Wednesday, March 26, 2014

అంపశయ్యపై కాంగ్రెస్‌




నేత ఫిరాయింపులు, పార్టీల కలయికలు
„ద శాబ్దం పాలన తర్వాత కాంగ్రెస్‌ కుదేలు
ఐక్య ప్రగతిశీల కూటమి కకావికలు
జారుకుంటున్న యుపిఎ పక్షాలు
ప్రాంతీయ పార్టీలు హస్తానికి దూరం
పొత్తులకోసం ముందుకు రాని కొత్త మిత్రులు
సీమాంధ్రలో అభ్యర్ధులే దొరకని దుస్థితి
తెలంగాణ- సీమాంధ్రల్లో కూలిన కోటలు


పదహారవ లోక్‌ సభకు, మన రాష్ట్రంతో పాటు నాలుగు రాషా్టల్ర శాసన సభల ఎన్నికల నిర్వహణకు దశల వారీ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ కొనసాగుతున్నది. అధికారం కోసం అర్రులు చాస్తున్న పార్టీలు, వ్యక్తులు సిద్ధాంతాలను ప్రక్కకు నెట్టి కలయిలకు సై అంటే సై అనేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశావహులు గెలుపు గుర్రాలుగా కనిపిస్తున్న పార్టీలలోకి జంప్‌ చేసేస్తున్నారు. మన రాష్ట్రంలోనైతే పిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకరి ముఖాన మరొకరు ఉమ్మేసుకొన్న వారు, ఆ మరకలను పార్టీల జెండాలతో తుడిపేసుకొని, చిరునవ్వులతో కౌగలించుకొంటు న్నారు. ముక్కున వేలేసుకొని నివ్వెరపోవడం ప్రజల వంతయ్యింది. గెలుపే కొలబద్దగా రాజకీయ శక్తుల పునరేకీకరణ, విచ్ఛిన్నం రెండూ నిత్యనూతనంగా సాగిపోతున్నా యి. దశాబ్దం పాటు కేంద్రంలోను, మన రాష్ట్రం లోను అధికారాన్ని వెలగబెట్టి ప్రజాగ్రహానికి గురెన కాంగ్రెస్‌ పార్టీ డీలా పడింది. కాంగ్రెస్‌ నేతృత్వం లోని ప్రగతిశీల ఐక్య కూటమి (యుపిఎ) కకా వికలయ్యింది. మిగిలిన రాజ కీయ పార్టీలు ఎన్నికల సమ రంలో అన్నిరకా ల అస్త్ర శసా్తల్ర ను వినియోగిం చడానికి సన్నద్ధమైనాయి. ప్రసారమాధ్యమాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్‌ షోల ద్వారా ప్రచార హోరు మొదలయ్యింది.

అరచేతిలో స్వర్గం చూపెట్టే నైపుణ్యాన్ని బాగా వంటబట్టించుకొన్న నాయకులు తమ నాలుకలకు బాగా పదును పెట్టారు. ప్రత్యర్థులను నైతికంగా కృంగదీసి దెబ్బకొట్టడమే లక్ష్యంగా కొంత మంది నోళ్ళు అదుపు తప్పుతున్నాయి. దూషణ పర్వం కొనసాగుతున్నది. వేసవి వడగాల్పులతో పాటు ఎన్నికల వేడితో ప్రజల బురల్రు వేడెక్కుతున్నాయి. ఎవరి మాట నమ్మాలో, ఏ పార్టీని విశ్వసించాలో, ఎవరికి ఓటేసి, ఏ పార్టీని గద్దెనెక్కిస్తే తమ జీవితాలకు ఊరటనిచ్చే ఆర్థిక, రాజకీయ విధానాలను అమలుచేస్తారో పాలుపోక ప్రజలు తలలు బాదుకుంటున్నారు. కులం, మతం, ప్రాంతం, డబ్బు, మద్యం వంటి ఆయుధాలతో, మాయమాటలు, నయవంచనలు, పాదాభివందనాలు వంటి నయవంచనలతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పడరాని పాట్లు పడుతున్నారు. బెల్లమున్న చోటికే ఈగలు చేరతాయన్న నానుడిగా అధికారానికి చేరువగా ఉన్నాయని తలపోస్తున్న పార్టీల వైపు నాయకులు ఉరకలు, పరుగులు తీస్తూ, సీట్లను అందిపుచ్చుకోవడానికి అర్రులు చాస్తున్నారు. ఎన్నికల సందర్భంలో పార్టీ ఫిరాయింపులు అనైతికమన్నది ఒకనాటి నానుడి. ప్రజలకు సేవ చేయాలంటే అధికార పార్టీలో ఉంటేనే సాధ్యమవుతుందనేది నేటితరం నేతల ఉవాచ. పైపెచ్చు ప్రజలు, తమ కార్యకర్తల అభిప్రాయాల మేరకే నడుచుకొంటున్నామని ముక్తాయింపిస్తున్నారు. నైతిక విలువలకు- విలువే లేదని చెప్పకనే చెబుతున్నారు. కాలం మారింది, కాలంతో పాటు మారితేనే రాజకీయ మనుగడ, అప్పుడే ప్రజలకు సేవ చేయగలమనే భాష్యాలు చెబుతూ- ఎన్ని వేషాలైనా వేయవచ్చనే అవకాశవాద భావజాలం ఊపందుకొన్నది. రాజకీయ, సైద్ధాంతిక వైరుధ్యాలున్నా- ఉన్న పార్టీల్లోనే బానిసలుగా పడి ఉండాలనేది నేటి అధిష్ఠానాల హుకుం.

ప్రజాస్వామ్య భావ వ్యక్తీకరణకు సైతం ఊతం ఇవ్వలేని పరిస్థితులు నేటి రాజకీయ రంగంలో నెలకొని ఉన్నాయి. మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. తెలుగు జాతిని ముక్కలు చేసి- కాంగ్రెస్‌ పార్టీ సీమాంధ్రలో తన గోతిని తానే తవ్వుకొన్నది. రాజకీయ మనుగడ కోసం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికార పోరులో జబ్బలు చరుచుకొంటున్న రెండు ప్రధాన ప్రాంతీయపార్టీల్లో ఏదో ఒక పంచన చేరిపోతున్నారు. కేవలం పదవీకాంక్ష, స్వార్థ చింతనతో ఎన్నికల సందర్భంలో జరిగే పార్టీల ఫిరాయింపులను ప్రజలు ఆహ్వానించరాదు.
ఈ నేపథ్యంలో దేశ వ్యాపితంగా జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పూర్తిగా నీరుగారి పోకుండా నైతిక సై్థర్యాన్ని నింపడం కోసమన్నట్లు, భావి ప్రధానిగా కాంగ్రెస్‌ శ్రేణుల కీర్తనలు అందుకుంటున్న రాహుల్‌ గాంధీ- 2009 నాటి కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తామనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితులు తద్భిన్నంగా ఉన్నాయని గ్రహించిన నేతలు ప్రజా వ్యతిరేక వెల్లువలో కొట్టుకపోతామనే నిర్ధారణకొచ్చి పోటీ చేయలేమని పలాయనం చిత్తగిస్తున్నారు. కొత్తవారికి తర్పీదు ఇచ్చే ఎన్నికలుగా ఈ ఎన్నికలను భావించి యువతను అభ్యర్థులుగా రంగంలోకి దించాలని కేంద్ర మంత్రివర్యులు చిదంబరం సెలవిచ్చి, తన కుమారునికి పోటీ చేసే అవకాశం కల్పించారు. యు.పి.ఎ. ప్రభుత్వానికి దేశ వ్యాపితంగా ప్రతికూల గాలులు వీస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిథి కూడా అయిన్‌ పి.సి. చాకో బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రివర్యులు, రాజకీయాల్లో తలపండిన శరద్‌ పవార్‌ మాత్రం యు.పి.ఎ.కి ఈ దఫా అధికారం కల్లే అని విస్పష్టంగా ప్రకటించి రాహుల్‌ ఆశలపై చన్నీళ్ళు చల్లారు. దేశంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రాజకీయాల్లో ఆరితేరిన ప్రాంతీయపార్టీలు కాంగ్రెస్‌ పార్టీ దరిచేరడానికి సాహసిస్తాయా! కొత్త స్నేహితుల మాట అటుంచి, పాత మిత్రులు ఒక్కొక్కరే చేతికి గుడ్‌ బై చెప్పి సొంత దారులు వెతుక్కొన్నారు. యు.పి.ఎ- 2లో భాగస్వాములైన తృణమూల్‌ కాంగ్రెస్‌ నిష్క్రమణతో మొదలైన ఈ ప్రక్రియ డి.యం.కె.తో తుది దశకు చేరుకొంది. బయటి నుండి వెన్నుదన్నుగా నిలిచి ఐదేళ్ళ పాలనకు కొండంత అండగా నిలిచిన సమాజవాది పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ ప్రత్యర్థులుగా కత్తులు నూరుతున్నాయి. లోక్‌ జనశక్తి పార్టీ చెయ్యి వదిలేసి కమలాన్ని ఆశ్రయించింది. రాష్ట్రీయ జనతా దళ్‌ పార్టీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ వెంటే ఉన్నా, బీహార్‌ లో లోక్‌ సభ స్థానాల పంపకంలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపించారు. ఆర్‌.జె.డి.తో పాటు నేషలిస్టు కాంగ్రెస్‌ పార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్‌‌స కాంగ్రెస్‌ కు స్నేహితులుగా విధిలేని పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. కేరళ కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ లాంటి చిన్నా చితకా పార్టీలు మినహా స్వతంత్ర బలం ఉన్న పార్టీలేవీ కాంగ్రెస్‌తో అంటకాగడానికి సిద్ధంగా లేవు. పార్లమెంటు ఎన్నికలకు ముందు ప్రిఫైనల్‌గా భావించిన ఢిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ (గత లోక్‌ సభ ఎన్నికల్లో 206 స్థానాల్లో గెలుపొందింది) ఈ ఎన్నికల్లో వంద స్థానాలనైనా నిలబెట్టుకొంటుందా- అన్న అనుమానాలు బలపడుతుండడంతో దాని పరిస్థితి దయనీయంగా తయారయింది.

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికార పీఠాన్ని చేజిక్కించకోవడంలో ముఖ్య భూమిక పోషించింది ఆంధ్రప్రదేశ్‌. ఇక్కడ 2009 ఎన్నికల్లో 33 పార్లమెంట్‌ స్థానాలలో విజయబావుటా ఎగురవేసింది. కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం రాష్ట్ర విభజనలో అనుసరించిన నిరంకుశ వైఖరితో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో నేడు ఆ పార్టీకి అభ్యర్థులే కరవయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున నామినేషన్లు వేయడానికి కూడా ఎవరూ ముందుకు రాని దుస్థితిలో లోక్‌ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సమర్థులైన అభ్యర్థులు దొరకడం దుర్లభం. ప్రస్తుత లోక్‌ సభ సభ్యుల్లో ఏడుగురే మిగిలారు. 12 మంది లోక్‌ సభ సభ్యులు వివిధ దశల్లో కాంగ్రెస్‌ను వీడారు. ఇంకా ఒకరిద్దరు ప్రక్క చూపులు చూస్తున్నారు. కాంగ్రెస్‌ టిక్కెట్‌పై పోటీచేసి, కోట్ల రూపాయలు తగలబెట్టి సాధించేదేమిటి అన్న మీమాంసలో పార్టీ నేతలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వారికే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని ఎంపీ కనుమూరి బాపిరాజు చెప్పడమంటే అర్థం- ఇప్పుడు ఓటమి ఖాయమని ఒప్పేసుకొన్నట్లేనని పలువురు కాంగ్రెస్‌ వాదులు భావిస్తున్నారు.

పి.సి.సి. నూతన అధ్యక్షుడు రఘువీరారెడ్డి- ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఔత్సాహికులు ఎవరైనా ముందుకొస్తే కాంగ్రెస్‌ అభ్యర్థులుగా అవకాశం కల్పిస్తామని బహిరంగంగా బంపర్‌ ఆపర్‌ ఇచ్చినా స్పందన కరవయ్యింది. తెలంగాణ రాషా్టన్న్రి ప్రసాదించాం, తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్‌లో కలిపేయండని కె.సి.ఆర్‌. వెంటబడిన కాంగ్రెస్‌కు తీవ్రనిరాశే మిగిలింది. ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన కె.సి.ఆర్‌. తన విస్వరూపాన్ని ప్రదర్శించి ఎన్నికల పొత్తు కూడా ఉండదని తేల్చేసి, తెలంగాణలో ఎన్నికలపోరు తెరాస- కాంగ్రెస్‌ మధ్యనే ప్రధానంగా ఉంటుందని ప్రకటించడంతో కాంగ్రెస్‌ దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఎన్నికల తదనంతరం యు.పి.ఎ. కి మద్దతునిస్తామని కె.సి.ఆర్‌. మాటవరసకు చెప్పినా దానిని నమ్మే స్థితిలో మాత్రం ఎవరూ లేరు. తద్వారా దక్షిణాదిన బలమైన పునాదులున్న ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కోటలు కూలిపోయాయి. తమిళనాట డియంకె దూరం కావడంతో కాంగ్రెస్‌ పీకల్లోతు కష్టాల్లో ఉన్నది. అధికారంలో ఉన్న కేరళలో ముఖ్యమంత్రిపైనే వెలుగు చూసిన అవినీతి ఆరోపణలపై వామపక్ష కూటమి నాయకత్వంలో పెద్దఎత్తున ఆందోళనలు జరిగిన పూర్వరంగంలో కాంగ్రెస్‌ గడ్డు స్థితిలో ఉన్నది. కాకపోతే సిపిఐ(యం) ఆధిపత్య దోరణి ప్రదర్శిస్తున్నదని ఆరోపించి వామపక్ష ప్రజాతంత్ర కూటమి వ్యవస్థాపక పార్టీల్లో ఒకటైన రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ లో చేరడం వారిని సంతోషపరుస్తోంది. కర్ణాటకలో 2009లో 28 స్థానాలకుగాను కేవలం ఆరింటినే పొందగలిగింది.

తరువాత 2013లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో అవినీతి ఊబిలో కూరుకు పోయిన భాజపాను ఓడించి అధికారంలోకి వచ్చింది. దక్షిణాదిన ఆ పార్టీని ఇది కాస్త ఊరడినిస్తున్న అంశం. యడ్డూరప్ప, శ్రీరాములు వంటి భాజపా నేతలు సొంత కుంపట్లు పెట్టుకోవడం కూడా నాడు కాంగ్రెస్‌ గెలుపునకు దోహదపడింది. మళ్ళీ వారు సొంత గూటికి చేరిపోయారు. కుల సమీకరణలు కూడా కొంత వరకు ప్రభావితం చేయగల ఆ రాష్ట్రంలో రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో ఏ మేరకు కాంగ్రెస్‌ నెట్టుకు రాగలదో చూడాలి. గుండెకాయ వంటి ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్‌ అత్యంత దయనీయమైన దుస్థితికిలో పడింది. ఈ సువిశాల ప్రాంతంలో 180 స్థానాలుంటే 2009 ఎన్నికల్లో 86 స్థానాల్లో విజయం పొందింది. నేటి పరిస్థితిని పరిశీలిస్తే వాటిలో నాలుగవ వంతు స్థానాలనైనా నిలబెట్టుకోగలదా అన్న సంశయం కలుగుతున్నది. గత ఎన్నికల్లో రాజస్థాన్‌లో 25 కు 20, డిల్లీలో 7కు 7, హర్యానాలో 10 కి 9, ఉత్తరాఖండ్‌ లో 5 కు 5, మధ్యప్రదేశ్‌ లో 29 కి 12, యు.పి.లో 80 కి 21, పంజాబ్‌ లో 13 కు 8 గెలుపొందింది. నేడా పరిస్థితి లేదు. భాజపా గుజరాత్‌లో అధికారాన్ని పదిల పరుచుకోవడంతో పాటు మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రాషా్టల్ల్రో అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా రాజస్థాన్‌ పీఠాన్ని కైవసం చేసుకొన్నది. దాని మిత్రపక్షం అకాళీదళ్‌ పంజాబ్‌ లో పాగా వేసింది. ఈ రాషా్టల్రతో పాటు తామే అధికారంలో ఉండి అభాసుపాలైన హర్యానా, ఉత్తరాంచల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాషా్టల్ల్రో బి.జె.పి.ని- అత్యంత బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ ఎదురొడ్డి నిలవడం దుస్సాధ్యంగా కనబడుతున్నది.

ఇటీవలే అవమానకరమైన ఓటమిని చవిచూసిన దేశ రాజధానిలో ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, భాజపాల మధ్యే సంకుల సమరం జరుగబోతున్నదన్న వాతావరణంలో కాంగ్రెస్‌ ఊసెత్తే వారే లేకుండా పోయారు. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను పునరావాసం కింద కేరళ గవర్నర్‌ గా పంపిచేశారు.
తూర్పు భారత దేశంలో 118 స్థానాలుంటే 15వ లోక్‌ సభ ఎన్నికల్లో కేవలం 15 స్థానాల్లోనే గెలిచింది. అందులో ఆరింటిని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడ్పాటుతో సాధించుకొన్నది. ఈ దఫా మమతా బెనర్జీ బయటికి గెంటి వేయడంతో 42 స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌, అలాగే 21 స్థానాలున్న ఒడిశాలో కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ చేస్తున్నది. నలబై స్థానాలతో మరొక పెద్ద రాష్టమ్రైన్‌ బీహార్‌లో లాలూప్రసాద్‌ యాదవ్‌ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి, ఆయన కేటాయించిన పన్నెండు స్థానాలకే పరిమితమై పోటీ చేయాల్సిన దుస్థితి. పోయిన ఎన్నికల్లో రెండింటిలోనే గెలిచిన కాంగ్రెసుకు ఇప్పుడు అంతకంటే మెరుగైన అవకాశాలు లేవన్నది స్పష్టం. 14 స్థానాలునాలు ఉన్న జార్ఖండ్‌ పరిస్థితీ అంతే. అప్రతిష్ఠపాలైన్‌ జార్ఖండ్‌ ముక్తి మోర్చా, ఆర్‌.జె.డి.పైన ఆధారపడే నెట్టుకు రావాలి. ఈశాన్య భారత దేశంలో 24 స్థానాలుంటే 2009 ఎన్నికల్లో 13లో గెలిచిన కాంగ్రెస్‌ అస్సాం, మణిపూర్‌లలో మునుపటి ఫలితాలు పొందడానికి ఆపసోపాలు పడవలసిందే. సెవన్‌ సిస్టర్‌‌సగా పిలిచే ఆ రాషా్టల్ల్రో బలంగా వేళ్ళూనికొని ఉన్న అస్సాం గణపరిషత్‌, నాగాలాండ్‌ పీపుల్‌‌స ప్రంట్‌, మిజో నేషనల్‌ ప్రంట్‌, సిక్కిం డెమోక్రటిక్‌ ప్రంట్‌, మణిపూర్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వంటి పది ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. త్రిపురలో సిపిఐ (యం) తిరుగులేని శక్తిగా ఉన్నది.

పశ్చిమ భారతాన ఉన్న 78 స్థానాల్లో కాంగ్రెస్‌ 29 మాత్రమే గెలిచింది. దాని మిత్రపక్షం శరద్‌ పవర్‌ నాయకత్వంలోని నేషనలిస్‌‌ట కాంగ్రెస్‌ పార్టీ ఎనిమిదింటిలో గెలిచింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నది. కేంద్ర ప్రభుత్వ అవినీతి కుంభకోణాలకు తోడు ఆదర్‌‌శ కుంభకోణంతో అభాసుపాలైన్‌ మహారాష్ట్రలోని కాంగ్రెస్‌ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ నిర్వాకం పర్యవసానంగా 48 స్థానాల్లో ఎన్నింటిని నిలుపుకోగలదో! భాజపా, శివసేన కూటమితో పాటు ఈసారి ఆమ్‌ ఆద్మీ పార్టీని కూడా ఎదుర్కోవలసి ఉన్నది. ముంబాయిలో ఉన్న ఆరు స్థానాలను గతంలో కాంగ్రెస్‌ గెలిచింది. ఢిల్లీ శాసనసభ ఫలితాల ప్రభావం పడ్డ మహానగరాలలో ముంబాయి ముందు వరసలో ఉన్నదన్న వార్తల మధ్య కాంగ్రెసు గడ్డు పరిస్థితిని ఆ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నది. గుజరాత్‌లో భాజపా స్థానం పదిలం కావడంతో పాటు నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అభ్యర్థి కావడంతో 26 స్థానాలున్న ఆ రాష్ట్రంలో గతంలో సాధించుకొన్న 11 నిలబెట్టుకోవడం దుర్లభమే!

మూలిగే నక్కపై తాటి కాయపడ్డ నానుడిగా కాంగ్రెసు రానున్న ఎన్నికల్లో 70-80 స్థానాలకే పరిమితమవుతుందని పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తేలిపోవడంతో ఆ పార్టీ మరింత జావగారి పోయిందనే చెప్పవచ్చు. కాకపోతే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ శ్రేణులు చేజారి పోకుండా పెనుగులాడుతున్నది. 2009 ఎన్నికల్లో లాగా అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించే అవకాశాలు మృగ్యమయిపోయాయని రూఢిగా తెలిసినా- భాజపా ప్రత్యర్థి పార్టీల్లో కాంగ్రెస్‌ మాత్రమే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, తమను కాదని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశమే లేదని బలంగా విశ్వసిస్తున్నది. అదొక్కటే కాంగ్రెస్‌ పార్టీకి ఇంకా మిణుగు మిణుగు మంటున్న ఆశ.

No comments:

Post a Comment