Thursday, April 17, 2014

కమలనాథుల అంతర్మథనం

Surya Daily 8th April 2014

పని చేయని గాంధేయ సోషలిజం
రెండు సార్లే తోడ్పడిన రామజన్మభూమి
వికటించిన బదేశం వెలిగిపోతోంద్పి నినాదం
దశాబ్దం పాటు ప్రతిపక్షంలో...
దూరమైన భాగస్వామ్య పక్షాలు
పార్టీలో అంతర్గత నాయకత్వ పోరు
ఆర్ధిక విధానాలలో కాంగ్రెస్‌తో తేడా లేదు
బలమైన రాషా్టల్ల్రో ఎంపీ స్థానాలు పరిమితం
దక్షిణాది, ఈశాన్య రాషా్టల్రు కీలకం


మతతత్వ పార్టీగా ముద్రపడి, రాజకీయ అంటరానితరానికి గురై అధికారానికి చేరువ కాలేకపోతున్న భాజపా అంతర్మథనంలో పడింది. ఒకనాడు గాంధేయ సోషలిజం నినాదాన్ని చ్చినా ప్రయోజనం ఒనగూడలేదు. అయోథ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిర నిర్మాణమే కర్తవ్యంగా ప్రకటించి, హిందువు మనోభావాల ను సొమ్ముచేసుకొని, రెండు దఫాలు అతల్‌ బిహారీ వాజపాయి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిం ది. దేశం వెలిగి పోతున్నది- నినాదంతో2004లో ఘోరపరా జయాన్ని చవిచూసింది. దశా బ్దంపాటు ప్రతిపక్షంలో కూర్చున్నది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత మీదనే ఆధారపడకుండా, హిందుత్వ భావజాలంతో- అస్తిత్వ భావజాలాన్ని (కులం కార్డు) కలగలిపి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలని సంఘ్‌ పరివార్‌ కూటమి పథకం రచించింది. త్రివేణి సంగమంగా ప్రసిద్ధికెక్కిన వారణాసి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని మోడీ బరిలో దిగడంద్వారా కమలనాథుల మనోగతం వెల్లడయ్యింది.
ఉత్తరప్రదేశ్‌లో రామ బాణాన్ని ప్రయోగించి 1991,1996,1998 సాధారణ ఎన్నికల్లో 85 స్థానాలకు గాను వరుసగా 51, 52, 57 చొప్పున తమ ఖాతాలో వేసుకోగలిగారు. 1984 ఎన్నికల్లో 7.74 శాతం ఓట్లతో 2 లోక్‌ సభ స్థానాలల్లో గెలుపొందిన భాజపా, 1989లో 85 (11.36 శాతం), 1991లో 120 (20.11శాతం), 1996లో161 (20.29 శాతం), 1998లో 182 (25.59 శాతం) స్థానాలన పెంచుకోగలిగింది. 1999లో 182 స్థానాలను నిలబెట్టుకొన్నా ఓట్లు 23.75 శాతానికి పడిపోయాయి. 2002లో గోద్రా ఘటనల అనంతరం మైనారిటీ మతస్థులపై మారణహోమం మోడీని, భాజపాను వెన్నాడుతూనే ఉన్నది. యన్‌డిఎ భాగస్వాములైన మిత్రపక్షాలు ఒక్కొక్కటే దూరమైనాయి. పర్యవసానంగా 2009 నాటికి 116 స్థానాలు, 18.8 శాతం ఓట్లకు పడిపోయింది. ఈ పూర్వరంగంలో ఇప్పుడు డిల్లీ పీఠాన్ని సొంతం చేసుకోవలసిందేనన్న పట్టుదలతో కాషాయదళం పావులు కదుపుతున్నది. వాజ్‌ పాయ్‌ కాలంనాటికి నేటికి పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు సంభవించాయి. అస్తిత్వ రాజకీయాలు ఉనికిలోకి వచ్చాయి. అనంతరం బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి- అనుభవాల నుండి గుణపాఠాలు నేర్చుకొని, బ్రాహణ- వైశ్య- దళిత కులాల ఐక్యతా నినాదంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకొన్నారు. ఆ ఫార్ములాను తమ దృక్పథంతో అమలుచేసి రాజకీయ లబ్ధి పొందాలని సంఘ్‌ పరివార్‌ నిర్ధారణకు కొచ్చినట్లుంది. అందుకే రామమందిర నిర్మాణం, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 తొలగింపు వంటి వివాదాస్పద అంశాలను కాస్త వెనక్కు నెట్టినట్లు కనబడుతున్నది. కొత్త మిత్రుల వేటలో నిమగ్నమయ్యింది. కొంత వరకు సత్ఫలితాలను పొందినట్లే కనబడుతున్నది. కానీ, దేశ రాజకీయాలు సంక్లిష్టంగా, అస్పష్టంగా ఉన్నాయనడంలో సందేహం లేదు.
ఒకే తానులోని ముక్కలు:
ఆర్థిక విధానాలు, అవినీతి అంశాల్లో కాంగ్రెస్‌- భాజపా ఒకే తాను ముక్కలని ప్రజలు నిర్ధారణకొచ్చేశారు. సరళీకృత ఆర్థిక విధానాల పేరిట ఉభయులూ కార్పొరేట్‌ రంగానికి దాసోహం చేస్తున్నారు. మోడీ తాత్విక చింతన బడా వ్యాపార వర్గాలకు అనుకూలం, బిజినెస్‌ ఫ్రెండ్లీ అన్న భావన విస్తృతంగా ప్రచారంలో ఉన్నదే. వాజ్‌ పాయ్‌ కాలంలోనూ బహుళజాతి సంస్థలకు, అమెరికాకు అనుకూలమైన విధానాలనే అమలు చేసిన చరిత్రఉంది. కర్ణాటకలో అధికారంతో సాగించిన అవినీతి మరకలు మాసిపోలేదు. అందువల్ల కేవలం యుపిఎ ప్రభుత్వ వ్యతిరేకతపై ఆధారపడితే లాభం లేదన్న ఆలోచన భాజపా చేసినట్లుంది. గుజరాత్‌ నమూనా అభివృద్ధి నినాదం, కుల, ప్రాంతీయ పార్టీలను ఆకర్షించుకోవడం, వీలైనన్ని ఎక్కువ స్థానాలతో లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా అవతరించి, ఎన్నికల అనంతరం మరికొంత మందిని తమవైపుకు తిప్పుకోవడం ద్వారా అధికారంలోకి రావాలని భాజపా నాయకత్వం ఉవ్విళ్ళూరుతున్నది. ఏడాది క్రితంనుంచే కుల సమ్మేళనాలకు ముఖ్యఅతిథిగా హాజరవుతూ మోడీ చేసిన ప్రసంగాల సారాంశం, తాజాగా బడుగు, బలహీన తరగతులకు చెందిన కులాల ప్రాతిపదికపై మనుగడ సాగిస్తున్న పార్టీలతో ఎన్నికల ఒప్పందాలు చేసుకోవడాన్ని బట్టి భాజపా పోకడ తేటతెల్లమవుతున్నది. బీహార్‌లో రాంవిలాస్‌ పాశ్వాన్‌ (లోక్‌ జనశక్తి పార్టీ), మహారాష్ట్రలో రాందాస్‌ అథవాలె (రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), హర్యానా జన్‌ హిత్‌ కాంగ్రెస్‌, ఇరవైవ శతాబ్దం ప్రారంభంనుండి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి కేంద్ర స్థానంగా నిలిచిన తమిళనాట సినీ నటుడు విజయకాంత్‌ పార్టీ అయిన డియండికె, డా యస్‌. రాందాస్‌కు చెందిన్‌ పియంకె, వి. గోపాలస్వామి (వైకో) పార్టీ యండియంకె, కెయండికె, ఐజెకె వంటి చిన్న చితకా పార్టీలతో కూటమిగా ఏర్పడి, సీట్ల ఒప్పందం కుదుర్చుకొన్నది. కేరళలో కూడా ఈ తరహా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.
కాంగ్రెస్‌పీడ విరగడై ప్రజానుకూల ప్రభుత్వం రావాలని జనం కోరుకొంటున్నారు. అధికార పగ్గాలను చేజిక్కించుకొని కార్పొరేట్‌ సేవకు పునరంకితం కావాలని, హిందుత్వ భావజాల పునాదులను పటిష్ఠ పరచాలని మోడీ కలలు కంటున్నారు. నాడు భాజపాలో ఉదారవాదైన వాజ్‌ పాయ్‌ నాయకత్వం కింద కొన్ని బలమైన ప్రాంతీయ పార్టీలు యన్‌డిఎ కూటమిలో భాగస్వాములైనాయి. నేడు కరడుగట్టిన హిందుత్వవాదిగా పేరుపడ్ద బిజెపి నాయకత్వాన్ని అంగీకరించి ఎంత మంది జై కొడతారో వేచి చూడవలసిందే! ఎన్నికల తదనంతర రాజకీయ పరిణామాలు, పార్టీల పునరేకీకరణాలు, ఆయా పార్టీలు గెలుపొందిన లోక్‌ సభ సభ్యుల సంఖ్యమీద ఆధారపడి కూడికలు, తీసివేతలే కేంద్రంలో అధికారంలోకి ఎవరొస్తారో తేలుస్తాయి. అయినా, తమ అభ్యర్ధే కాబోయే ప్రధాని అని భాజపా శ్రేణు లు ఊదరగొట్టేస్తున్నా యి. నిజానికి కాషాయ దళం మంచి ఊపుమీదుంది. ఆ పార్టీ ప్రచార హోరుతో ఊదరకొడుతున్నది. దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టడంలో బాగా కాంగ్రెస్‌ వెనుకబడిపోయింది. రాజకీయ సమీకరణాల ముఖ చిత్రాన్ని పరిశీంచే వారికి- పీఠం మోడీకి దక్కుతుందా అన్న అనుమానం రాకమానదు. భాజపాలో పలువురు సీనియర్‌ నేతలు పదవీ వ్యామోహంతో ఆధిపత్య పోరు కొనసాగిస్తున్న ఉదంతా లు వెలుగులోకి వచ్చాయి. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయం లో అలకలు, బుజ్జగిం పులు, ధిక్కా రధోరణులు కనబడుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి మోడీ హవా నడుస్తున్నట్లు పైకి కనబ డుతున్నా, అవకాశం దొరికితే అంది పుచ్చుకోవడానికి కొందరు సీనియర్లు సిద్ధంగా ఉన్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అధికారం- భావజాలం:
అద్వానీ, మోడీ- ఇద్దరూ హిందుత్వవాదులే. ఇద్దరి మధ్య గురు శిష్యుల బంధమే ఉన్నదని బాహ్యప్రపంచానికి వినిపిస్తూనే ఉంటారు. భాజపా అధికారంలోకి రావాలన్నది ఉభయుల కల. ఢిల్లీ గద్దె కోసం ప్రచ్ఛన్న యుద్ధం చేసుకొంటున్నారు. భాజపాలో సాగుతున్న ఈ రగడకు మరో కోణంకూడా లేకపోలేదనిపిస్తోంది. హిందుత్వవాద భావజాలానికి మూలస్థంభం వర్ణవ్యవస్థ. ఆ చట్రాన్ని బలహీనపరిచే నిర్ణయాలను జీర్ణించుకోలేని వారి మనోవేదనకూడా ఘర్షణ వెనుకదాగి ఉన్నదనిపిస్తోది. వైవిధ్యభరితమైన భారత దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకొంటూ, ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠవంతం చేసుకోవాలంటే లౌకిక వ్యవస్థ పదిలంగా ఉండాలని రాజ్యంగ నిర్మాతలు విశ్వసించి తదనుగుణంగా రాజ్యాంగ చట్రాన్ని రూపొందించారు. మతాన్ని రాజకీయాలలో చొప్పించడం రాజ్యాంగ వ్యతిరేకం. దేశ ఐక్యతకే పెనుముప్పు సంభవిస్తుంది. కాషాయ దళం నిజమైన దేశభక్తులమని చెప్పుకొంటూనే రాజకీయ ప్రయోజనాలకోసం మతానికి రాజకీయ రంగు పులిమింది.
రామజన్మభూమి విముక్తి పేరిట ఎల్‌.కె. ఆద్వానీ రథయాత్ర చేసి,400 సంవత్సరాల చరిత్రఉన్న బాబ్రి మసీదు నేలమట్టానికి కారణమై, ఆ మంటల వేడిలో రెండు స్థానాల (9వ లోక్‌ సభలో) నుండి 12వ లోక్‌ సభలో 182 స్థానాలకు ఎగబాకి అధికారాన్ని హస్తగతం చేసుకొన్నారు. ఈ మొత్తం రాజకీయోద్యమానికి నేతృత్వం వహించింది ఆద్వానీయే అయినా- హిందూ మతోన్మాది అన్న ముద్రను మూటగట్టుకొన్న ఆయనకు ప్రధాని పీఠం దక్కలేదు. ఆద్వానీని భుజాల మీద మోయడానికి లౌకిక, ప్రజాతంత్ర భావాలున్న బలమైన ప్రాంతీయ పార్టీలు నాడు ముందుకు రాలేదు. భాజపా నాయకుడైనా వాజ్‌పాయ్‌ ఉదారవాది అన్న భావనతో ఆయనను పల్లకీ ఎక్కించడానికి సుముఖత వ్యక్తం చేయడంతో- యన్‌డిఎ కూటమి ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ కూటమి 2004 వరకు అధికారంలో కొనసాగింది. మాజీ ప్రధాని వాజ్‌ పాయ్‌ అనారోగ్యంతో క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకోవలసి వచ్చింది. ఆద్వానీయే భాజపాకు పెద్ద దిక్కుగా మిగిలారు. ఆద్వానీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకొని 15వ లోక్‌ సభ ఎన్నికల్లో పోరు చేసినా ఫలితం దక్కలేదు.
2014 ఎన్నికల సందర్భానికి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం భ్రష్ఠుపట్టి పోయింది. అందువల్ల ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భాజపాకు కాస్త సానుకూల వాతావరణం కనిపించడం సహజం. దాన్ని అందిపుచ్చుకునేందుకు- హిందుత్వవాదాన్ని కులవాదంతో అనుసంధానించక పోతే అధికారాన్ని పొందడం అసాధ్యమన్న తాత్విక చింతనలో భాగంగానే నరేంద్రమోడీని భాజపా రంగం మీదికి తెచ్చింది. ఆయన విశ్వసనీయమైన, హిందుత్వ వాదిగా కాల పరీక్షలో నిగ్గుదేలిన, వెనుకబడ్ద కులానికి చెందినవారు కావడంతో ఆయనను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటింపచేసి, ఎన్నికల సమరానికి శంఖారావం పూరించేలా సంఘ్‌ పరివార్‌ చేసిందన డంలో సందేహం లేదు. ఆద్వానీని ఒకసారి ప్రధాని అభ్యర్థిగా ముందు పెట్టుకొని ఎన్నికల్లో దిగినా ఫలితం దక్కలేదని, ఇప్పు డు వయసు మీదపడిందని వగైరా కబుర్లెన్ని పైకి చెప్పి నా అసలు తంతు వెనుక దాగిఉన్న చిదంబర రహస్యం వేరని అర్థమవు తూనే ఉన్నది. అంతిమంగా ఆద్వానీకి వలె మోడీకి కూడా ఢిల్లీ పీఠంపై కూర్చు నే భాగ్యం కలగకపోవచ్చనే సూచనలూ కనిపిస్తు న్నాయి. మోడీయే భాజపా కు బలం, బలహీనత- అన్న ప్రచారం కూడా సాగుతున్నది. నాటికీ నేటికీ మిత్రులసంఖ్య తగ్గిపో యింది. ఇరవైకి పైగా మిత్రపక్షాల భాగస్వా మ్యమున్న యన్‌డిఎ కూటమికి తిరుగులేని నాయకుడుగా వాజ్‌పేయ్‌ 1999లో ఎన్నికల్లో విజయ బావుటా ఎగరేశారు. నేడు వివిధరాషా్టల్రలో ప్రాంతీయ పార్టీలు శక్తిమంతమైనవిగా ఆవిర్భవించాయి. వాటితో పొత్తు లేకుండా ఎన్నికల్లో గెలుపొందడం గానీ, అధికార పీఠాన్ని అధిరోహించడం గానీ జరగని పని. వాటిలో కొన్నింటిని గడచిన దశాబ్ద కాలంగా కాంగ్రెస్‌ పార్టీ నయానో భయానో తనవెంట తీసుకెళ్ళ గలిగింది కాబట్టే అధికారంలో కొనసాగింది. కాంగ్రెస్‌కు కూడా చాలా పార్టీలు దూరమైనాయి.
అయితే ఇప్పుడు పాతమిత్రులు కానీ, కొత్త మిత్రులు కానీ భాజపా దరి చేరడానికి విముఖత ప్రదర్శిస్తున్నారు. బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలోని బలమైన జనతా దళ్‌(యు) విడాకులిస్తే, పరిమిత బలమున్న రాం విలాస్‌ పాశ్వాన్‌ నాయకుడుగా ఉన్‌‌న లోక్‌ జనశక్తి దగ్గరకు చేరింది. యుపి, బీహార్‌లలో120 స్థానాలుంటే, పోయిన ఎన్నికల్లో కేవలం 22 గెలిచింది. అక్కడ బలం పుంజుకోకుండా డిల్లీలో చక్రం తిప్పుతామంటే కుదరదు. దక్షిణాదిన 121 స్థానాలుంటే ఒక్క కర్ణాటకలో 19 గెలిచారు. అటుపై అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన భాజపా ప్రతిష్ఠ దేశ వ్యాపితంగా మంటగలిసింది, యడ్డూరప్ప, శ్రీరాములు వంటి వారు బయటికెళ్ళి శాసనసభ ఎన్నికల్లో భజపాకి చావుదెబ్బ కొట్టి అధికారాన్ని కాంగ్రెసుకు అప్పజెప్పారు. అధికారమే పరమావధిగా భావించి మళ్ళీ వాళ్ళను బ్రతిమాలుకొని పార్టీలో చేర్చుకొన్నారు. అయినా గతంలో గెలిచిన స్థానాల సంఖ్య బాగా తగ్గే సూచనలే ఉన్నాయి. కేరళలో కొద్ది పాటి ఓట్లను రాబట్టుకొనే స్థితిలో ఉన్నదే కానీ, సీట్లను తెచ్చుకొనే స్థితిలో లేదు.
తమిళనాట వేళ్ళూనుకొని ఉన్న జయలలితతో మోడీకి మంచి స్నేహ సంబంధాలున్నాయని తలంచినా, ఆమె మెదడులో కూడా ప్రధాని కావాలనే తలంపు రావడంతో సీను తిరగబడింది. విజయకాంత్‌, వైకో, రాందాస్‌ పార్టీలతోబాటు మరో రెండు చిన్న పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసుకొని, తమకందరికీ కలిపి, గత ఎన్నికల్లో దాదాపు 20 శాతం ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వగల శక్తిని సంతరించుకొన్నామని చెప్పుకొంటున్నారు. విజయకాంత్‌ పార్టీకి చెందిన 8 మంది శాసనసభ్యులు, కడకు ఆయన సోదరుడు సైతం జయలలిత పంచన చేరిపోయారు. దక్షిణాదిన భాజపాకు అదనపు బలం చేకూరిన దాఖలాలు కనబడడం లేదు. బీహార్‌ మినహాయించి తూర్పు, ఈశాన్య భారత దేశంలో 102 స్థానాలుంటే 2009లో భాజపా గెలిచింది 14 మాత్రమే. వాటిలో 8 జార్ఖండ్‌, 4 అస్సాం, 1 గూర్ఖాలాండ్‌, మరొకటి అండమాన్‌ నికోబార్‌. ఈ సంఖ్యను నిలుపుకోవడానికే ఆపసోపాలు పడవలసి ఉన్నది. మోడీకి ఢిల్లీ పీఠంపై మోజు ఉండవచ్చు. కార్పొరేట్‌ దిగ్గజాల అండ పుష్కలంగా ఉండవచ్చు. కానీ ఆయన ఆశలకు అడ్డుకట్ట వేయడానికి ప్రధానంగా రెండు వ్యతిరేక శక్తులు బలంగా ఉన్నాయని ధృవపడుతున్నది. ఒకటి- మోడీ అంటే గిట్టని ప్రాంతీయ పార్టీలు, భావజాల రీత్యా వర్గ శత్రువులై వామపక్షాలు. రెండు- భాజపా లోని మోడీ వ్యతిరేక శక్తులు.
ప్రధాని అభ్యర్థిగా మోడీ ఎంపిక సందర్భంలో ఆద్వానీ వంటి సీనియర్‌ నాయకుల నుండి గట్టి ప్రతిఘటనను ఎదుర్కోవలసివచ్చింది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో మోడీ వ్యతిరేకుల రాజకీయభవిష్యత్తుకు శుభంకార్డు వేయాలని మోడీ అంతర్గతంగా ప్రయత్నించినట్లు అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో ఆరోపణలు వచ్చాయి. ఆద్వానీని రాజ్యసభకు పంపాలనే ప్రతిపాదన గుప్పుమనడం, మోడీ మీద విశ్వాసం సన్నగిల్లి గాంధీనగర్‌ నుండి కాకుండా భోపాల్‌ నుండి పోటీ చేస్తానని ఆద్వానీ పట్టుపట్టడం, మురళీ మనోహర్‌ జోషీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుండి ఆయన్ను తప్పించి మోడీయే స్వయంగా పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం, జస్వంత్‌ సింగ్‌ కోరికను తిరస్కరించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసి, బహిష్కరణకు గురైన పరిణామాలు భాజపాలో ఆంతరంగికంగా కొనసాగుతున్న రగడకు నిదర్శనం. యన్‌డిఎలో నిన్నటి వరకు ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉండిన జనతా దళ్‌(యు) నేత, బీహార్‌ ముఖ్యమంత్రి- మోడీని తెగనాడుతూ, ఆద్వానీని పొగడడం చూస్తుంటే మోడీకి ఇంట- బయటా శత్రువులు అధికంగానే ఉన్నారనిపిస్తున్నది. మోడీ పనితీరు ఆయన పార్టీ సహచరులకే మింగుడుపడని పరిస్థితి ఉన్నా, అధికారానికి చేరువుగా ఉన్నామనే ఆశతో మింగలేక కక్కలేక ఉన్నారు. భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించినా మోడీని బలపరచడానికి కొత్త మిత్రులు ముందుకురాని పరిస్థితి ఎదురైనప్పుడు ఆంతరంగికంగాఉన్న మోడీ వ్యతిరేక శక్తులు గళం విప్పే అవకాశాలున్నాయి.
భాజపాకు 1999లో వచ్చిన 182 స్థానాలైనా వస్తాయా- అన్న సంశయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. భాజపా అధికారంలో ఉన్న గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ గఢ్‌, రాజస్థాన్‌ రాషా్టల్రలో బలంగా ఉన్నమాట నిజం. కాకపోతే ఆ రాషా్టల్రలో ఉన్న లోక్‌ సభ స్థానాలెన్ని అన్నదే ప్రశ్న. మొత్తం 542 లోక్‌ సభ స్థానాలకు గాను 91 మాత్రమే ఆ రాషా్టల్ల్రో ఉన్నాయి. వాటిలో అత్యధికంగా భాజపా గెలుపొందే అవకాశాలే మెండుగా ఉన్నాయి. కారణం- బలహీనంగాఉన్న కాంగ్రెస్‌తో భజపా ముఖాముఖి తలపడడమే. గత ఎన్నికల్లో 43 స్థానాల్లో గెలుపొందారు. రాజస్థాన్‌లో కూడా అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఆ నాలుగు రాషా్టల్ల్రో ఆ సంఖ్యను బాగా పెంచుకోవచ్చు. మోడీ ప్రభంజనం ఉన్నదని, రేపు అధికారంలోకి వచ్చేది తామేనని, తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలతో ఎక్కువ స్థానాలను పొందే ప్రయత్నాలు చేస్తున్నది. సిబిఐని కాంగ్రెస్‌ ఆయుధంగా వాడుకొన్నట్లే, భాజపా కూడా వాడుకొం టుందేమో అన్న భయం ఉన్నవారు లేకపోలేదు. ెఫెడరలిజాన్ని గొడ్డలి వేటుకు గురిచేయడంలో కూడా కాంగ్రెసుకు, భాజపాకు తేడాలేదు. అందువల్ల బలమైన ప్రాంతీయ పార్టీలు జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నట్లుంది.కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, అసోం మినహా ఈశాన్య రాషా్టల్రలో ఖాతా నే తెరవలేని స్థితిలో ఉన్న భాజాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత సులభం కాదు.

No comments:

Post a Comment