Saturday, August 15, 2015

పట్టిసీమ ప్రాజెక్టుపై హెచ్.యం.టి.వి.లో ఆగస్టు 13న‌ లెఫ్ట్ & రైట్ శీర్షికతో నిర్వహించబడిన చర్చా కార్యక్రమంలో నాతో పాటు మాజీ రాష్ట్ర మంత్రి వర్యులు, వై.యస్.ఆర్.సి.పి.నాయకులు డా. యం.వి.మైసూరారెడ్డి, మాజీ రాష్ట్ర మంత్రి వర్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డా. శైలజానాథ్, ఆంధ్ర మేధావుల సంఘం, అధ్యక్షులు శ్రీ చలసాని శ్రీనివాస్, టిడిపి శాసన సభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరావు పాల్గొన్నారు.

 ఒక మాతృమూర్తికి ముగ్గురు ఆడ పిల్లలు
ముగ్గురు కూతుళ్ళకు పండంటి బిడ్డలు పుట్టారు
పెద్ద‌ కూతురుకు తన‌ బిడ్డ కడుపు నిండా పాలిచ్చాక కూడా తన పాలు బుగ్గి పాలైయ్యేంత సమృద్ధిగా ఉన్నాయి
ఒకే కాన్పులో అధిక సంతానానికి జన్మ‌నిచ్చిన రెండవ‌ కూతురు, బిడ్డలందరికీ సరిపడ పాలివ్వలేక తల్లడిల్లి పోతున్నది
పౌష్టికార లోపంతో స్థనాలెండి పోయిన మూడవ‌ కూతురు, తన‌ బిడ్డకు పాలివ్వలేని దుస్థితిలో వున్నది
ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చిన మాతృమూర్తి హృదయ ఘోష వర్ణనాతీతం
పెద్ద కూతురి స్థనాల నుండి జాలు వారి బుగ్గి పాలౌతున్న పాలను గిన్నెలోకి పట్టుకొని
ఆకలితో మలమలలాడి పోతున్న‌ మ‌నవళ్ళు, మనమరాళ్ళ‌ కడుపు నింపాలని పరితపిస్తున్నది
గోదారమ్మ, కృష్ణమ్మ, పెన్నార్ తల్లి పేగు బంధాన్ని తెగనీయవద్దు!
నీరున్న చోటు నుండి నీరు లేని కరువు పీడిత ప్రాంతాలకు నీటిని తరలించాలి
నీటికి సంకుచిత‌ రాజకీయాల రంగులను పులమద్దు!
విమర్శల కోసం విమర్శలు అర్థరహితం, సద్విమర్శలు ఆహ్వానించతగ్గవి
నీటి వినియోగం మన ఇష్టాయిష్టాలపై ఆధారపడి లేదు, ట్రిబ్యునల్ తీర్పులే శిరోధార్యం
ప్రాజెక్టులకు అనుకూలం - అవినీతికి బద్ధ వ్యతిరేకం అన్న నినాదమే ప్రతిధ్వనించాలి
అన్నపూర్ణగా గణతికెక్కిన మాగాణి భూములు సిరులు పండించాలి
కరువుల్లో పుట్టి, కరువులతో జీవన్మరణ పోరు సల్పుతూ, మరణిస్తున్న అభాగ్యుల గొంతులు తడవాలి
పాలకుల వంచనకు, ప్రకృతి నిరాధరణకు బలైపోతున్న కరువు పీడితులకు త్రాగునీరు, సాగునీరు హక్కుగా లభించాలి
నా ఈ గుండె చప్పుడునే ఈ హెచ్.య‍ం.టీ.వి. లెప్ట్ & రైట్ చర్చలో వినిపించే ప్రయత్నం చేశాను.

https://www.youtube.com/watch?v=WhAbgC7OoMU&list=PLYbtwlhBDQlnmkf4665Ukpz4u5riSMapA

No comments:

Post a Comment