mPLjsgjsF¡»Rsv©SõLiVV . ¿_NRPgS LRPªSßS r¢NRPLSùÌs©«sv NRPWƒS F~LscRsª«s¿RPvè . úxmsÇsÌsvNRPV úFyßScnSLRP\ZªP§©«s ¬dsLRPv , úxmsNRPX†s zqscRô“s\ZªP§©«s xqsx¤QsÇsª«s©«sLRPvÌ”ÜÍ úFy´Rs‚P§NRP\ZªP§©«scTs . @ª«P§¨ÌPù\ZªP§©«s Ç؆s xqsLsxmscRs . ª«P§©«s LSxtísûLs ª«P§Ljs¸RP§§ ZcËÍQaRs úxmsgRP†s ¬dsÈÓs ª«s©«sLRPvÌs @Õnsª«PXcTô“s , ‚s¬s…¸iWgRPLs , ¬sLRP*x¤Qsßs\|mQsZ©ËÍQ úxmscnS©«sLsgS @cnSLRPxmsƒTs D©«PõcTs .

úxmsxmsLs¿RsLsÌÜÍ AúzmnsNS NRPLsÛÈQËÍ †dsúª«s\ZªP§©«s ¬dsÈÓs N¯LRP»Rs©«sv FPcRsvL¯äLsÈsv©«Põ ÅsLsƒRsLs Azqs¸RPãwZ©ËÍQ©«s¬s ¬sxmsoßsvÌsv gRPßSLsNSÌs»ÜÍ xqs¥PP ‚sZa”ËÍQztsxqsvò©SLRPv . úxmsxmsLs¿RsLsÌÜÍ INRP NRPVÈsvLsÊsLs …¸i§§NRPä ªSLj @LiVVÛ»QËÍ ªSÈÓsÌÜÍ cScSxmso 60 aS»RsLs ¬dsÈÓs¬s Dxms…¸iWgjsLs¿RPvN¯Íª«sƒS¬sNTP ‚dsÌsvLscRs¬s @Ls¿Rs©S ®ªPÍaSLRPv . @LscRsvÌÜÍ DxmsLjs»RsÌsLsÌÜÍ ‚dP§cRs ©«scRsvÌsv , ªSgRPvÌsv , ª«sLsNRPÌsv , xqsLRPxqsv=Ìsv , ¿PLRPvª«soÌsv , NRPVLsÈsÌsv ª«s\ZgsLS ¬dsÈÓs @cnSLSÌs ©«svLsƒTs ÌsÕnsLsÛ¿QËÍ ¬dsLRPv 690 Õs . zqs . ‚dP§ . , ÊnÏsW gRPLRQ÷é ÇsÌØÌsv 433 Õs . zqs . ‚dP§ . ®ªP§§»RsòLs 1,123 Õs . zqs . ‚dP§ . ¬dsLRPv©«PõcTs . 2025 ©SÈÓsNTP ¬dsÈÓs ƒTsª«PãwLsƒºs LRPª«PãwLRP‚P§ 1,390 ÕsÖs¸RP§©ºs NRPWùÕsNºs ‚dP§ÈsLºQ= NRPV Û¿QËÍLRPvN¯LsÈsvLscRsLsÈsv©SõLRPv . rSgRPv¬dsÈÓs @ª«sxqsLSÌsZQNËÍQ 1, 072 ( 83 aS»RsLs ) Õs . zqs . ‚dP§ . NSª«sÌszqs DLsÈsvLscRsLsÈsv©SõLRPv . 1951 xqsLsª«s»RQ=LRPLsÌÜÍ ZcËÍQaRsLsÌÜͬs INRP NRPVÈsvLsÊsLs …¸i§§NRPä ªSLj úxmsÛ»QËÍùNRPLsgS cRPXztísrSLjsLsÀs NSLSù¿RsLRPßs úxmsßSŒsNRPÌs©«sv LRPwF~LscTsLs¿RPvN¯¬s , xqsLsNRPÌQözqscTô“s»ÜÍ @ª«P§Ìsv Û¿QË͸RPãwÌs¬s Ç؆ds¸RP§ ÇsÌs ‚scnS©«sLs — 2002 ¬sZLô“ËÍQbsLsÀsLscTs . cS¬s lªPÌsvgRPvÌÜÍ Ç؆s úxms…¸iWÇs©SÌs©«sv , LSxtísû úxmsÇsÌs Dª«P§øƒTs úxms…¸iWÇs©SÌs©«sv cRPXztísÌÜÍ |mPÈísvN¯¬s ª«P§©«s LSxtísûLs FPcRsvL¯äLsÈsv©«Põ ¬dsÈÓs xqsª«P§xqPùÌs©«sv ¬sbs»RsLsgS xmsLjsbdsÖsLsÀs , ‚sÇñs»Rs»ÜÍ xmsLjsxtPäLjsLs¿RPvN¯Íª«sÌszqs©«s Aª«saRPùNRP»Rs FPLs\Û»s©S D©«PõcTs .

ª«P§©«s ZcËÍQaS¬sNTP @Z©ËÍQNRP ©«scRsvÌs©«sv úxmsNRPX†s úxmsrScTsLsÀsLscTs . ªSÈÓsÌÜÍ xmsl©PõLsƒRsv ©«scRsvÌs©«sv |mPcRôs‚sgS ª«sLkjæsNRPLjsLs¿SLRPv . ªSÈÓs ®ªP§§»RsòLs xmsLjsªSx¤QsNRP úFyLs»RsLs 25,28,084 ¿RscRsLRPxmso NTPÌÜÍ‚dP§ÈsL”RPv . @LscRsvÌÜÍ 10,97,588 ¿Rs . NTP . ‚dP§ . xmsLjsªSx¤QsNRP úFyLs»RsLs D©«Põ gRPLsgRP—úÊsx¤Qøxmsoú»Rs— ®ªPͧxmnP§©«s xqsLRPßÓs »RsLRPvªS»Rs 3,21,289 ¿Rs . NTP . ‚dP§ . ‚sxqsòLjsLsÀs D©«Põ BLscRsW£qs , @Èsv\|mQs 3,12,812 ¿Rs . NTP . ‚dP§ . g¯ÍcSª«sLjs , 2,58,948 ¿Rs . NTP . ‚dP§ . xmsLjsªSx¤QsNRP úFyLs»RsLs D©«Põ úNTsuñS ©«scRsvÛÌQËÍ |mPcRôs‚s . |mP©SõLºs ¬dsÈÓs ÌsÊnÏPù»Rs »RsNRPVä\Zªs©S xmsLjsªSx¤QsNRP úFyLs»S¬Põ xmsLjsgRPßsÌÜÍNTP †dsxqsvN¯¬s |mPcRôs ©«scRsvÌ”ÜÍ INRPÈÓsgS }msL¯ä©SõLRPv . g¯ÍcSª«sLjs , NRPXuñS , |mP©SõLºs Ìs»ÜÍ FyÈsv LSxtísûLsÌÜÍ ª«sLsaRscSLRP , ©SgSª«sŒs ÌØLsÈÓs cScSxmso 40 Às©«Põ |mPcRôs ©«scRsvÌsv©SõLiVV . ®ªP§§»RsòLs 2,746 ÈÓs .¸RP§Ls . zqs . Ìs ¬sNRPLRP ÇsÌØÌs©«sv LSxtísû¬sNTP g¯ÍcSª«sLjs , NRPXuñS , |mP©SõLºs ©«scRsvÌsÌÜÍ úÈÓsÊsvù©«sÌ£Q= ZQNËÍQÈØLiVVLs¿SLiVV . @LscRsvÌÜÍ 1480 ÈÓs .¸RP§Ls . zqs . ( 54 aS»RsLs ) g¯ÍcSª«sLjs ÇsÌØÛÌQËÍ . úNTsuñSÌÜÍ 800 ÈÓs .¸RP§Ls . zqs . , |mP©SõLºs ÌÜÍ 98 ÈÓs . ¸RP§Ls . zqs . Ìsv ZQNËÍQÈØLiVVLs¿RsÊsƒïSLiVV . LSxtísûLsÌÜͬs |mP©SõLºs ©«scUs xmsLjsªSx¤QsNRP úFyLs»RsLsÌÜÍ ª«sLR

ª«P§©«s BLRPvgRPv F~LRPvgRPv LSuíSûÌs»ÜÍ ÇsÌs ‚sªScSÌsv @xmsLjsxtPX»RsLsgS N¯©«srSgRPv»Rsv©SõLiVV . úNTsuñS ©«scUs ÇsÌØÌs xmsLsxmsNRPLs\|mQs Ês¿Sª«s»ºs úÈÓsÊsvù©«sÌ£s 1976 xqsLsª«s»RQ=LRPLsÌÜÍ BÀQè©«s †dsLRPvö gRPƒRsvª«so 2000 ®ªPͧ 31 ©«s ª«P§§gjs¸RP§ƒRsLs»ÜÍ ©«scUs xmsLjsªSx¤QsNRP úFyLs»S\ÛÌs©«s ª«P§x¤QsLSxtísû , NRPLSõÈsNRP , ALsúcnRs úxmsZcËÍQaºs LSuíSûÌs ª«P§cnRPù xmso©«s: xmsLszmsßÔs ª«Pùª«s¥PPLRPLs »QPLRP\|mQsNTP ª«sÀQèLscTs . ‚sªScRs xmsLjsuSäLS¬sNTP ZQNËÍQLsúcRs úxmsÊnÏsv»RP*Ls Çszqís£qs úÊsÛÇQËÍ£ts NRPVª«PãwLºs Z©ËÍQ»RPX»RP*LsÌÜÍ 2004 GúzmsÌ£s 2 ©«s lLPLsƒRsª«s úÈÓsÊsvù©«sÌ£s ©«sv GLSöÈsv Û¿QËÍzqsLscTs . AZLËÍQLsƒR”s FyÈsv ‚s¿SLRPßs Û¿QËÍzqs©«s ‚dP§cRsÈs 2010 ƒTsaRsLsÊsLRPv 30 ©«s úÈÓsÊsvù©«sÌ£s BÀQè©«s †dsLRPvö ª«P§©«s LSxtísû úxms…¸iWÇs©SÌsNRPV aRsLSxmnPãW»RsLsÌØ xmsLjsßs‚P§LsÀsLscTs . A †dsLRPvö©«sv xmso©«s : xmsLjsbdsÖsLs¿SÌs¬s cRsLRPÅØxqsvò Û¿QËÍxqsvN¯©Sõª«P§§ . úÈÓsÊsvù©«sÌ£s †dsLRPvö»ÜÍ ÊØgS úxms…¸iWÇs©«sLs F~LscTs©«s NRPLSõÈsNRP ‚P§gRPvÌsv ÇsÌØÌs xmsLszmsßÔsÌÜÍ @©Sù¸RP§Ls ÇsLjsgjsLscRsLsÈsW }msÀds¬s N¯©«srSgjsxqsvò©«PõcTs . ª«P§¥PPLSxtísû NRPWƒS úÈÓsÊsvù©«sÌ£s \|mQs ª«s†sòƒTs Û¿QËÍzqs @cnTsNRP ¬dsÈÓs ZQNËÍQÈØLiVVLsxmso©«sv rScnTsLs¿RPvN¯ÍªSÌs¬s úxms¸RP§†Põxqsvò©«PõcTs . ª«P§©«s @xqsª«P§LRós»Rs ª«P§¨ÌsLsgS C ‚sªScRsLsÌÜÍ \|mQs LSuíS\ÛÌs©«s NRPLSõÈsNRP , ª«P§¥PPLSxtísûÌsv ‚sÇs¸RP§Ls rScnTs}qsò »QPÌsvgRPv ©SÈs ¬dsÈÓs N¯ÍxqsLs NRPuíSÌsv ª«sLRñs©S†ds»RsLs . úNTsuñS ©«scTs ‚P§gRPvÌsv ÇsÌØÌs\|mQs @cnSLRPxmsƒTs , ®ªPÍÌs N¯ÍÈ”s LRPwFy¸RP§Ìsv lªPÀQèLsÀs ¬sLjQøLs¿RPvN¯LsÈsv©«Põ @»RPùLs»Rs lªP©«svNRPÊsƒRïs ª«P§x¤QsÊsWÊ`s ©«sgRPLºs ÑsÌ”ØÌÜͬs NRPÌP*NRPVLjsò , l©PÈísLsFyƒRsv , N¯Í¸RP§Ì£s rSgRPLºs FP†sòF¡»RsÌs xms´RsNSÌsv , ©«sÌ”sg¯LsƒRs ÑsÌ”ØÌÜͬs $\ZasÌsLs FPƒRsª«P§gRPÈísv NSÌsvª«s ( ¸RP§£qs . ¸RP§Ì£s . Õs . zqs . r~LRPLsgRP ª«PãwLRæsLs ) úFyÂÇQPNíRPV , ¬s»RPù NRPLRPª«so {msƒTs»Rs LS¸RP§Ìs{qsª«P§ úFyLs»RsLsÌÜÍ ¬sLSøßsLsÌÜÍ D©«Põ x¤QsLsúcUs — ¬dsªS FP†sòF¡»RsÌs xms´RsNRPLs , gSÛÌQËÍLRPv — ©«sgRPLjs , úxmsNSaRsLs ÑsÌ”ØÌÜͬs lªPÌsvg¯LsƒRs úFyÂÇQPNíRPVÌsv ª«P§¨Ìs©«sxmsƒRsƒRsLs ÅظRP§LsgS NRP¬szmsxqsvò©«PõcTs . C úxmsª«PãwcRsLs ©«svLsƒTs Ês¸RP§ÈsxmsƒSÌsLsÛÈQËÍ úÊsÛÇQËÍ£ts NRPVª«PãwLºs úÈÓsÊsvù©«sÌ£s BÀQè©«s †dsLRPvö\|mQs úxmsxqsvò»RsLs ÇsLRPvgRPv»Rsv©«Põ xmso©«s : xqs‚dP§ORsÌÜÍ xqsx¤QsÇs ©Sù¸RP§ xqPwú»SÌsNRPV @©«svgRPvßsLsgS Ês¿Sª«s»ºs úÈÓsÊsvù©«sÌ£s BÀQè©«s †dsLRPvö úFy†sxmscTsNRP©«s ª«P§©«s LSxtísû úxms…¸iWÇs©SÌs©«sv xmsLjsLRPOTsLs¿RPvN¯©«sƒS¬sNTP LSÇsNUP¸RP§ xqsLsNRPÌQöLs»ÜÍ F¡LSƒSÖs . @LscRsvÊØÈsvÌÜÍ D©«Põ ª«sLscRs xqsLsª«s»RQ=LSÌs ©«scUs úxmsªS¥PP¬Põ úFy†sxmscTsNRPgS †dsxqsvN¯¬s , ¬sNRPLRP ÇsÌØÌs ¬sLô“SLRPßsNRPV 75 aS»S¬Põ úFyª«PãwßÓsNRPLsgS †dsxqsvN¯Z©ËÍQÌØ IzmQöLs¿SÖs . ‚P§gRPvÌsv ÇsÌØÌs ÌsÊnÏPù»Rs\|mQs ¬sLô“SLRPßs , xmsLszmsßÔs @aS{qsòû¸RP§\ZªP§©«scTs . ª«sL

g¯ÍcSª«sLjs xmsLjsªSx¤QsNRP úFyLs»RsLs ª«P§x¤QsLSxtísû , ¿Rs†dsò£qs xmnP§Lºs , ª«P§cnRPù úxmsZcËÍQaºs , IƒTsaS , ALsúcnRs úxmsZcËÍQaºs LSuíSûÌsÌÜÍ ‚sxqsòLjsLsÀs D©«PõcTs . 73,201 ¿Rs . NTP. ‚dP§ . ª«P§©«s LSxtísûLsÌÜÍ DLsÛÈQËÍ @LscRsvÌÜÍ 57,960 »QPÌsLsgSßs , 15,241 ¿Rs . NTP. ‚dP§ N¯ÍrSsòLsúcnRsÌÜÍ D©«PõcTs . ©«scUs úxmsªS¥PP¬sNTP ª«Pãwú»RsLs 456 ÈÓs . ¸RP§Ls .zqs . Ìsv »QPÌsLsgSßs , 120 ÈÓs . ¸RP§Ls . zqs . Ìsv N¯ÍrSsò úFyLs»RsLs ©«svLsƒTs xqsª«P§NRPWLRPvè»Rsv©«PõxmQöÈÓsNUP g¯ÍcSª«sLkjs ©«scUs ÇsÌØÌs ‚sªScRs úÈÓsÊsvù©«sÌ£s ª«P§¨ƒRsv ®ªPÍÌs ÈÓs . ¸RP§Ls . zqs . Ìs ¬sNRPLRPÇsÌØÌsv ÌsÕnsrSsò¸RP§¬s @Ls¿Rs©SNRPÈÓís ª«P§©«s LSuíSû¬sNTP 1480 ÈÓs . ¸RP§Ls . zqs . Ìs©«sv ZQNËÍQÈØLiVVxqPwò 1980 xqsLsª«s»RQ=LRPLsÌÜÍ úxmsNRPÈÓsLsÀsLscTs . ª«P§cnRPù úxmsZcËÍQaºs , ¿Rs†dsò£qs xmnP§Lºs , IƒTsaS LSuíSûÌsÌÜÍ @»RPùcnTsNRP ÊnØgRPLs @Ès‚ds úFyLs»RsLs NSª«sƒRsLs»ÜÍ ¬dsÈÓs¬s ‚s¬s…¸iWgjsLs¿RPvN¯Z©ËÍQ @ª«sNSaRsLs ªSLjsNTP ÛÌQËÍNRPF¡ª«sƒRsLs»ÜÍ ª«P§©«sNRPV ÌsÕnô“s Û¿QËÍNRPWLjsLscTs . Ês¿Sª«s»ºs úÈÓsÊsvù©«sÌ£s ZQNËÍQÈØLiVVLsÀs©«s ¬dsÈÓsÌÜÍ 812 ÈÓs . ¸RP§Ls . zqs . »QPÌsLsgSßSÌÜÍ©«sv , 668 ÈÓs . ¸RP§Ls . zqs . Ìsv N¯ÍrSsòLsúcnRsÌÜÍ ªSƒRsvN¯Íª«sƒS¬sNTP ‚dsÌsv NRPÖQöLsÀs©S BxmQöÈÓs ª«sLRPNRPV cScSxmso 800 ÈÓs . ¸RP§Ls . zqs . Ìs©«sv ª«Pãwú»Rs®ªPͧ ‚s‚scnRs úFyÂÇQPNíRPVÌs cS*LS ‚s¬s…¸iWgjsLs¿RPvN¯LsÈsv©SõLs . BLsNS 700 ÈÓs . ¸RP§Ls . zqs . Ìs ª«sLRPNRPV ¬sNRPLRP ÇsÌØÌs©«sv xqscTP*¬s…¸iWgRPLs Û¿QËÍxqsvN¯ÍÛÌQËͬs c_LS÷égRPùzqós†sÌÜÍ D©Sõª«P§§ . xmsLRPùª«srS©«sLsgS úxms†s GƒScTs ª«sLRPcRs ¬dsÈÓs»ÜÍ NRPÖszms xqsgRPÈsv©«s ª«P§¨ƒRsv ®ªPÍÌs ÈÓs . ¸RP§Ls . zqs . Ìsv xqsª«P§§úcRsgRPLRQ÷éLsÌÜÍ ª«PX´SgS NRPÖszqsF¡»Rsv©«PõcTs . ALRPv NSÌsLs NRPxtísxmsƒTs , @F¡öxqsF¡ö Û¿QËÍzqs ª«Pùª«srS¸RPãw¬sNTP |mPÈísvÊsƒRsvÌsv |mPÈÓís rSgRPv Û¿QËÍ}qsò xmsLsƒTsLsÀs©«s xmsLsÈs Û¿QË͆s NRPLsZcËÍQ xqsª«P§¸RP§LsÌÜÍ ª«sLRPcRsÌsv ª«P§§Ls¿RPvN¯ÀQè ÌsORsÌØcTs FPNRPLSÌsÌÜͬs xmsLsÈsÌsv ÊsvgjæsFy\ÛÌs F¡»Rsv©SõLiVV . úFyßs ©«sxtísLs ÇsLRPvgRPv»Rsv©«PõcTs . xqsª«P§úgRs ÇsÌs ‚scnS©S¬Põ LRPwF~LscTsLsÀs xqsª«P§LRósª«sLs»RsLsgS @ª«P§Ìsv Û¿QË͸RP§ƒRsLs cS*LS ¬dsÈÓs ª«s©«sLRPvÌs @Õnsª«PXcTô“s , ¬sLRP*x¤Qsßs cS*LS ª«sLRPcRsÌs ª«sÌ”s ÇsLRPvgRPv»Rsv©«Põ ©«suíS¬Põ @LjsNRPÈísª«s¿RPvè , xqsª«P§§úcRsLs FyÌ‘»Rsv©«Põ ¬dsÈÓs¬s xqscTP*¬s…¸iWgRPLs Û¿QËÍxqsvN¯Íª«sƒS¬sNTP ‚dsÌsvxmsƒRsv»RsvLscTs . »SgRPv ¬dsLRPv , rSgRPv¬dsÈÓs FyLRPvcRsÌs r¢NRPLSùÌsv ª«P§Ljs¸RP§§ FyLjsúaS‚P§NSÕnsª«PXcTô“s rScnTsLs¿RsƒS¬sNTP c¯Íx¤QscRsxmsƒRsv»RsvLscTs . xqsª«P§XcTô“sgS ¬dsLRPv©«Põ úFyLs»SÌs ©«svLsƒTs ¬dsÈÓsNTP NRPÈsNRPÈsÌØZƒËÍQ NRPLRPª«so {msƒTs»Rs ª«P§Ljs¸RP§§ lªP©«svNRPÊsƒRïs úFyLs»SÌsNRPV xqsLRPxmnsLS Û¿QË͸RP§ƒRsLs ª«sÌ”s LSxtísû xqsª«P§úgSÕnsª«PXcTô“sNTP c¯Íx¤QscRsxmsƒRsv»RsvLscTs . DFy´Ts , A¥PPLRP ÊnÏsúcRs»Rs NRPÖQöLs¿RsƒS¬sNTP DxmsNRPLjsxqsvòLscTs .

\|mQs ÌsOSùÌsNRPV @©«svgRPvßsLsgS ¬sLjQøLs¿Rs »RsÌs|mPÈÓís©«s BLscTsLS rSgRPLºs ( F¡Ìsª«sLRPLs ) Êsx¤s§ÎØLRós rScnRsNRP úFyÂÇQPNíRPV©«sv ‚sªScSxqQöcRsLs Û¿QË͸RP§ƒRsLs Ç؆s úxms…¸iWÇs©SÌsNRPV ‚sxmnPãW»RsLs NRPÖæsLs¿RsƒRs®ªPͧ . GƒRsv cRsaSÊôØÌs ÀsLRPNSÌs úxmsÇsÌs ªSLs¿nRs F¡Ìsª«sLRPLs . @Õnsª«PXcTô“s ¿PLscTs©«s ÑsÌ”ØÌsZQNËÍQ úxms…¸iWÇs©«sª«P§©«Põ cRsvxtQöû¿SLRPLs ªSxqsòªSÌs©«sv ª«P§LRPvgRPvxmsLRP¿RsƒRs®ªPͧ @ª«so»RsvLscTs . C úFyÂÇQPNíRPV cS*LS Êsx¤s§ÎÏs úxms…¸iWÇs©SÌsv I©«sgRPwƒRs©«sv©SõLiVV . 1) cnS©SùgSLRPLsgS zmsÌsª«sÊsƒRsv»Rsv©«Põ g¯ÍcSª«sLjs , NRPXuñS lƒPÌíØNRPV rSgRPv¬dsÈÓs xqsLRPxmnsLSÌÜÍ »RsLRP¿RPw IƒTscRsvƒRsvNRPVÌsv FPcRsvLRPª«so»RsvLsƒRsƒRsLs»ÜÍ ª«sLjs cnS©«PùLs ª«P§Ljs¸RP§§ B»RsLRP ª«Pùª«srS…¸iW»RQö»RsvòÌsv »RsgjæsF¡LiVV ÊnØLkjs ©«sxtísLs ªSÈÓsÌ”sv»Rsv©«PõcTs . ©«scTsÌÜÍ ¬dsÈÓs úxmsªSx¤Qs L¯ÍÇsÙÌsv gRPßs¬ds¸RP§LsgS »RsgjæsF¡ª«sƒRsLs»ÜÍ úxmsxqsvò»Rsª«P§§©«Põ cnRsª«sÛÎsÍaRP*LRPLs ª«P§Ljs¸RP§§ ‚sÛÇêQËÍaRP*LRPLs A©«sNRPÈísÌsv 10 . 50 ÌsORsÌs FPNRPLSÌsv©«Põ g¯ÍcSª«sLjs A¸RP§NRPÈísvNRPV xmsLsÈs NSÌsLs ®ªP§§»Ssò¬sNTP ¬dsLRPLscTsLs¿RsÛÌQËͬs cRsvzqós†s l©PÌsN¯©«PõcTs . lLPLsZƒËÍQÎÏP• úNTs»RsLs A¸RP§NRPÈísvÌÜÍ xqsgRPÊnØgRPLs NRPWƒS rSgRPv Û¿QË͸RP§¬s Û¿QËÍcRsv @©«svÊnÏsª«sLs cUs¬sNTP úxmsÊsÌs ¬scRsLRP+©«sLs . F¡Ìsª«sLRPLs ÌØLsÈÓs |mPcRôs LjsÇsLS*¸RP§LRPv ¬sLSøßsLs cS*LS ª«Pãwú»Rs®ªPͧ A¸RP§NRPÈísvNRPV LRPORsßs NRPÖQöLs¿Rsª«s¿RPvè . 2) »RsWLRPvö g¯ÍcSª«sLjs , xmsbOª«P§ g¯ÍcSª«sLjs , úNTsuñS ª«P§Ljs¸RP§§ ‚saSÅsxmsÈPõLs ÑsÌ”ØÌsÌÜͬs ®ªP§Èís úFyLs»SÌsÌÜͬs 7 . 20 ÌsORsÌs FPNRPLSÌsNRPV rSgRPv ¬dsLRPLscTsLsÛ¿QËÍ ÌsOSù¬Põ ¬sZLôËÍQbsLs¿RPvN¯Íª«sƒRsLs ÇsLjsgjsLscTs . 3) úxmsxqsvò»RsLs úNTsuñS ÇsÌØÌs©«sv ‚s¬s…¸iWgjsLs¿RPvN¯LsÈsv©«Põ úNTsuñS lƒPÌíØ A¸RP§NRPÈísvNRPV Ês¿Sª«s»ºs úÈÓsÊsvù©«sÌ£s †dsLRPvö ®ªPͧLRPNRPV 80 ÈÓs . ¸RP§Ls . zqs . Ìs ¬dsÈÓs¬s xqsLRPxmnsLS Û¿QËÍzqs , @LscRsvÌÜÍ NRPLSõÈsNRP ª«P§Ljs¸RP§§ ª«P§¥PPLSxtísûÌs ªSÈØ 35 ÈÓs . ¸RP§Ls . zqs . Ìsv F¡©«sW ‚P§gjsÖs©«s 45 ÈÓs . ¸RP§Ls . zqs . Ìs©«sv ¬dsÈÓs FPcRôsƒTs»ÜÍ xqs»Rsª«P§»Rsª«P§ª«so»Rsv©«Põ »QPÌsLsgSßS úFy»RsLsÌÜͬs ª«P§x¤QsÊsWÊ`s ©«sgRPLºs , ©«sÌ”sg¯LsƒRs ÑsÌ”ØÌsÌÜÍ©«sv , LS¸RP§Ìs{qsª«P§ úFyLs»RsLs ª«P§Ljs¸RP§§ úxmsNSaRsLs ÑsÌ”ØÌÜÍ ‚P§gRPvÌsv ÇsÌØÌs AcnSLRPLsgS ¬sLjQøxqsvò©«Põ úFyÂÇQPNíRPVÌsNRPV xqscTP*¬s…¸iWgRPLs Û¿QËÍxqsvN¯Íª«s¿RPvè . 4) 960 ®ªP§gS ªSÈ”s ÇsÌs ‚scRsvù»ºs ©«sv D»RQö†sò Û¿QËÍxqsvN¯¬s F¡Ìsª«sLRPLs úFyÂÇQPNíRPVNRPV \|mQs ÊnØgRPLsÌÜÍ g¯ÍcSª«sLjs ©«scTs\|mQs ¬sLjQøxqsvò©«Põ ZcËÍQªScRsvÌs , ¸RP§Ì”sLsxmsÖ”s , cRsvª«P§øgRPwlƒPLs , @ÌØZgËÍQ úxms†sFycTs»Rs úFyßsz¤Qs»Rs—Û¿QËÍlªPÎÏP• FP†sòF¡»RsÌs xms´RsNSÌs ‚scRsvù»ºs @ª«sxqsLSÌsNRPV ‚s¬s…¸iWgjsLs¿RPvN¯Íª«s¿RPvè . 5) FyLjsúaS‚P§NSÕnsª«PXcTô“s ª«P§Ljs¸RP§§ xmsÈísßÔsNRPLRPßs úxmsúNTs¸RP§ÌÜÍ @Ls»RsLS÷égRPLsgS ª«PXcTô“s ¿PLscRsv»Rsv©«Põ ‚saSÅs xmsÈísßsLs ú»SgRPv ¬dsLRPv , ‚saSÅs DNRPVä xmsLjsúaRsª«P§ @ª«sxqsLSÌs ¬s‚P§»RsòLs 23 . 44 ÈÓs . ¸RP§Ls . zqs . Ìs©«sv xqsLRPxmnsLS Û¿QË͸RPãwÌsZ©ËÍQ ÌsOSùÌs©«sv ¬sZLôËÍQbsLs¿RsÊsƒïSLiVV . ‚dsÈÓs¬s úFyLs†ds¸RP§ N¯ÍßsLs ©«svLsÀs FyOTsNRP cRPXztís»ÜÍ ¿RPwzqs úFyÂÇQPNíRPV©«sv ª«Pù†sZLËÍQNTPLs¿RsƒRsLs ‚sÇñs»Rs @¬szmsLs¿RPvN¯ÍcRsv . \|mQs|mP¿RPvè @Ès‚ds , xmsLSùª«sLRPßsLs , ÇsÌsª«s©«sLRPvÌsv , BLscnRs©«s ª«s\ZgsLS ZQNËÍQLsúcRs ª«P§Lsú†s»RP* aSÅsÌsv , ZQNËÍQLsúcRs ÇsÌs xqsLsxmnP§Ls ( zqs . ƒRsÊ”sv . zqs .) ©«svLsƒTs @¬Põ @©«svª«P§»RsvÌs©«sv F~LscTs , Ç؆ds¸RP§ úFyÂÇQPNíRPVgS ZQNËÍQLsúcRs úxmsÊnÏsv»RP*Ls gRPvLjsòLsÀs ¬sLSøßs ª«Pù¸RP§LsÌÜÍ 90 aS»RsLs ¬scnRsvÌs©«sv F~LsZcËÍQ xqscRsª«sNSaRsLs D©«Põ xmspLRP*LRPLsgRPLsÌÜÍ úFyÂÇQPNíRPV ¬sLSøßS¬sNTP ®ªsWNSÌsƒïSÌs¬s N¯¬Põ cRsvxtís aRsNRPVòÌsv xmsp©«svN¯Íª«sƒRsLs Ç؆s úxms…¸iWÇs©SÌsNRPV ¥PP¬s »RsÌs|mPÈísÈs®ªPͧ . úFyÂÇQPNíRPV ƒTs\ÛÇs©ºs ª«PãwLSèÌs¬s , LjsÇsLS*¸RP§LRPv FP»Rsvò©«sv 150 @ƒRsvgRPvÌs ©«svLsƒTs »RsgjæsLs¿SÌs¬s , F¡Ìsª«sLS¬sNTP ÊscRsvÌsv úxms»Sùª«Pãwõ¸RP§LsgS lLPLsƒRsv ª«P§¨ƒRsv xms´RsNSÌs©«sv @ª«P§Ìsv Û¿QË͸RPãwÌs¬s xmsÌsv ƒTsª«PãwLsƒR”s©«sv ª«P§§LscRsvNRPV»QPxqsvò©SõLRPv , ‚dsÈs¬PõLsÈÓs\|mQs©«s LSxtísû úxmsÊnÏsv»RP*Ls 2005 xqsLsª«s»RQ=LRPLsÌÜÍ $ . ¸RP§Ls . lªPLsNRPúÈت«so Z©ËÍQ»RPX»RP*LsÌÜÍ xmscTs ª«P§LscTs»ÜÍ ¬s¸RP§‚P§Ls¿RsÊsƒTs©«s ¬sxmsoßsvÌs NRP‚P§ÈÔs @cnRPù¸RP§©«sLs Û¿QËÍzqs©«s ‚dP§cRsÈs úxmsxqsvò»Rs úFyÂÇQPNíRPV ƒTs\ÛÇsZ©ËÍQ @»Rsvù»Rsòª«P§\ZªP§©«scRs¬s ¬s®ªPÍcTsNRP xqsª«P§LjQöLsÀs©«s ‚sxts¸RPãw¬Põ gRPª«P§¬sLs¿SÖs . @ÌØZgËÍQ BÈÔsª«sÛÌQËÍ xqsvú{msLs N¯ÍLíRPv rScnTsNSLjsNRP NRP‚P§ÈÔs NRPWƒS ZQOËÍQú»Rs róSLiVVÌÜÍ @cnRPù¸RP§©«sLs Û¿QËÍzqs©«s ‚dP§cRsÈs úFyÂÇQPNíRPV ¬sLSøßsLs Ês¿Sª«s»ºs úÈÓsÊsvù©«sÌ£s †dsLRPvöNRPV @©«svgRPvßsLsgSZ©ËÍQ D©«PõcRs¬s ¿PzmQöLscTs . C @¬Põ @LsaSÌs©«sv ‚sÇñs»Rs»ÜÍ xmsLjsgRPßsÌÜÍNTP †dsxqsvN¯ÍªSÖs .

F¡Ìsª«sLRPLs úFyÂÇQPNíRPV ¬sLSøßsLs FPLs»Rs úFyßsúxmscRs\ZªP§©«sc¯Í ! @LsÛ»QËÍ úFycnS©«Pù»SLsaRsLs ¬sLS*zqs»RsvÌsNRPV úxmsxqsvò»Rs Òsª«s©«s ‚scnS©«sLs NRPLsÛÈQËÍ ®ªP§LRPv\Zgs©«s Òs‚s»S¬Põ @LscTsLs¿Rs gRPÌs ©SßPù\ZªP§©«s xmso©«sLSªSxqs xms´RsNS¬Põ úFyÂÇQPNíRPV ¬sLSøßS¬sNRPLsÛÈQËÍ ª«P§§LscRsvgSZ©ËÍQ ‚scnTsgS @ª«P§Ìsv Û¿QË͸RPãwÖs . C úFyÂÇQPNíRPV ¬sLSøßsLs ª«sÌ”s 38,186 |¤QPNíSL”RPv ª«P§©«s LSxtísûLsÌÜÍ©«sv , 1,637 |¤QP . ¿Rs†sò£qs xmnP§Lºs , 1,182 |¤QP . IƒTsaS LSuíSûÌsÌÜÍ ÊnÏsWª«P§§Ìsv , @LscRsvÌÜÍ ÊnØgRPLsgS 3,267 |¤QP . @Ès‚ds úFyLs»RsLs ª«P§§LsxmsoNRPV gRPvL_»S¸RP§¬s @Ls¿Rs©S ®ªPÍaSLRPv . Åsª«P§øLs ÑsÌ”ØÌÜÍ 205 úgSª«PãwÌsv , 34,143 NRPVÈsvLsÊØÌsNRPV ¿PLscTs©«s 1,40,275 Çs©SÊnØ , xmsbQ誫P§ g¯ÍcSª«sLjs ÑsÌ”ØÌÜÍ 42 úgSª«PãwÌsv , 6,959 NRPVÈsvLsÊØÌsv , 25, 026 Çs©SÊnØ , »RsWLRPvö g¯ÍcSª«sLjs ÑsÌ”ØÌÜÍ 29 úgSª«PãwÌsv , 3, 472 NRPVÈsvLsÊØÌsv , 11,874 Çs©SÊnØ ¬sLS*zqs»RsvÌ‘»SLRP¬s @Ls¿Rs©S ®ªPÍaSLRPv . ¬sLS*zqs»Rs NRPVÈsvLsÊØÌsÌÜÍ 45 aS»S¬sNTP\|mQsgS gjsLjsÇs©«svÛÌQËÍ NSª«sƒRsLs ‚sZaËÍQxtsLs . @LscRsv ª«sÌ”s úxmsÛ»QËÍùNRP cRPXztís»ÜÍ xmso©«sLSªSxqs xms´RsNS¬Põ LRPwF¡LscTsLsÀs , @ª«P§Ìsv Û¿QË͸RP§ƒRsLs cS*LS gjsLjsÇs©«svÌs @ª«P§¨ÌPù\ZªP§©«s xqsLsxqPäX†s , rSLsúxmscS¸RPãwÌs©«sv , ¿RsLjsú»Rs©«sv xmsLjsLRPOTsLs¿SÖs . ®ªP§LRPv\Zgs©«s Òsª«s©¯ÍFy´Ts¬s NRPÖQöLs¿SÖs . ÊnÏsWª«P§§Ìs©«sv N¯ÍÌÜÍö»Rsv©«Põ ªSLjsNTP úFyÂÇQPNíRPV A¸RP§NRPÈísv úNTsLscRs úxmsÊnÏsv»RP*Ls ÊnÏsW‚P§¬s }qsNRPLjsLsÀs xmsLjs¥PPLRPLsgS BªS*Ös . »RscS*LS úFyÂÇQPNíRPV ¬sLSøßsLs cS*LS I©«sgRPwZƒËÍQ úxms…¸iWÇs©SÌs©«sv @©«svÊnÏs‚sLsÛ¿QËÍ ªSLjsÌÜÍ ¬sLS*zqs»RsvÌsv ®ªP§§cRsÈÓs ÌsÕnô“scSLRPvÌsv NSªSÖs . @xmsoöZƒËÍQ úFyÂÇQPNíRPV ¬sLSøßS¬sNTP rSLRósNRP»Rs DLsÈsvLscTs . @ÌØLsÈÓs xmso©«sLSªSxqs xms´RsNRPLs @ª«P§Ìsv N¯ÍxqsLs F¡LSÈsLs Û¿QË͸RPãwÖs .

úFyÂÇQPNíRPV ¬sLSøßsLsÌÜÍ @‚s¬ds†s , @úNRsª«PãwÌsNRPV @ª«sNSaRsLs ÛÌQËÍNRPVLsƒS úxmsÊnÏsv»RP*Ls , úxmsÇsÌsv @úxmsª«P§»RsòLsgS ª«Pùª«sx¤QsLjsLs¿SÖs . LjsÇsLS*¸RP§LRPv ¬sLSøßS¬sNTP xqsLsÊsLscnTsLsÀs©«s ÂÈQPLsƒRsLR”s FPLszmsNRPÌÜÍ @úNRsª«PãwÌsv ÇsLjsgS¸RP§¬s , @LR>s»RsÛÌQËͬs ¬sLSøßs xqsLsxqósÌsNRPV xms©«svÌsv NRPÈísÂÊQPÛÈíQËÍ úxms¸RP§»RPõLs Û¿QËÍaSLRP¬s AL¯ÍxmsßsÌsv BÈÔsª«sÌs lªPÌsvgRPv ¿RPwaSLiVV . @ÌØLsÈÓs AL¯ÍxmsßsÌsNRPV G ª«Pãwú»RsLs »S‚sª«P*¬s Lkjs†sÌÜÍ ÇsªSÊsvcSLkjs»Rs©«sLs»ÜÍ , FyLRPcRsLRP+NRPLsgS , »RP*Ljs»RsgRP†s©«s úFyÂÇQPNíRPV ¬sLSøßS¬sNTP úxmsÊnÏsv»RP*Ls xqsLsNRPÌQözqscTô“s»ÜÍ NRPXzts Û¿QË͸RPãwÖs . NSÌsLs gRPƒTsÛ¿QËÍ N¯cUôs úFyÂÇQPNíRPV ¬sLSøßs ª«Pù¸RP§Ls »RsƒTszqs ®ªsWzmsƒRsª«so»RsvLscTs . 2003—04 @Ls¿Rs©SÌs úxmsNSLRPLs LRPv . 8,198 N¯ÍÈ”sv DLsÛÈQËÍ Z©ËÍQƒRscTs LRPv . 17,000 N¯ÍÈ”sNRPV |mPLjsgjsLscTs . " AÌsxqPùLs @ª«P§X»RsLs ‚sxtsLs Q' @©«Põ ©S©«svƒTs¬s gRPvLRPvòLs¿RPvN¯¬s Às»RsòaRPvcTô“s»ÜÍ ‚sxqsòX»Rs úxmsÇØúxms…¸iWÇs©SÛÌQËÍ ZcnËÍQù¸RP§LsgS FyÌsNRPVÌsv FyÈsvxmsƒSÖs