Wednesday, January 18, 2012

యుపిలో పావులు ప్రజలే !

published in Surya daily on 18th January 2012

ఊసరవెల్లి రాజకీయాల కు, భ్రష్ట నాయకత్వ లక్షణాలకు ఉత్తర ప్రదేశ్‌ రాజ కీయ ముఖచిత్రమే ప్రబల నిదర్శ నం. ఢిల్లీ పీఠం క్రింద భూప్ర కం పనలు సంభవించకుండా చూసు కోవాలన్న తాపత్రయం కాంగ్రెస్‌ పార్టీది. ఢిల్లీ గద్దెనెక్కించిన రామ బాణం ఏక ప్రయోగంతో నిర్వీ ర్యమై పోవ డంతో భారతీ య జనతా పార్టీ ఉనికికోసం సంఘవ్యతిరేక శక్తులను అక్కున చేర్చుకొంటు న్నది. అస్తిత్వ రాజకీయాలతో అరంగేట్రం చేసి అధికార వ్యామో హం, వ్యక్తి పూజ రాజకీయాలకు సరికొత్త నిర్వచనాలు చెబుతూ డిల్లీ కుర్చీపై కన్నేసిన మాయావతి రాష్ట్ర విభజన రాజకీయాలతో ఎన్నికల క్రీడకు జెండా ఊపింది.

పూర్వ వైభవానికి నోచుకోక పో యినా లక్నో గద్దె దక్కితేచాలన్న మనోవేథనలో ఉన్న ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై కన్నేసి, మాయావతి వది లించుకొన్న నేరగాళ్ళను చేరదీసి యుద్ధతంత్రం పన్నుతున్నారు. రాజకీయ పార్టీల విన్యాసాలు ప్రజలను విస్తుగొలుపుతు న్నాయి. భవిష్యత్తులో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు ప్రస్తుతం జరు గుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రీఫైనల్‌ లాంటివని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజమే, లక్నోలో కింగ్‌మేకర్‌ ఎవరో ఆపై ఢిిల్లీలో కింగ్‌మేకర్‌ ఎవరో ! ఈ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌ ప్రజలు తేల్చనున్నారు.

కేంద్రంలో యు.పి.ఎ. ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ కష్టాల కడలిలో బండిని లాక్కొస్తున్న కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే ఫలి తా ను సాధించకపోతే సంక్షోభాల సుడిగుండంలో పడకతప్పదు. యువరాజు రాహుల్‌ గాంధీ రాజకీయ భవిష్యత్తు అంధకారమే. అహంకారంతో హూంకరిస్తూ, తన పెత్తనం క్రింద ఉండ లేకపోతే పశ్చిమ్‌బెంగాల్‌ రాష్ట్రప్రభుత్వం నుండి నిష్క్రమించండని తలుపులుతెరిచిన మమత మరింతరెచ్చిపోయి వ్యవహరిస్తుందన డంలో ఎలాంటి సంద ేహంలేదు. శాసనసభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వాతావరణంలో మార్పు రాకముందే లోక్‌ సభకు ముందస్తు ఎన్నికలు వచ్చేలా చేసి లబ్ధిపొందా లనే దుందు డుకుతనంతో మమత ఆలోచిస్తున్నట్లుంది. అవినీతి కుంభకో ణాలు, ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న యు.పి.ఎ. ప్రభుత్వానికి ప్రజలు దూరమైనారని గుర్తించిన ఆమె రాజకీయప్రయాణానికి బోటు మార్చినా ఆశ్చర్యం లేదు.

ఈ పూర్వరంగంలో జరుగుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ప్రత్యేకంగా రాహుల్‌గాంధీ నాయకత్వ లక్షణాలను రుజువు చేసుకోవడానికి జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. గత ఎన్నికల్లో 22 స్థానాలు, 8.6 శాతం ఓట్లు సాధిస్తేనే రాహుల్‌ను ఆకాశానికెత్తారు. అంటే అతిపెద్ద రాష్ట్రంలో, ఉద్దండులైన ప్రధా నమంత్రులను అందించి న, ప్రధాన మంత్రులను నిర్ణయించే శక్తి ఉన్న ఉత్త రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎంత టి అధ్వాన్నస్థితిలో ఉన్నదో విదితమే. ఆ దుస్థితి నుం డి బయటపడి కాంగ్రెస్‌పా ర్టీ అధికారంలోకి వస్తుందన్న భ్రమలు వారికేలేవు. కాకపోతే ఉన్న బలాన్ని పెంచుకోవాలని తాపత్రయ పడుతున్నారు. తద్వారా యుపి రాజకీయాలలో కింగ్‌మేకర్‌ పాత్రధారులై డిల్లీ రాజకీయాలకు స్థిరత్వం తెచ్చుకోవాలని, ఛరిస్మా ఉన్న నాయకుడుగా రాహుల్‌ని భుజాలకెత్తుకొని ప్రధాన మంత్రి పీఠంవద్దకు మోసుకు పోవాలని
ఉవ్విళ్ళూరుతున్నారు.

ఈ రాజకీయ లక్ష్యంలో భాగంగానే రాహుల్‌గాంధి కొంతకా లంగా ఆ రాష్ట్రంపై కేంద్రీకరించారు. బహుజన్‌, సమాజవాది పార్టీకి పునాదిగాఉన్న దళితులకు దగ్గరకావాలనే తపనతో తర చూ పర్యటనలు చేశారు. ముస్లిం మైనారిటీలను ఆకట్టుకోవడాని కి ఎన్నికల నోటిఫికేషన్‌ రాబోతున్న సందర్భంలో వెనుక బడిన కులాలకు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్లలో 4.5 శాతాన్ని ముస్లిం మైనారిటీలకు కేటాయించే ప్రతిపాదన చేశారు. ముఖ్యంగా యు.పి.లో దళితులు, ముస్లిం మైనారిటీలు, రైతాం గాన్ని ప్రలోభ పెట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని కాంగ్రెస్‌ చూస్తున్నది. మరొకవైపు జాట్‌ కులస్తుల్లో పట్టున్న రాష్టీయలో క్‌దళ్‌ పార్టీ అగ్రనేత అజిత్‌సింగ్‌కు కేంద్ర మంత్రి పదవికట్టబెట్టి తమ గాటిలో కట్టేసుకొన్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాల్లో పైచేయి సాధించడం ద్వారా ప్రయోజనం పొం దాలని కాంగ్రెస్‌ ఎత్తు వేసింది. పడరాని పాట్లుపడుతున్నది.

దళిత పార్టీగా ఆవిర్భవించి, బ్రాహ్మణ భావజాలాన్ని ద్వేషించి న బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బి .యస్‌ .పి) అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి 2007‚లో జరిగిన ఎన్నికల్లో బ్రాహ్మణులు తది తర కులాలతో కూడిన విశాల ఐక్యతకు పిలుపిచ్చి, సీట్లిచ్చి అధి కారంలోకి వచ్చింది. 30.4 శాతం ఓట్లతో మొత్తం 403 శాసన సభస్థానాల్లో 206 గెలుచుకొని బొటాబొటి ఆధిక్యత సాధించిం ది. ఆపై మెల్లిమెల్లిగా బలాన్ని 218కి పెంచుకొన్నది. బడుగు బల హీన వర్గాలకు సామాజిక న్యాయాన్ని కల్పించి, వారి అభివృద్ధికి జరిగిన కృషి ఎంత అన్నది ప్రశ్నార్థకం.

కానీ కుంభకోణాలు, అవినీతి పెచ్చుమీరిపోయాయి. 22 మంది మంత్రులు, 28 మంది శాసనసభ్యుల అవినీతి కేసులపై ఆ రాష్ట్ర లోకాయుక్త విచారణ జరుపుతున్నది. మాయావతి సోద రుడు ఆనంద్‌కుమార్‌ 10వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నా డు. వీటినిబట్టి ఎంత విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలిందో స్పష్ట మవుతున్నది. హత్యల కేసుల్లో బి. యస్‌ .పి.కి చెందిన ఇద్దరు శాసనసభ్యులకు కోర్టులు శిక్ష విధించాయి. పార్లమెంటు సభ్యులు ధనంజయ్‌సింగ్‌ ఒక హత్య కేసులో అరెస్టయ్యాడు. ప్రజాప్రతినిధులే హత్యానేరాల్లో ప్రత్య క్షంగా భాగస్వాములైనారన్నదానికి ఇవికొన్ని ఉదాహరణలు మాత్రమే.

వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న దుష్టశక్తులకు రక్షణ కల్పించిన పర్యవసానంగా హత్యలు, నేరాలు పెరిగిపో యాయి. 21 మంది రాష్టమ్రంత్రులను తొలగించడంద్వారా చేతులు దులిపేసుకోవాలని మాయావతి ఇప్పుడు ప్రయత్నిం చడం వంచనచర్యల్లో భాగమే. డా: బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌, కాన్షీరామ్‌ శిలావిగ్రహాలతో పాటు మాయావతి, బి.యస్‌.పి. ఎన్నికల చిహ్నమైన ఏనుగు శిలావిగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పడానికి వందల కోట్ల రూపాయలు దుబారా చర్యలతో అధికార దుర్వినియోగం పరాకాష్ఠకు చేరుకొంది.

ఐదు సంవత్సరాల దుష్పరిపాలన, నియంతృత్వ విధానాల అమలువల్ల మాయావతి అపఖ్యాతి పాలైనారు. ఇప్పుడు అధికార దా హంతో కుటిలనీతిని ప్రదర్శిస్తూ యుపిని నాలుగు ముక్కలు చేస్తేనే దళితులకు న్యాయం జరుగుతుందని కొత్త పల్లవి అందుకొన్నారు. హడావుడిగా శాసనసభను సమావేశపరచి పట్టు మని పదిేహను నిమిషాలపాటు కూడా కూర్చోకుండానే మూజువాణి ఓటింగ్‌తో తీర్మానం చేసినట్లు సభాపతితో ప్రకటన చేయించి విభజన రాజకీయాలకు తెరలేపారు.

దేశానికి గుండె కాయలాంటి అతి పెద్దరాష్టమ్రైన యుపిపై పెత్తనాన్ని కొనసాగించుకొంటూ దాన్ని మెట్టుగా ఉపయోగించుకొని డిల్లీ గద్దెనెక్కాలని ఉవ్విళ్ళూరుతున్నట్లుంది. ఆ తీర్మానాన్ని డిల్లీకి పం పితే తిరుగు తపాలాలో తిరిగొచ్చింది. ఈ అంశంపై దివాలా కోరు విధానాలతో పార్టీలు పోటీపడుతున్నాయి. పాలకపార్టీలు రాష్ట్రా లవిభజన సమస్యను పాశుపతాస్త్రంగా వాడుకోవాలని పడరాని పాట్లు పడుతున్నాయి. అధికార యావతప్ప దేశ ప్రయో జనాలు గానీ, విస్తృత ప్రజాప్రయోజనాలుగానీ రాజకీయ పార్టీలకు పట్టవన్న విషయం యుపి పరిణామాలతో మరొకసారి బట్ట బయలయింది. కాంగ్రెస్‌ రెండో యస్‌.ఆర్‌.సి. అని కూనిరాగా లు తీస్తున్నది. బి.జె.పి.కి జాతీయ విధానమంటూ లేకుండా పో యింది. ప్రాంతానికో మాటచెబుతూ అవకాశవాదంతో రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నది.

ఎన్నికల జాతర మొదలు కాగానే రంగులు మార్చే రాజకీయ నాయకులు ఆలసించిన ఆశాభంగం అన్న నానుడిగా చకచకా పార్టీలను మార్చేస్తున్నారు. పాలకపార్టీ బి.యస్‌.పి. పని అయిపో యిందని భావించినవారు, మాయావతి చేత తొలగించబడిన వారు, ప్రస్తుతం ఉన్న పార్టీల్లో పోటీ చేసే అవకాశ లభించదని నిర్ధారణకు వచ్చిన వారు శరవేగంతో జెండాలు మార్చేస్తున్నారు. అధికార మే పరమావధిగా భావిస్తున్న రాజకీయపార్టీలు మంచి చెడులను ఆలోచించకుండానే పార్టీ కండువాలు కప్పేస్తున్నారు. బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కారి భారీ అవినీతికి పాల్పడి మంత్రి పదవిని కూడా కోల్పోయిన బాబు సింగ్‌ కుష్వాహకు పార్టీ తీర్థం ఇచ్చారు. దాంతో అల్లరిపాలుకావడమే కాకుండా ఆ పార్టీ ఆంత రంగిక సమస్యల్లో పడింది. ఈ విషయంలో సమాజ్‌ వాది పార్టీ కూడా ఏ మాత్రం వెనుకబడి లేదు.

ఎన్నికల చిత్రాన్ని స్థూలంగా పరిశీలిస్తే బి.యస్‌.పి., సమా జ్‌వాది పార్టీ , కాంగ్రెస్‌ రాష్ట్రీయ లోక్‌దళ్‌ కూటమి , బి.జె.పి.ల మధ్యనే నాలుగు స్థంభాలాటగా కనిపిస్తున్నా అధికారం కోసం జరుగుతున్న పోరు మాత్రం బి.యస్‌.పి., సమాజ్‌వాది పార్టీల మధ్యనే ఉంటుందని భావించవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును సొమ్ము చేసుకోవడానికి మిగిలిన మూడుపార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బి.యస్‌.పి. నుండి దూరమైన ఓటర్లలో ఎవరు ఎంత శాతం ఓట్లను ఆకర్షించుకోగలరనే దానిపై ఆధారపడి వారి స్థానమెక్కడ? అన్నది తేలుతుంది. గత ఎన్నికల్లో 25.4 శాతం ఓట్లతో 97 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద ప్రతిపక్షపార్టీగా ఉన్న ములాయంసింగ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదిపార్టీ అతిపెద్దపా ర్టీగా ఆవిర్భవిస్తుందని కొందరు అంచనాలు వేస్తున్నారు.

ప్రస్తుత శాసన సభలో 17 శాతం ఓట్లతో 51స్థానాలు గెలిచి మూడవ స్థానంలో బి.జె.పి. ఉన్నది. నాలుగ స్థానంలో కాంగ్రెస్‌ ఉన్నది. డిల్లీ గద్దె కోసం దెబ్బ లాడుకొంటున్న ఈ రెండు జాతీయ పార్టీలూ ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు కూడా మూడు, నాలుగు స్థాన ాల కోసమే పోటీ పడుతున్నాయని భావిస్తున్నారు. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలే మెండుగా ఉన్నాయని విశ్లేషకుల అంచనా. సమస్యల్లా ఎవరు కింగ్‌ మేకర్‌ అన్నదే ! కాంగ్రెస్‌ యస్‌.పి., బి.యస్‌.పి., బిజెపి, కాంగ్రెస్‌, బి.యస్‌.పి.లాంటి ఇచ్చిపుచ్చు కొనే భాగస్వామ్య ఒప్పందాలు గతంలోనూ చేసుకొన్నారు. కాక పోతే అంతిమంగా ఈ రాజకీయ క్రీడలో ప్రజా సమస్యలు పరి ష్కారం కాకపోగా జటిలమై నష్టపోతున్నది ప్రజలే !

No comments:

Post a Comment