Wednesday, January 29, 2014

రసకందాయంలో విభజన రాజకీయం



రాగ ద్వేషాలకు అతీతంగా, విజ్ఞతతో ఆలోచిస్తే ఎంతటి సమస్యకైనా పరిష్కా రం లభిస్తుంది. నేటి వివాదానికి బీజం వేసింది- ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు-2013 ను పైలెట్‌ చేస్తున్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి. బిల్లు అసమగ్రంగా ఉన్నది, ఈ అంశంపై అర్థవంతమైన చర్చ చేయాలంటే సమగ్రమైన సమాచారాన్ని ఇవ్వండని శాసనసభ్యులు చేసిన అభ్యర్థనను కేంద్ర హోంశాఖ కార్యదరిి్శ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి పంపితే, ఆయన- ఇది కేవలం ముసా యిదా బిల్లే- అని పునరుద్ఘాటించడంతో వివా దానికి తెరలేచింది. సమగ్రమైన సమాచారాన్ని పార్లమెంటుకు సమర్పిస్తాం. శాసన సభకు ఆ సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అత్యంత బాధ్యతారహితంగా సమాధానం చెప్పడం- శాసనసభను, శాసన మండలిని అవమానపరచ డమే. అలాగే బిల్లు, ముసాయిదాబిల్లు- ఏదైనా ఒకటేననడం బాధ్యతారాహిత్యం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 లో బిల్లు అని ప్రస్తావించారే గానీ ముసాయిదా బిల్లు అని పేర్కొనలేదు. కేంద్ర మంత్రి జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే వివాదానికి మరింత ఆజ్యం పోసిన వారవుతారు. న్యాయస్థానాల ముందు ఇలాగే వాదిం చగలరా? పైకి చూడడానికి- బిల్లు లేదా ముసాయిదా బిల్లు ఒక్కటే అనిపించ వచ్చు. కానీ ముసాయిదా బిల్లు సమగ్రరూపం దాల్చిన తరువాత బిల్లుగా రూపాంతరం చెందుతుంది. ముసాయిదా బిల్లును కేంద్ర హోంశాఖ తయారుచేసి, కేంద్ర మంత్రిమండలి ముందుంచి, ఆమోదంపొందిన బిల్లునే రాష్టప్రతిద్వారా రాష్ట్ర శాసన సభ, శాసన మండలికి పంపాలి. దానిపై అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. బిల్లుకు పార్లమెంటు సభ్యులుకానీ లేదా పార్లమెంటులో చర్చలప్రక్రియలో అంతర్భాగంగా ప్రభుత్వం అధికారికంగా కానీ సవరణలు ప్రతిపాదించవచ్చు.
వాటిని ఆమోదించడమో లేదా తిరస్కరించడమో జరిగిన మీదట బిల్లును చట్టసభ ఆమోదిస్తే, అది చట్టంగా రూపొందుతుంది. దానిపై రాష్టప్రతి రాజ ముద్ర పడ్డాక అమలులోకి వస్తుంది. ఈ ప్రక్రియపై కనీస పరిజ్ఞానం కూడా లేకుండా కేంద్ర మంత్రివర్యులు, చట్టసభల సభ్యులు మాట్లాడుతున్నారని భావించలేం కదా!శాసన సభకు/ శాసన మండలికి పంపిన బిల్లు సమగ్రంగా లేదని విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. సమగ్రంగాఉన్నదని కొందరు వాదించవచ్చు. సమగ్ర సమాచారం లేదన్న వాదనలో బలం ఉన్నది కాబట్టే- కేంద్ర హోం శాఖ కార్యదర్శి విధిలేని పరిస్థితుల్లోనే ముసాయిదా బిల్లు అని పేర్కొని తప్పించుకోవాలని చూశారు. అది కాస్త నిజాయితీతో కూడిన మాటే. కానీ, అదే వివాదానికి తెరలేపిం ది. కేంద్ర మంత్రిమండలి రాజకీయ ప్రయోజనాలతో ఎన్నికలకు ముందు హడావు డిగా, అడ్డగోలుగా వ్యవహరిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయనడానికి మన రాష్ట్ర విభజన ఉదంతమే ప్రబల నిదర్శనం.
భాతర రాజ్య స్వభావం- సమాఖ్య (ఫెడరల్‌) వ్యవస్థ. భారత యూనియన్‌లో అంతర్భాగ మైన రాషా్టల్రు స్వయంప్రతిపత్తి కలిగిఉన్నాయి. కేంద్రప్రభుత్వం, రాషా్టల్రకున్న స్వయం ప్రతిపత్తిని, అధికారాలను క్రమంగా హరించివేస్తూ వస్తున్నది.

సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించే విధంగా రాషా్టల్ర చట్టసభ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తే ప్రమాదకర పరిణామాలు సంభవిస్తాయి. కాబట్టే రాజ్యాంగసభలో ఈ అంశంపై లోతైనచర్చ చేశారు. బ్రిటిష్‌ వలసపాలనలో ఉన్న ప్రావిన్సెస్‌కు, భారత యూనియన్‌ లోని రాషా్టల్రకు మధ్య మౌలిక తేడా ఉన్నదని భారత రాజ్యాంగ నిర్మాత డా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆర్టికల్‌ మూడుపై జరిగిన చర్చలో విస్ఫష్టంగా పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలోఉన్న పార్టీ లేదా కూటమి సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం సమాఖ్యవ్యవస్థ స్వరూపాన్ని గొడ్డలి వేటుకు గురిచేయడానికి తెగిస్తే ప్రతిఘటించాల్సిన బాధ్యత భారత రాజ్యాంగంపై విశ్వాసంఉన్న ప్రతి పౌరుడిపై ఉన్నది. లేకుంటే దేశ ఐక్యతకు, సమగ్రతకే పెనుముప్పు వాటిల్లే ప్రమాదమున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ను దుర్వినియోగం చేసి ప్రజలచేత ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసి రాష్టప్రతి పాలన విధిస్తే- అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసి, కట్టడి చేసిన దృష్టాంతాలున్నాయి. రాజ్యాంగానికి వక్రభాష్యాలు చెప్పి దుర్వినియోగానికి పాల్పడితే న్యాయ వ్యవస్థ స్పందించకుండా ఉండలేదు. ఏ సమస్యనైనా రాజ్యాంగ పరిథిలో పరిష్కరించు కోవలసిందే. మరో మార్గం లేదు. రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉందనుకొంటే దాన్ని మార్చుకోవాలి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక, గత 6 దశాబ్దాల కాలంలో సంభవించిన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల పర్యవసానంగా 98 సార్లు రాజ్యాంగానికి సవరణలు చేశారు. ఆ పంథాలోనే మన ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసుకోవాలి. సామాజికాభివృద్ధికి అనుగుణంగా రాజ్యాంగంలో, చట్టాల్లో మార్పులు అనివార్యం.

రాషా్టల్ర పునర్‌ వ్యవస్థీకరణపై రాజ్యాంగం: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుపై శాసన సభ కేవలం అభిప్రాయం చెప్పడం వరకేగానీ, ఆ అభిప్రాయాలకు ఎలాంటి విలువలేదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనది. భారత రాజ్యాంగంలో సమాఖ్యవ్యవస్థ పరిరక్షణఅంశం అంత బలహీనంగా ఉన్నదా అన్న అనుమానం వస్తుంది. రాష్ట్ర విభజన ప్రక్రియ రాష్ట్ర శాసనసభ తీర్మానంతోనే మొదలవుతుందని 2009లో నాటి హోంమంత్రి హోదాలో చిదంబరం ప్రకటించారు. శాసనసభ, శాసనమండలి అభిప్రాయాలకు విలువే లేకపోతే రాష్టప్రతి ముసాయిదా బిల్లును ఎందుకు పంపినట్లు? శాసన సభ, శాసన మండలి సభ్యులు కేవలం కంఠశోష వినిపించుకోవడానికేనా? రాజ్యంగంలోని ఆర్టికల్‌ 3 ఏం చెబుతున్నదో పైన పేర్కొనడం జరిగింది. ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వానిది దళారి పాత్రమాత్రమే. తనకుతానుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలులేదని స్పష్టమవు తున్నది. ఒకవేళ అధికార దుర్వినియోగానికి బరితెగిస్తే, రాజ్యాంగ పరిరక్షణకు ఇతర రాజ్యాంగబద్దమైన వ్యవస్థలు రంగప్రవేశం చేయకతప్పదు. అంబేడ్కర్‌ ప్రతిపాదిం చిన సవరణలను రాజ్యాంగసభ ఆమోదించింది.

1)రాషా్టల్ర సరిహద్దులు, పేర్ల మార్పు అంశంపై భారత ప్రభుత్వానికి అధికారాన్ని దఖలు పరుస్తూ ముసాయిదాలో చేసిన ప్రతిపాదనను తొలగించి, భారత ప్రభుత్వం బిల్లును రూపొందించినా లేదా పార్లమెంటు సభ్యులు ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టాలని విన్నవించినా రాష్టప్రతి సిఫార్సు లేకుండా పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి వీల్లేదు. 2) రాష్టప్రతి అనుసరించే పద్ధతికి సంబంధించి కూడా స్పష్టత ఇచ్చారు. ప్రధాన మంత్రి లేదా గవర్నర్‌ సంబంధిత శాసన సభ/ శాసన మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, దానిపై చర్చించాలి. తద్వారా సంబంధిత రాష్ట్ర శాసనసభ నుండే ఈఅంశానికి సంబంధించిన ప్రస్తావనరావాలి లేదా చొరవ ప్రదర్శించాలి. అంతే గానీ పార్లమెంటు తనకు తానుగా ప్రస్తావన చేయడానికి వీలులేదు.3) భారత దేశంలోని రాషా్టల్రకు స్వయం ప్రతిపత్తి ఉన్నది.

రాషా్టల్ర సరిహద్దులు, పేర్ల మార్పు అంశంపై సంబంధిత రాషా్టల్ర నుండి అనుమతి పొందాలి. భారత యూనియన్‌ లో అంతర్భాగంగా స్వయం ప్రతిపత్తి ఉన్‌‌న రాషా్టల్రకు, ప్రావిన్సెస్‌కు మధ్య ఉన్న స్పష్టమైన మౌలిక వ్యత్యాసాన్ని, విభజన రేఖను అంబేడ్కర్‌ నొక్కి వక్కాణించారు. ఈ అంశాలను పరిశీలిస్తే- రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వ్యక్తం చేసే అభిప్రాయమేదైనా దానికి విలువఉం టుందని బోధపడుతుంది. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వ్యక్తంచేసే అభిప్రా యాన్ని రాజ్యాంగ పరిరక్షకుడుగా రాష్టప్రతి తృణీకారభావంతో తోసిపుచ్చలేరని కూడా అర్థవుతుంది. తెలంగాణతో ముడిపెట్టకుండా నిష్పాక్షిక దృష్టితో ఈ అంశాన్ని పరిశీలించాలి. చట్టసభలు అత్యంత జాగరూకతతో, బాధ్యతాయుతంగా, పారదర్శకగా తమ పనివిధానాన్ని మెరుగు పరచుకొంటూ సమాజ ప్రగతికి బాటలువేస్తేనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం, పరమార్థం ఉంటాయి. వైవిధ్యభరితమైన మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకొనడానికి సుదీర్ఘకాలం పట్టవచ్చు. అలాగే ప్రస్తుత రాజ్యాంగానికి వర్గస్వభావం ఉన్నది, తదనుగుణంకగా అనేక పరిమితులు ఉన్నాయి. అందులో ఇమిడిఉన్న ప్రజాస్వామిక భావనలను పరిరక్షించుకొంటూ, వాటికి కార్యరూపం సముపార్జించుకొంటూ, మెరుగైన రాజ్యాంగ వ్యవస్థకోసం అడుగులు ముందుకు వేయాలి. బహుళపార్టీ వ్యవస్థను పటిష్టవంతం చేసుకోవాలి. చట్టసభలు పట్టాలు తప్పి నడకసాగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం. వివక్షకు, అశాంతికి, అభివృద్ధి నిరోధానికి దారి తీసేలా చట్టసభలు ప్రవర్తిస్తే సామాజిక ఉద్రిక్తతలకు ఆజ్యం పోసినట్లవుతుంది.

తెలుగునాట ఒక సున్నితమైన, సంక్లిష్టమైన, జఠిలమైన విభజనసమస్య దేశం ముందుకొచ్చింది. ఈ సమస్యకు హేతుబద్ధమైన, న్యాయబద్ధమైన పరిష్కారానికి చిత్తశుద్ధితో అన్వేషణ జరగాలి, పరిష్కరించాలి. అదే సందర్భంలో ఈ వివాద పరిష్కారం మరెన్నో సమస్యల ఆవిర్భావానికి బీజం వేయకుండా రాజకీయ విజ్ఞత ప్రదర్శించాలి. నేడు తెలుగు ప్రజల మధ్య తలెత్తిన సమస్య పరిష్కారంలో కాంగ్రెస్‌పార్టీ, దాని నాయకత్వంలోని యుపిఎ- ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించాయనడం నిస్సందేహం. చట్ట సభలో విభజన అంశం అజెండాలో కొచ్చినప్పుడు సమగ్ర చర్చ జరిపి, ఏ నిర్ణయమైనా తీసుకోవడం ప్రజాస్వామ్య ప్రధాన లక్షణం.

Friday, January 24, 2014

శాసనసభ, శాసనమండలి అభిప్రాయానికి విలువే లేదా?





భాతర దేశం యొక్క రాజ్యo స్వభావం సమాఖ్య వ్యవస్థ (ఫెడరల్ వ్యవస్థ). భారత యూనియన్ లో అంతర్భాగమైన రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకున్న స్వయం ప్రతిపత్తిని, అధికారాలను కాలక్రమంలో హరించివేస్తూ వస్తున్నది. సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించే విధంగా  రాష్ట్రాల చట్ట సభల‌ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షతతో వ్యవహరిస్తే ప్రమాదకర పరిణామాలు సంబవిస్తాయి. కాబట్టే రాజ్యాంగ సభలో ఈ అంశంపై లోతైన చర్చ చేశారు. బ్రిటిష్ వలస పాలనలో ఉన్న ప్రావిన్సెస్ కు, భారత యూనియన్ లోని రాష్ట్రాలకు మధ్య మౌలికమైన తేడా ఉన్నదని భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ మూడుపై జరిగిన చర్చ సందర్భంలో విస్పష్టంగా పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమి సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం సమాఖ్య వ్యవస్థ స్వరూపాన్ని గొడ్డలి పెట్టుకు గురిచేయడానికి బరితెగిస్తే ప్రతిఘటించాల్సిన బాధ్యత భారత రాజ్యాంగంపై విశ్వాసం ఉన్న ప్రతి పౌరుడిపైన ఉన్నది. ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా ఆలోచించి, స్పందించాల్సి ఉంది. లేనియడల దేశ ఐక్యతకు, సమగ్రతకే పెనుముప్పు వాటిల్లే ప్రమాదమున్నది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ను దుర్వినియోగం చేసి ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధిస్తే  అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసి,  కట్టడి చేసిన దుష్టాంతాలున్నాయి. రాజ్యాంగానికి వక్రభాష్యాలు చెప్పి అడ్డగోలుగా దుర్వినియోగానికి పాల్పడితే న్యాయ వ్యవస్థ స్పందించ కుండా ఉండలేదు. ఏ సమస్యనైనా రాజ్యాంగ పరిథిలో సామరస్యంగా పరిష్కరించుకోవలసిందే. మరో మార్గం లేదు. రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉందనుకొంటే దాన్ని మార్చుకోవాలి  లేదా అందులో సవరణలు చేసుకోవాలి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక గడచిన ఆరు దశాబ్దాల కాలంలో సంభవించిన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల పర్యవసానంగా 98 సార్లు రాజ్యాంగానికి సవరణలు చేశారు. ఆ పంథాలోనే మన ప్రజాస్వామ్య వ్యవస్థను  మరింత పటిష్టవంతం చేసుకోవాలి. సామాజికాభివృద్ధికి అనుగుణంగా రాజ్యాంగంలో, చట్టాల్లో మార్పులు అనివార్యం.
రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణపై రాజ్యాంగం ఏం చెబుతున్నది :
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై శాసన సభ కేవలం అభిప్రాయం చెప్పడం వరకే గానీ ఆ అభిప్రాయాలకు ఎలాంటి విలువలేదంటూ కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనది.  ఈ వాదనను సమర్థించే తీరులోనే ఒక‌ ఆంగ్ల దినపత్రికలో జనవరి 4న సుధీర్ క్రిష్ణస్వామిగారు వ్యాసం వ్రాశారు.  సహజంగానే వీటి ప్రభావం సామాన్య ప్రజలతో పాటు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులపై పడినట్లు కనిపిస్తున్నది. భారత రాజ్యాంగంలో సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ అంశం అంత బలహీనంగా ఉన్నదా? అన్న అనుమానం వస్తున్న‌ది. రాష్ట్ర విభజన ప్రక్రియ రాష్ట్ర శాసనసభ తీర్మానంతోనే మొదలవుతుందని 2009లో నాటి హోం మంత్రి హోదాలో చిదంబరంగారు ప్రకటించారు. ఆ తరువాత ఆయనే కేంద్ర ప్రభుత్వం తరుపున రాజ్యసభలో అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. శాసన సభ, శాసన మండలి అభిప్రాయాలకు విలువే లేకపోతే రాష్ట్రపతి ముసాయిదా బిల్లును ఎందుకు పంపినట్లు? శాసన సభ, శాసన మండలి సభ్యులు కేవల‍ం కంఠశోష వినిపించుకోవడానికేనా? రాజ్యంగంలోని ఆర్టికల్ మూడు ఏం చెబుతున్నది. Formation of new States and alteration of areas, boundaries or names of existing States.- Parliament may by law: Provided that no Bill for the purpose shall be introduced in either House of Parliament except on the recommendation of the President and unless,  where  the proposal contained in the Bill affects  the  area, boundaries  or  name  of any of the States, the Bill  has  been referred  by  the  President  to the Legislature  of  that  State  for expressing its views thereon within such period as may be specified in the reference or within such further period as the President may allow and the period so specified or allowed has expired". ఈ వాక్యాల పరమార్థమేంటి? కేంద్ర ప్రభుత్వానిది దళారి పాత్ర మాత్రమే. తనకు తానుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలు లేదని స్పష్టమవుతున్నది. ఒకవేళ అధికార దుర్వినియోగానికి బరితెగిస్తే రాజ్యాంగ పరిరక్షణకు ఇతర రాజ్యాంగబద్దమైన‌ వ్యవస్థలు ర‍ంగ ప్రవేశం చేయక తప్పదు. ఈ ఆర్టికల్ రూపకల్పన పూర్వరంగాన్ని కూడా పరిశీలించాలి.
డా. అంబేద్కర్ సవరణల సారామేంటి ?
రాజ్యాంగ సభలో ఆర్టికల్ 3 పై సుదీర్ఘ చర్చ జరిగింది. రాజ్యాంగ సభ సభ్యుల మధ్య వాడివేడి వాదప్రతివాదనలు జరిగాయి. అంతిమంగా డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించిన సవరణలను రాజ్యాంగ సభ ఆమోదించింది. రాష్ట్రాల సరిహద్దులు, పేర్ల మార్పు అంశంపై పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టే అధికారం రాష్ట్రపతికి దఖలు పరచబడింది. ముసాయిదా రాజ్యాంగంలో మొదట ఈ హక్కును భారత ప్రభుత్వం ఖాతాలో చేర్చారు (“in original draft the power to introduce the Bill was given exclusively to the Government of India. No private Member of Parliament had the power"). అది పార్లమెంటు సభ్యుల హక్కులకు భంగం కలిగిస్తుందని రాజ్యాంగ సభ సభ్యులు కొందరు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తే (“Attention of the Drafting Committee was drawn to the fact that this was a somewhat severe and unnecessary curtailment of the right of the members of Parliament to move any motion they liked and in which they felt concerned”), దానిపై మేథోమదనం తదనంతరం ఆమోదించిన సవరణ‌లు. 
 1) రాష్ట్రాల సరిహద్దులు, పేర్ల మార్పు అంశంపై భారత ప్రభుత్వానికి అధికారాన్ని ధఖలు పరుస్తూ ముసాయిదాలో చేసిన ప్రతిపాదనను తొలగించి, భారత ప్రభుత్వం బిల్లును రూపొందించినా లేదా పార్లమెంటు సభ్యులు ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టాలని విన్నవించినా రాష్ట్రపతి సిఫార్సు లేకుండా పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి వీల్లేదు. (“Consequently we deleted this provision giving the power exclusively to the Government of India, and gave it to the President and stated that any such Bill whether it was brought by the Government of India or by any private Member should have the recommendation of the President”.)
2) రాష్ట్రపతి అనుసరించే పద్ధతికి సంబంధించి కూడా స్పష్టత ఇచ్చారు. ప్రధాన మంత్రి లేదా గవర్నర్ సంబంధిత శాసన సభ మరియు శాసన మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, దానిపై చర్చించాలి. తద్వారా సంబంధిత రాష్ట్ర శాసన సభ నుండే ఈ అంశానికి సంబంధించిన ప్రస్తావన రావాలి లేదా చొరవ ప్రదర్శించబడాలి. అంతే గానీ పార్లమెంటు తనకు తానుగా ప్రస్తావన చేయడానికి వీలులేదు. ("The method of consulting, which the President will adopt, will be to ask either the Prime Minister or the Governor to table a resolution which may be discussed in the particular State legislature which may be affected, so that ultimately the initiation will be by the total legislature and not by the Parliament at all".)
3) భారత దేశంలోని రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉన్నది. రాష్ట్రాల సరిహద్దులు, పేర్ల మార్పు అంశంపై సంబంధిత రాష్ట్రాల నుండి అనుమతి పొందాలి. బ్రిటిష్ కాలం నాటి ప్రావిన్సెస్ కు స్వయం ప్రతిపత్తి లేదు కాబట్టి వాటి సరిహద్దులలో మార్పులు చేయడానికి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. భారత యూనియన్ లో అంతర్భాగంగా స్వయం ప్రతిపత్తి ఉన్న‌ రాష్ట్రాలకు, ప్రావిన్సెస్ కు మధ్య ఉన్న స్పష్టమైన మౌలిక వ్యత్యాసాన్ని, విభజన రేఖను డా. అంబేద్కర్ గారు నొక్కి వక్కాణించారు. (“The States are sovereign States and the provinces are not sovereign States. Consequently, the Government need not be bound to require the consent of the provinces to change their boundaries; while in the case of the Indian States, it is appropriate, in view of the fact that sovereignty remains with them that their consent should be obtained".)
పై అంశాలను పరిశీలిస్తే రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వ్యక్తం చేసే అభిప్రాయమేదైనా దానికి విలువ ఉంటుందని సామాన్యులకు సహితం బోధపడుతుంది. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వ్యక్తం చేసే అభిప్రాయాన్ని రాజ్యాంగ పరిరక్షకుడుగా రాష్ట్రపతి తృణీకార భావంతో తోసిపుచ్చలేరని కూడా అర్థవుతుంది. తెలంగాణ అంశంతో ముడిపెట్ట‌కుండా నిష్పాక్షిక దృష్టితో ఈ అంశాన్ని పరిశీలించాలి.
పారదర్శకతపైనే చట్టసభల విశ్వసనీయత :
చట్ట సభలు అత్యంత జాగరూకతతో, బాధ్యతాయుతంగా, పారదర్శకoగా తమ పని విధానాన్ని మెరుగు పరచుకొంటూ సమాజ ప్రగతికి బాటలు వేస్తేనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం, పరమార్థం ఉంటుంది. వైవిద్యభరితమైన మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకొనడానికి సుదీర్ఘకాలం పట్టవచ్చు. అలాగే ప్రస్తుత‌ రాజ్యాంగానికి వర్గ స్వభావం ఉన్నది, తదనుగుణ‍ంగా అనేక పరిమితులు ఉన్నాయి. అందులో ఇమిడి ఉన్న ప్రజాస్వామిక భావనలను పరిరక్షించుకొంటూ, వాటికి కార్యరూపం సముపార్జించుకొంటూ, మెరుగైన రాజ్యాంగ వ్యవస్థ కోసం అడుగు ముందుకు వేయాలి. బహుళ పార్టీ వ్యవస్థను పటిష్టవంతం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో చట్ట సభలు పట్టాలు తప్పి నడకసాగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం. వివక్షతకు, అశాంతికి, అభివృద్ధి నిరోధానికి దారి తీసేలా చట్టసభలు ప్రవర్తిస్తే సామాజిక ఉద్రిక్తతలకు ఆజ్యం పోసినట్లవుతుంది.
తెలుగు నాట ఒక సున్నితమైన, సంక్లిష్టమైన, జఠిలమైన విభజన సమస్య దేశం ముందుకొచ్చింది. ఈ సమస్యకు హేతుబద్దమైన, న్యాయబద్దమైన పరిష్కారానికై చిత్తశుద్ధితో అన్వేషణ జరగాలి, పరిష్కరించబడాలి. అదే సంద‌ర్భంలో ఈ వివాద‌ పరిష్కారం మరెన్నో సమస్యల ఆవిర్భావానికి బీజం వేయకుండా రాజకీయ విజ్ఞత ప్రదర్శించాలి. ఈనాడు తెలుగు ప్రజల మధ్య తలెత్తిన సమస్య పరిష్కారంలో కాంగ్రెసు పార్టీ, దాని నాయకత్వంలోని యు.పి.ఎ.- II ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించిందనడంలో నిస్సందేహం. దాదాపు పది సంవత్సరాలుగా వారే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. నేడు రాష్ట్రపతిగా ఉన్న ప్రణాబ్ ముఖర్జీ యు.పి.ఎ.-I ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలో కమిటీని ఏర్పాటు వేసినా నివేదికే ఇవ్వలేదు. అటుపై శ్రీకృష్ణ కమిటీని నియమిస్తే ఏడాది పాటు ఈ సమస్యపై వివిధ వర్గాల వాద ప్రతివాదనలను, సమాచారాన్నిసేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఆంటోని కమిటీని వేశారు. కేంద్ర మంత్రి మండలి ఉప సంఘాన్ని వేశారు. వారు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలన్నింటినీ చట్ట సభల ముందుంచి పారదర్శకంగా చర్చించడానికి ప్రజాస్వామ్యంలో అవకాశం కల్పించాలి. అప్పుడే అర్థవంతమైన,  చర్చకు వీలుంటుందన్న వాదనలో బలం ఉంది. అలా కాకుండా కేవలం విభజనకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుపైనే చర్చ అంటే అది అసమగ్రమైన, పాక్షికమైన చర్చగానే ఉంటుంది. పర్యవసానంగా హేతుబద్ధమైన నిర్ణయానికి చట్టసభ రాలేదు. సుదీర్ఘకాలంగా చర్చించబడుతున్న సమస్యే కదా ! ఇంకా చర్చేంటి అని కొందరంటున్నారు. చట్ట సభలో విభజన అంశం అజెండాలోకొచ్చినప్పుడు సమగ్ర చర్చ జరిపి, ఏ నిర్ణయమైనా తీసుకోవడం ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన లక్షణం.


Wednesday, January 1, 2014

పెడధోరణులపైనే ప్రణబ్ గురి

Sakshi  January 01, 2014 
పెడధోరణులపైనే ప్రణబ్ గురి


 ఒకప్పుడు జనా భా నలభై ఐదు కోట్లుగా ఉన్నప్పుడే దేశాన్ని ఐక్యంగా ఉంచుకోలేక పోయాం. నేడు 125 కోట్ల జనాభాను ఒక్కటిగా ఉంచాలి. ఇది జాతి ముం దున్న అతి పెద్ద సవాలు. రాష్ట్రాల విభజన డిమాండ్లు చాలా ముందుకు వస్తున్నాయి. సవ్యమైన విధానాల రూపకల్పనకు దోహదపడే విధంగా వాస్తవాల ఆధారంగా, హేతుబద్ధమైన క్షేత్రస్థాయి సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత నిఘా సంస్థలపై ఉన్నదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గత నెల 19న అన్నారు.  తద్వారా అయన చాలా లోతైన అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదలతో పాటూ పలు పెడ ధోరణులు పెచ్చరిల్లుతున్న పర్యవసానంగా జాతీయ ఐక్యత పెను సవాలు ఎదురవుతోందని ప్రణబ్ హెచ్చరించారా? ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విభజన సమస్య నుంచి ఉత్పన్నమైన పరిస్థితుల కారణంగా పార్లమెంటు అచేతనమై పోవడం పట్ల కలత చెంది అలా వ్యాఖ్యానించారా? ప్రత్యేక తెలంగాణ లోతుపాతులు, పర్యవసానాలపై రాజకీయ విజ్ఞత లోపించిందని భావించారా? ఆ అంశంపై హేతుబద్ధమైన సమాచారాన్ని అందించడంలో నిఘా సంస్థల వైఫల్యాన్ని సూచించారా? ఏది ఏమైనా ఇవన్నీ నిశితంగా పరిశీలించాల్సిన ప్రశ్నలే.

 ‘విభజన’ మూలాలు: పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాలకు అనుగుణంగానే మన రాష్ట్ర అభివృద్ధి గమనం ఉన్నది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి విశాఖలో హిందుస్థాన్ షిప్‌యార్డు, హైదరాబాద్‌లో ఆల్విన్, నిజామాబాద్‌లో నిజాం చక్కెర పరిశ్రమలు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు. 1965-75 మధ్య కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఈసీఐఎల్, బీహెచ్‌ఈఎల్, ఐడీపీఎల్ లాంటి భారీ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసింది. పారిశ్రామిక కేంద్రంగా హైదరాబాద్‌కు (కొంత వరకు విశాఖపట్నానికి) పునాదులు పడ్డాయి. ఏ ఒక్క ప్రభుత్వమూ పారిశ్రామిక వికేంద్రీకరణ వైపు దృష్టి పెట్టలేదు. 1990 దశకం నుంచి ప్రవేశ పెట్టిన సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ ఫలితంగా పట్టణాలు నగరాలుగా, నగరాలు మహానగరాలుగా ఎదిగి అభివృద్ధి నమూనాలుగా వెలిశాయి. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. ఆర్థిక అసమానతలు అతి వేగంగా పెరిగిపోతుండగా ప్రజల్లో అసంతృప్తి ప్రజ్వరిల్లుతున్నది. ఈ పరిస్థితులు విభజనోద్యమాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయనడంలో సందేహం లేదు. రాష్ట్రాలు బలహీనంగా ఉండాలన్న భావజాలంతో బీజేపీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు కట్టుబడి ఉంది. అవకాశవాదాన్ని తలకెక్కించుకొన్న కాంగ్రెస్ ఓట్లు, సీట్లే కొలబద్దగా  ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధానాన్ని అమలు చేస్తున్నది. ‘విభజించి పాలించు’ విధానాన్ని అనుసరిస్తోంది. అస్తిత్వ రాజకీయాల్లో భాగంగా ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు పట్టంగట్టే రాజకీయ శక్తులు ఆ ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలోని ‘ప్రత్యేక’ డిమాండ్లేవీ దేశ సార్వభౌమత్వానికి హాని కలిగించవని కొందరి వాదన. శాంతియుత సహజీవనం సాగించాల్సిన ప్రజల మధ్య విషబీజాలను నాటుతున్నామనే స్పృహ లోపించడం శోచనీయం.

 అనుభవాల నుంచి ఏం నేర్చుకొన్నాం? బ్రిటిష్ పాలకులు పోతూ పోతూ కుట్రపూరితంగా దేశాన్ని రెండు ముక్కలు చేసి, సరిహద్దుల్లో రావణ కాష్టాన్ని రగిల్చి పోయారు. మన దేశం అండదండలతో సాగిన తూర్పు పాకిస్థాన్ విముక్తి ఉద్యమం ఫలితంగా బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. దీంతో పాక్ మనపై మరింత కక్ష పెంచుకుంది. కాశ్మీర్ సమస్య సాకుతో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తున్నది. అలాంటి సున్నిత రాష్ట్రం జమ్మూ-కాశ్మీర్‌ను జమ్మూ, కాశ్మీర్, లడఖ్ అనే మూడు రాష్ట్రాలుగా విడగొట్టాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈశాన్యంలో గ్రేటర్ నాగాలాండ్, బోడోలాండ్, గూర్ఖాలాండ్ వగైరా డిమాండ్లతో నిరంతరం ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలులో పొందుపరచిన 15 భాషలలో స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగే సదుపాయాలు పార్లమెంటులోనే లేని దుస్థితి కొనసాగుతున్నది. జనాభాలో 38 శాతం హిందీ మాట్లాడుతున్నా దాన్ని అందరిపై రుద్దాలని చూస్తే ప్రతిఘటన తప్పదు. రాష్ట్రాల చట్టసభల్లో మాతృభాష అమలుకు సైతం చిత్తశుద్ధి ప్రయత్నించాల్సి ఉంది. పార్లమెంటు కార్యకలాపాలపై హిందీని రుద్దే ప్రయత్నాలకు దక్షిణాది ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం సహజం. దేశ రాజధాని ఢిల్లీలో ఉత్తరాది పెత్తనమే సాగుతోందనే అభిప్రాయం ఇప్పటికే బలంగా ఉంది.

 ఒకటి మాత్రం వాస్తవం... ప్రాంతీయ, భాషాపరమైన సమస్యల వంటి సున్నిత సమస్యలపై వివిధ ప్రాంతాల ప్రజల మనోభావాలు సున్నితంగా, జటిలంగా తయారవుతున్నాయి. అవి ఎప్పుడు ఎలా పరిణమిస్తాయోననే సందేహాలను కలుగజేస్తున్నాయి. రాష్ట్రపతి ఆ కోణాన్నే స్పృశించినట్లుంది. ఇలాంటి సమస్యలపై ఆషామాషీగా తీసుకునే నిర్ణయాల వల్ల పరిణామాలు ప్రమాదకరంగా ఉంటాయని రాష్ట్రపతి చెప్పకనే చెప్పారనిపిస్తుంది. నిఘా వర్గాలు నిష్పాక్షికంగా, వాస్తవాల ఆధారంగా సేకరించిన సమాచారాన్ని విధాన నిర్ణేతలకు అందించి, సముచిత నిర్ణయాల రూపకల్పనకు తోడ్పడాలని ప్రణబ్ ఉపదేశించారు.

 నేటి సంకీర్ణ రాజకీయాల యుగంలో సైతం అతి పెద్ద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఏకమై ఎలాంటి లోపభూయిష్టమైన, హానికరమైన చట్టాన్నయినా తీసుకొచ్చి దేశంపై బలవంతంగా రుద్దగలవు. అలాంటి ప్రమాదమే చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ముంచుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేసి అడ్డగోలుగా రాష్ట్రాల విభజనకు అవి బరితెగించగలవనడానికి తాజా ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ పరిణామాలు. ఈ విషయంలో కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం అనుసరించిన పద్ధతులు రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి, సమాఖ్య వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయి. తెలంగాణ అంశాన్ని నానబెట్టి ఎన్నికలు సమీపిస్తుండగా దుందుడుకుగా వ్యవహరించడంలోని హేతుబద్ధతను, లోపాలను ప్రతిపక్షాలు ప్రశ్నించకపోవడం, ప్రేక్షక పాత్ర పోషించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు.  
 టి. లక్ష్మీనారాయణ,  డెరైక్టర్  నీలం రాజశేఖరరెడ్డి  పరిశోధనా కేంద్రం